Elections
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం అయిదు రాష్ట్రాల్లో కలిపి679 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 16కోట్ల 14 లక్షలమంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మధ్యప్రదేశ్,రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఇవాల్టినుంచే ఎన్ని కల కోడ్ అమల్లోకి వస్తుంది. మన తెలంగాణలోనవంబర్ 30న పోలింగ్ జరుగుతుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.
ఎన్నికలకు నోటిఫికేషన్ నవంబర్ 3న రిలీజ్ చేస్తారు. నామినేషన్ల సమర్పణకు నవంబర్ 10వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. నామినేషన్లను నవంబర్ 13న పరిశీలిస్తారు. ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకోదలిస్తే అందుకు నవంబర్ 15 డెడ్ లైన్ గా పెట్టారు. తెలంగాణలో 18 ఏళ్లు నిండి తొలిసారి ఓటు హక్కుపొందిన వారు 8.11 లక్షల మంది ఉన్నారు. వీరంతా ఏ పార్టీకి ఓటేస్తారు అన్నది కీలకంగా మారనుంది.
ఎక్కడెక్కడ ఎవరెవరికి పోటీ?
మధ్యప్రదేశ్ లో 230, రాజస్థాన్ లో200, ఛత్తీస్ గఢ్ లో 90, మిజోరంలో 40, తెలంగాణలో 119 నియోజక వర్గాలు ఉన్నాయి. బీజేపీ పరిపాలిస్తున్న మధ్య ప్రదేశ్ లో ఎన్నికలు నువ్వా నేనా అనే రీతిలో జరగబోతున్నాయి. ఇండియా కూటమికి బీజేపికి మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. తెలంగాణకు వస్తే ఈసారి ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. బీజేపి, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలను బీఆర్ ఎస్ చాలా బలంగా ఎదుర్కొనాల్సి వస్తోంది.ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ సర్కార్ బీజేపీని ఎదుర్కొనాల్సి ఉండగా మిజోరంలో బీజేపి, కాంగ్రెస్ లకు సమానావకాశాలున్నాయి. అక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది.
పోలింగ్ తేదీల వివరాలు Elections
ఇక ఈ ఐదు రాష్ట్రాల్లోనూ 40రోజుల పాటు పరిస్థితులను సమీక్షించి, అక్కడి ప్రభుత్వాలు,పార్టీలను సంప్రదించాకే ఎన్నికల నిర్వహణకు తుది నిర్ణయం తీసుకున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ భారీగా మహిళా ఓటర్ల సంఖ్య పెరగడంతో ఈసారి ఫలితాలపై ఆసక్తి పెరిగింది. ఎన్నికల తనిఖీల కోసం మొత్తం 940 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు.
మిజరంలో ఒక విడతలోనే నవంబర్ 7న ఎన్నికలు Elections జరుగుతుండగా, ఛత్తిస్ గఢ్ లో రెండు విడతల పోలింగ్ నవంబర్ 7, 17 న జరుగుతుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడ రెండు దశల్లో పోలింగ్ తప్పనిసరి అయ్యింది.నవంబర్ 30న తెలంగాణలో సింగిల్ ఫేజ్ పోలింగ్ జరుగుతుండగా, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లకు కూడా సింగిల్ ఫేజ్ లోనే నవంబర్ 23న ఎనికలు జరుగుతాయి. మొత్తానికి డిసెంబర్ 5తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
వృద్ధుల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఈసారి 80 ఏళ్లు దాటిన వారంతా ఇంటినుంచే ఓటు వేసేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం.తెలంగాణలో 80 ఏళ్లు పై బడిన ఓటర్లు 4.43 లక్షల మంది ఉన్నారు. వీరంతా కూడా ఇంటినుంచే ఓటే వేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.