ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్ర దాడులు జరపడానికి ఆల్అక్సా మసీదు వివాదమే కారణం. ఈ రెండుదేశాల మధ్య ఘర్షణలు ఈ నాటివి కాదు.. 1973 అక్టోబర్ 6 న యూదులకు పరమపవిత్రమైన యోం కిప్పుర్ ఉత్సవం. ఆరోజున ఇజ్రాయిల్ ఆక్రమిత భూభాగాలపైఅరబ్ దేశాలు మెరుపు దాడులు చేశాయి. యోం కిప్పుర్ రోజున జరిగిన ఈ దాడి ఆ తర్వాత యుద్ధానికి కారణమైంది. రెండు దేశాల మధ్య యుద్ధ ఘంటికలు మోగాయి. అరబ్ సంకీర్ణ దళాలపై ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టింది. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాలైన గోలన్ హైట్స్, సినాయ్, ఇతర పరిసరాలపై పట్టుకోసం అప్పట్లో ఆరు రోజుల యుద్ధం జరిగింది.అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అణు యుద్ధానికి దారి తీయవచ్చునంటూ హెచ్చరికలు చేశారు.
అప్పట్లో యుద్ధం గెలిచిన ఇజ్రాయెల్ 6
ఇరుపక్షాల మధ్యా యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. దాంతో ప్రపంచ దేశాలకు చమురు సప్లయ్ చేసే ఒపెక్ దేశాలు ఇజ్రాయెల్ కుమద్దతు పలికే అన్ని పాశ్చాత్య దేశాలకు చమురు ఎగుమతులు నిలిపివేశారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. రెండు వారాల భీకర పోరు తర్వాత 20 వేల మంది చనిపోయాక, ఈయుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచింది. యుద్ధానికి ముందు ఆక్రమించిన ప్రాంతంకంటే మరిన్ని ప్రాంతాలు అదనంగా ఇజ్రాయెల్ పరిధిలోకి వచ్చాయి. ఇది జరిగినది అక్టోబర్ 6వ తేదీనే.
ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్
50 ఏళ్ల నాటి పాత కక్షలకు మళ్లీ ఇవాళ ప్రాణం పోసింది హమాస్ ఉగ్రసంస్థ. ఈనెల 6న ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ పేరుతో ఐదు వేల రాకెట్లను హటాత్తుగా ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. గాజా వెస్ట్ బ్యాంక్ లో ఉన్న తమ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ పై దాడులు జరిపింది. అంతే కాదు అరబ్, ఇతర ఇస్లామిక్ దేశాలు ఈ యుద్ధంలో తమతో కలసి రావాలని అపీల్ చేసింది. పాలస్తీనా భూమిని అక్రమంగా ఇజ్రాయెల్ ఆక్రమించుకుందని ఆరోపించింది.
వివాదస్పద ప్రాంతంగా ఆల్ అక్సా మసీదు
తాజాగా హమాస్ ఉగ్ర సంస్థ అధకారులు కూడా ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల మధ్య చిరకాలంగా ఉన్న గొడవలే ఇవాల్టి దాడులకు కారణమని బహిరంగంగా చెబుతున్నారు. పవిత్ర ఆల్ అక్సా మసీదు ప్రాంగణంపై వివాదం తీరాలని పట్టుబుడతున్నారు. ఈ మసీదు ప్రాంతాన్ని అటు ముస్లింలు, ఇటు యూదులు కూడా తమదేనని ప్రకటిస్తున్నారు. ఈ స్థలానికి దీర్ఘ కాలిక హింసాత్మక చరిత్ర కూడా ఉంది. 2021లో కూడా ఇజ్రాయెల్, హమాస్ దేశాల మధ్య11 రోజుల పాటు యుద్ధం జరిగింది. అయితే యూదులకు పవిత్ర దినాలైన సించాట్ తోర్హా సమయంలోనే ఈ దాడి జరగడం 1973ల యోం కిప్పుర్ కోసం జరిగిన దాడిని గుర్తు చేస్తోంది.
నాటి మారణహోమానికి 50 ఏళ్లు పూర్తి 6
హమాస్ ఉగ్రవాదులు ఈ తేదీనే దాడులకు ఎంచుకోడానికి మరో కారణం 1973 నాటి రక్త చరిత్రకు అక్టోబర్ 6తో 50 ఏళ్లు నిండుతాయి. నాటి యోం కిప్పుర్ ఉత్సవం రక్తపాతం గురించి ఇజ్రాయెలీ మీడియా ఈ మధ్య స్మారక దినం కూడా జరిపింది. శనివారం నాటి దాడికి, పాత ఘటనల్లో దాడులకు చాలా సారూప్యం ఉందని ఇజ్రాయెలీలు కూడా భావిస్తున్నారు.
సించాట్ తోర్హా సంబరాలు జరుపుకోవాలని ఇజ్రాయెలీలు భావిస్తున్న తరుణంలో హమాస్ కావాలనే వేలాది రాకెట్లను ప్రయోగించి అటు సముద్రంపైనుంచి,
ఇటు భూమిపైనుంచి ఇజ్రాయెల్ పై దాడి చేసి ఆ భూభాగాన్ని ఆక్రమించి వందల మందిని హతమార్చింది. హమాస్ దాడుల నేపధ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు స్టేట్ ఆఫ్ వార్ ను డిక్లేర్ చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ పై తాము చేసిన ఈ దాడికి ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం దేశాలు, అరబ్ దేశాలు మద్దతు పలకాలని హమాస్ గ్రూప్ పిలుపునిచ్చింది. తాజా ఘర్షణ నేపధ్యంలో తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్ పరిసరాలు చాలా ఉద్రిక్తంగా మారాయి.