(war)
హమాస్ చెరలో బందీలుగా ఉన్న తమ వారి విడుదల కోసం ఇజ్రాయెల్ సైన్యం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గాజా స్ట్రిప్ లోని హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారి వివరాలు,రూట్ మ్యాప్ చెప్పిన వారికి నగదు ప్రోత్సాహకాలిస్తామని, వారి సమాచారం ఎవరికీ తెలియకుండా రక్షణ కల్పిస్తామనీ, వారిని నమ్మకస్తులుగా పరిగణిస్తామని గాజా పౌరులకు ఆశ చూపింది.
దయ చేసి మా వారి ఆచూకీ చెప్పండి! (war)
ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం హమాస్ దగ్గర ఇంకా 220 మంది బందీలుగా ఉన్నారు. శాంతియుత జీవనం, ప్రశాంతమైన భవిష్యత్తు, పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటే మానవతా దృక్పథంతో మీ మీ ఏరియాల్లో రహస్య బందీలుగా ఉన్న వారి ఆచూకీ, చిరునామా, ఇతర సమాచారం అందివ్వండి అంటూ గాజా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం అపీల్ చేసింది. బందీల ఆచూకీ చెప్పిన వారికి పకడ్బందీ రక్షణ కల్పిస్తాం. పెద్ద ఎత్తున సొమ్మును ముట్ట చెబుతాం.. మీకు, మీ భద్రతకు ఎలాంటి భయం అక్కర లేదంటూ ఇజ్రాయెలీ మిలటరీ గాజా ప్రజలను కోరుతోంది. బందీలుగా మగ్గిపోతున్న వారి ఆచూకీ చెప్పండి బహుమతులు పొందండి అంటోంది ఇజ్రాయెల్ సైన్యం.
మరోవైపు హమాస్ కూడా కాస్త దిగి వచ్చింది. మొన్న ఇద్దరు అమెరికన్ మహిళలను విడిచి పెట్టగా, నిన్న ఇద్దరు ఇజ్రాయెలీ మహిళలను వదిలిపెట్టింది. తొందరలోనే మరో 50 మందిని విడుదల చేస్తుందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ బహుళ విధాలుగా హమాస్ తీవ్రవాదులపై దాడులు మొదలు పెట్టింది. సిరియాలో మిలటరీ ఆయుధాలపైన బుధవారం గురిపెట్టింది.వెస్ట్ బ్యాంక్ పై రాత్రికి రాత్రి దాడులు జరిపింది. దాంతో పాలస్తీనా రెచ్చిపోయింది. వారు కాల్పులు జరపగా డ్రోన్దాడితో వారిపై తిరుగుబాటు చేసింది. ఈ పోరాటంలో ఇద్దరు పాలస్తీన సాయుధులు చనిపోయారు.
ఇది దక్షిణ సరిహద్దు దగ్గర మార్షల్ అధికారులు ఉన్నారు. వారంతా గాజా పై దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు.గాజాపై దాడి తప్పదు అని ఐడీఎఫ్ చీఫ్ ప్రకటించారు.వాయు దాడితో పాటు భూమిపైనా దాడులు తప్పవని గాజాపై ముప్పేట దాడి జరుపుతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఎప్పుడు చేస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. గాజా భూభాగాన్ని ఇజ్రాయెల్ గనక ఆక్రమించడం మొదలు పెడితే ఇక పాలస్తీనా తట్టుకోవడం కష్టమే.
హమాస్ ను తుదముట్టించడమే లక్ష్యం! (war)
దీని లక్ష్యం ఒకటే. హమాస్ ను తుదముట్టించడమే అని ప్రధాని నేతన్యాహు ప్రకటించారు. హమాస్ గ్రూప్ నేలమట్టం అయ్యేంత వరకూ విశ్రమించేది లేదని, రాజీ ప డబోమని నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడులను అమెరికా ఆపుతోందా అన ప్రశ్నకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇజ్రాయెల్ కు తాము అని విధాల సహాయం చేస్తామని, మద్దతు పలుకుతామని, అయితే తనంత తానుగానే ఇజ్రాయెల్ ఆ నిర్ణయాలను అమలు జరుపుతుందని బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడేలా చేస్తోంది.
సౌదీ అరేబియాలో అతిపెద్ద బ్యాంకు దిగ్గజం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి దారు అయిన సౌదీ అరేబియా మాత్రం ఈ యుద్ధ తీవ్రతపై కామెంట్ చేసేందుకు నిరాకరించింది. సౌదీ చమురు నిల్వల ఎగుమతులు ఆపితే ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం మరింత పెరగక తప్పదు. హమాస్ ఉగ్ర మూకలు అక్టోబర్7న గాజా స్ట్రిప్ పై దాడి చేసి 1400 మందిని చంపేశారు. 220 మందిని బందీలుగా పట్టుకుపోయారు.ఈ ఘర్షణల్లో 5,700 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. పాలస్తీనా అందుకు బదులుగా తీర ప్రాంతాన్ని దిగ్బంధం చేసి ఇజ్రాయెల్ కు గట్టి ప్రతిఘటన ఇచ్చింది. (war)