లోకాలనేలే అమ్మలు గన్న అమ్మ తొమిది రోజులు తొమిది రూపాలలో దర్శనమిచ్చి సకల శుభాలు కలుగజేస్తుంది ఆ తల్లి. నవ రాత్రులు మన భారత దేశమంతట ఒక పండుగ లా జరుపుకుంటారు. ఈ నవ రాత్రులలో దేవి ఆలయాలు అన్ని దేదీప్యమానం గా వెలుగుతూ భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ నవరాత్రులలో అమ్మవారు ప్రతి రోజు ఒక్కో అలంకరణ (Avatharalu) తో ఉంటారు. అయితే విజయవాడ కనక దుర్గ అమ్మవారు ఏ రోజు ఏ అలంకారాలలో దర్సనమిస్తారో ఇప్పుడు తెలుస్కుందాం..
ఈ నెల 15 న సోమవారం నుండి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి.
●మొదటి రోజు : ఈనెల 15వ తేదీ సోమవారం నాడు అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో (Avatharalu) దర్శనమిస్తారు.అంటే అమ్మవారు బాలిక రూపం లో దర్శనమిస్తారు.
● రెండవ రోజు : తరువాత 16వ తేదీ మంగళవారం రెండవ రోజు గాయత్రి దేవి గా దర్శనమిస్తారు. వేద మాత గాయత్రి ఈ సృష్టికి జ్ఞానాన్ని అందించినది. ఈ అమ్మవారు ఎంతో శక్తివంతమైనది.
● మూడవ రోజు : 17వ తేదీ మూడో రోజు బుధవారం అన్నపూర్ణ దేవి అవతారంలో (Avatharalu) దర్శనమిస్తుంది. అన్ని జీవులకు ఆహారమే ఆధారం. అన్నం మానవాళికి అత్యంత ముఖ్యమైన శక్తి వనరు. అన్నం పరబ్రహ్మ స్వరూపంఅని పెద్దలు చెబుతుంటారు అలాగే భావిస్తారు కూడా . ఈ అన్నానికి ప్రధాన దేవత అన్నపూర్ణమ్మ తల్లి .
● నాల్గవ రోజు : 18వ గురువారం నాల్గవ రోజున, కాత్యాయని దేవి దేవతగా దర్శనమిస్తుంది. ఈ తల్లి కాత్యాయన మహర్షికి జన్మించింది మరియు కాత్యాయన అని పిలువబడింది.
● ఐదవ రోజు : 19వ తేదీ ఐదవ రోజు శుక్రవారం లలితా దేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారి కి శుక్రవారంఎంతో ప్రత్యేకమైనది అని మనకు తెలుసు. లలితా దేవిగా దర్శనమిచ్చే ఈ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి లలిత సహస్రా నామ స్త్రోత్రాలు జపిస్తే ఆ తల్లి చల్లని చూపు వారిపై ఉంటుందని భక్తుల నమ్మకం.
● ఆరవ రోజు : 20వ తేదీ ఆరో రోజు శనివారం మహాలక్ష్మి రూపంలో దర్శనమిసస్తారు. సంపదలకు అధిదేవత అయిన అమ్మవారిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి జీవితం సుఖమయం అవుతుందని విశ్వాసం.
● ఏడవ రోజు : 21వ తేదీ ఏడవ రోజున సరస్వతి దేవిగా దర్శనమిస్తుంది. విద్యకు మూలమైన సరస్వతీ దేవి జ్ఞాన ప్రదాతగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం అనేక క్షేత్రాలలో అమ్మవారిని పూజిస్తారు. అంతేకాదు సరస్వతీ పూజను చిన్నారులు నిర్వహిస్తారు.
● ఎనిమిదవ రోజు : 22వ తేదీ , సోమవారం. మహిషాసుర మర్ధిని అవతారంలో దార్శనిస్తారు అమ్మవారు . మహిషాసురుడిని సంహరించిన ఆ తల్లి కోపానికి ఓ రూపం ఉంది. ఈ అమ్మవారిని పూజిస్తే భయాలు తొలగి ధైర్యాన్ని పొందుతారు.
● తోమిదవ రోజు : 23వ తేదీ తొమ్మిదో రోజున రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ తల్లి తన చల్లని చూపులతో ప్రపంచాన్ని వెలిగిస్తుంది. నీరాజనాలు అన్నీ పొందుతాయి.
తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలలో నవరాత్రులు ముగిసిన తరువాత పదవ రోజున దసరా పండుగ ను “విజయ దశమి” గా జరుపుకుంటారు. నవరాత్రులలో అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకు పాత్రులైతే జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. కష్టమైన విషయాలను కూడా పరిష్కరించవచ్చు.