ఈ యుద్ధం (WAR) మేము మొదలు పెట్టినది కాదు.. కానీ ముగింపు మాత్రం మేమే ఇస్తాం అన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు. హమాస్ ఉగ్రసంస్థకు బదులిచ్చేందుకు ఏకంగా మూడు లక్షల సైనిక పటాలాన్ని సరిహద్దులకు తరలించింది.1973 యంకిప్పుర్ వార్ తర్వాత ఇంత పెద్ద పెట్టున సైన్యాన్ని తరలించడం ఇదే తొలిసారి. ఈయుద్ధం మేం మొదలు పెట్టినది కాదు.. మేం యుద్ధాన్ని కోరుకోలేదు. అత్యంత కిరాతకమైన ఉగ్రదాడి నేపధ్యంలో మేం బదులివ్వక తప్పడం లేదు. మేం గట్టి ముగింపునే ఇస్తాం అని నేతన్యాహు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు.
రెండు వైపులా భారీ నష్టం… (WAR)
ఇప్పటి వరకూ ఈ దాడిలో 2,300 మంది ఇజ్రాయిలీలు గాయాలపాలయ్యారు. 700 మందికి పైగా మరణించారు. ఈదాడులకు తగిన మూల్యం హమాస్ సంస్థ చెల్లించుకుంటుంది. వారు జీవితాంతం గుర్తు పెట్టుకునే ప్రతిఘటనని ఇస్తాం అన్నారు. మాపై దాడి చేసి చాలా తప్పు చేశామని హమాస్ పశ్చాత్తాప పడక తప్పదు.దీనికి హమాస్ తగిన మూల్యం చెల్లించుకునేలా మేం చర్యలు తీసుకుంటాం.. ఇజ్రయెల్ జోలికి ఎవరు వచ్చినా వారికి ఇదే గతి పడుతుందని గుర్తుంచుకోవాలి అన్నారు .అమాయక ఇజ్రాయిలీలపై హమాస్ అత్యంత దారుణమైన దాడుల చేస్తోంది.
పైశాచికంగా, కర్కశంగా దాడులు చేస్తోంది. కుటుంబాలకుకుటుంబాలనే ఊచకోత కోస్తోంది. వందలాది మంది యువతను చంపేసింది. మహిళలను కిడ్నాప్ చేసింది. పిల్లలు, వృద్ధులను చిత్రహింసల పాల్చేసింది. మా పిల్లల పసిమనసులపై చెరిగిపోని గాయాల్ని చేసింది హమాస్. దీనికి బదులు ఇవ్వక తప్పదు అన్నారు నేతన్యాహు. ఐసిస్ కన్నా ప్రమాదకరమైన హమాస్ ను ప్రపంచ దేశాలు వెలివేయాలని, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని పిలుపునిచ్చారు.
ఐసిస్ హమాస్ ఒకటే… (WAR)
ఐసిస్ పట్ల ప్రపంచ దేశాలు ఎలా వ్యతిరేకత వ్యక్తం చేశాయో, నాగరిక సమాజం ఎలాఆ సంస్థపై యుద్ధం చేస్తోందో అదే తరహాలో హమాస్ ను కూడా తిప్పికొట్టాలని నేతన్యాహు అభిప్రాయపడ్డారు. తమకు మద్దతు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇతర ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ స్థితి గతులపై బైడెన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని ,తమ దేశం సంక్షేమాన్ని కాంక్షించినందుకు ధన్యవాదాలనీ తెలిపారు. కిరాతక చర్యలకు, అనాగరిక చర్యలకుమూలమైన ఐసిస్, హమాస్ లాంటి ఉగ్రసంస్థలపైతాము చేసే యుద్ధం కేవలం ఇజ్రాయెల్ కోసం మాత్రమే కాదని అన్నారు.
ఈయుద్ధంలో ఇజ్రాయెల్ గెలిస్తే అది నాగరిక ప్రపంచ దేశాల గెలుపుగా నేతన్యాహు అభివర్ణించారు. గతంలో ఎన్నడూ లేనంత ఉథృతంగా ఇజ్రాయెల్ హమాస్ పై దాడులు చేస్తోంది. 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృత దేహాలను గాజా స్ట్రిప్ లో పడి ఉన్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.గాజాను స్వాధీనం చేసుకోడానికి ఇజ్రాయెల్ దూకుడు ప్రదర్శిస్తే తమ దగ్గర బందీలుగా ఉన్నవారిని చంపేస్తామని హమాస్ బెదిరిస్తోంది.
పాలస్తీనాకు సౌదీ మద్దతు
మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపధ్యంలో సౌదీ పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. యుద్ధం మరింత విస్తరించకుండా తగిన చర్యలు తీసుకోడానికి అనువైన మార్గాలను పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా యువరాజు పాలస్తీనా అధ్యక్షుడు మహముద్ అబ్బాస్ కు తెలిపారు. పాలస్తీనా ప్రజలు వారి చట్టబద్ధమైన హక్కులను సాధించే వరకూ పాలస్తీనాకు బాసటా ఉంటామని గల్ఫ్ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగి ప్రశాంత వాతావరణం ఏర్పడాలన్నారు.
(WAR)