(CBN)
స్కిల్ స్కామ్ లో ఏ ముహుర్తాన చంద్రబాబు ఇరుక్కున్నారో గానీ వరసగా కేసుల మీద కేసులు వెంటాడుతున్నాయి. 42 రోజులుగా అధినేత రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉంటే ఆయన పార్టీ నేతలు దిక్కు తోచని స్థితిలో బిక్కు బిక్కుమంటూ చూస్తున్నారు. చంద్రబాబును బయటకు తీసుకు రాడానికి లాయర్లు కోర్టుల చుట్టూ తెగ తిరిగేస్తున్నారు. అటు ఏసీబీ నుంచి ఇటు హై కోర్టు, చివరకు సుప్రీంకోర్టు వరకూ ఆయన కు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వేల కోట్ల ధనం మంచినీళ్ల కన్నా దారుణంగా ఖర్చవుతోంది. పైగా లాయర్లంతా చిన్నా చితకా వాళ్లు కాదు. నిమిషాలను వేలల్లో లక్షల్లో లెక్కలు వేసే ఘనాపాటి లాయర్లు.
రెండు వేల కోట్లు హాం ఫట్ ? (CBN)
సిద్ధార్ధ్ లూథ్రా నుంచి హరీష సాల్వే వరకూ అందరూ కోట్లల్లో రిమ్యునరేషన్ తీసుకునే వారే. వీరు కాక అదనంగా దమ్మాల పాటి శ్రీనివాస్ లాంటి తెలుగు లాయార్లు.. వారి వంది మాగధ గణం పేపర్లు పట్టుకుని కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేస్తున్నారు. ఏ ఒక్క కేసులోనూ కనీసం ఇప్పటి వరకూ చిన్న రిలీఫ్ కూడా చంద్రబాబుకు దక్కలేదు. అంటే ఆయనపై బుక్ అయిన స్కిల్ స్కామ్ కేసులో అంత బలంగా ,టెక్నికల్ గా దొరికేరనే అర్ధం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ రెండు వేల కోట్ల రూపాయలు లాయర్ల ఫీజు కింద హాం ఫట్ అయిపోయాయని తెలుస్తోంది. అయినా చంద్రబాబుకు రిలీఫ్ మాత్రం దక్కలేదు. పైగాజైల్లో ప్రాణ హాని అని ఉందని ఆరోపించగానే మరిన్ని ఏర్పాట్లు , జాగ్రత్తలు తీసుకున్నారు.. ఆయనకు ఇబ్బంది కలగకుండా ఏసీ ఏర్పాటు, వైద్య సేవలను మరింత పెంచారు. చంద్రబాబు లాంటి నిజాయితీ పరుడిని అన్యాయంగా జైల్లో పెట్టారనే టీడీపీ నేతల వాదనలు అంతకంతకూ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. కేసు బలంగా లేకపోతే చంద్రబాబు లాంటి వారిని అన్నాళ్లు జైల్లో ఉంచడం అసాధ్యం. అందుకే ఆయన ఏ తప్పు చేయ లేదు అన్న వాదన మానేసి ఆయనకు జైల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆయనకు ప్రాణ హాని ఉంది అంటూ కొత్త రాగం అందుకుంటోంది టీడీపీ.
(CBN)
తెరపైకి కిలారి రాజేష్
దేశం వదిలి పారిపోయారన్న అపవాదు తప్పని తాను దేశంలోనే ఉన్నానని చెబుతున్న కిలారి రాజేష్ ఎట్టకేలకు బయటకొచ్చి విచారణకు హాజరయ్యాడు. కిలారి రాజేష్ రాకతోనైనా చంద్రబాబు నిర్దోషిగా బయట పడిపోతారు… అని ఆశించిన వాళ్లందరికీ నిరాశే మిగిలింది. తాను దేశంలోనే ఉన్నానన్న రాజేష్ స్కిల్ స్కామ్ లో తప్పులు జరగలేదు అని డంకా బజాయించి మాత్రం చెప్పడం లేదు. అంటే అందులోనే ఏదో మతలబు ఉందన్నది అందరికీ అర్ధమవుతున్న విషయం.
సుప్రీంకోర్టులోనూ అటు ఏపీ సిఐడి, ఇటు చంద్రబాబు లాయర్లు మధ్య హోరా హోరీ వాదనలు సాగుతున్నాయి. కేసులోతుల్లోకి వెళుతున్న కొద్దీ టైమ్ మరింత ఎక్కువ పడుతోంది.
మరోవైపు ఏపీ సిఐడి ఇతర కేసులను కూడా తెరపైకి తెస్తోంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఉపశమనం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో టీడీపీ వర్గాలు షాక్ కి గురయ్యాయి. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైనా తీర్పు నవంబర్ 8నే ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసేసింది… కాబట్టి ఎతా వాతా… వచ్చే నెలలోనే చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువడేలా కనిపిస్తోంది. ప్రస్తుతం దసరా శెలవులు కాబట్టి చంద్రబాబుకు ఈ నెలాఖరు వరకూ రిలీఫ్ లేనట్టే. కాబట్టి ఈ ఏడాది నారా వారికి దసరా పండగ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే…