పతకాలలో హాఫ్ సెంచరీ దాటిన భారత్
100
ఏషియన్ గేమ్స్లో భారత పతకాల సంఖ్య 50కి దాటింది. ఏకంగా ఒకే రోజు 15 పతకాలను భారత కైవసం చేసుకుంది. ఏషియన్ గేమ్స్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. చైనాలో హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఏషియన్ క్రీడల్లో ఇండియా ప్లేయర్లు దూసుకెళుతున్నారు. గేమ్స్ 8వ రోజైన ఇండియాకు మూడు స్వర్ణాలు సహా 15 పతకాలు వచ్చాయి. దీంతో ఏషియన్ గేమ్స్ లో భారత పతకాల సంఖ్య హాఫ్ సెంచరీ కీ చేరింది. ఇప్చటికే 53 పతకాలకు సాధించింది. మొత్తం 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలుకు చేరుకుంది. ఈసారి ఆసియా క్రీడల్లో 100 పతకాలు సాధించాలన్న భారత్ టార్గెట్ నెలవేరేలా కనిపిస్తోంది. అక్టోబర్ 8 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పతకాల పంట పండిస్తున్నారు.
భారత్ చివరిసారిగా 1982లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో గుర్రపు స్వారీలో స్వర్ణ పతకాన్ని సాధించింది. అంతకుముందు, చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల మూడో రోజున, సెయిలర్ నేహా ఠాకూర్ భారత్కు రజత పతకాన్ని అందించింది. సెయిలింగ్లోనే ఇబాద్ అలీ కాంస్య పతకం సాధించాడు. మంగళవారం భారత హాకీ జట్టు బలమైన ఆటను కనబరిచింది. ఆ జట్టు 16-1 తేడాతో సింగపూర్పై విజయం సాధించింది. అంతకముందు ఉజ్బెకిస్థాన్పై కూడా 16 గోల్స్ చేసింది.
నెరవేరిన ఏళ్ల నిరీక్షణ 100
హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో గుర్రపు స్వారీ పోటీలో టీమ్ డ్రెస్సేజ్ ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్. బంగారు పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దివ్యకీర్తి సింగ్, హృదయ్ విపుల్ ఛెడ్ కెమ్క్స్ప్రో ఎమరాల్డ్ అడ్రినలిన్ఫి ర్ఫోడ్ రైడింగ్ చేస్తున్న అనుష్క అగర్వాలా (ఎట్రో) మొత్తం 209.205 శాతం స్కోర్తో అగ్రస్థానంలో నిలిచింది.
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల మూడో రోజు భారత్ భారీ విజయాన్ని అందుకుంది. ఆసియా క్రీడలు 2023 మూడో రోజు గుర్రపు స్వారీలో భారత్ స్వర్ణ పతకం సాధించింది. ఆసియా క్రీడలు 2023లో భారత్కు ఇది మూడో బంగారు పతకం. దీంతో భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు ఉన్నాయి.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది. రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ప న్వర్ల బృందం ఈ స్వర్ణం సాధించింది. ఆసియా క్రీడలు 2023లో భారత్కు తొలి స్వర్ణం అందించింది. ఇదిలా ఉండగా ఆదివారం తొలి రోజు భారత్కు ఐదు పతకాలు దక్కాయి. వీటిలో రోయింగ్లో రెండు రజతాలు, ఓ కాంస్యం షూటింగ్లో ఓ రజతం, కాంస్యం ఉన్నాయి.
టార్గెట్ కి చేరువలో భారత్ 100
ప్రస్తుత ఏషియన్ గేమ్స్లో ఇండియా ఇప్పటి వరకు 53 పతకాలు గెలుచుకొని మెడల్స్ టేబుల్లో నాలుగో స్థానంలో ఉంది. 242 పతకాలతో చైనా టాప్లో ఉంది. 100 పతకాలు గెలువాలన్న లక్ష్యంతో 19వ ఏషియన్ క్రీడల్లోకి భారత్ అడుగుపెట్టింది. అక్టోబర్ 8వ తేదీ వరకు క్రీడలు జరగనుండటంతో అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.