8
అన్నదమ్ములన్నాక ఆస్తి గొడవలు సహజం.. పెద్దల జోక్యంతో సాధారణంగా అవి సమసిపోతుంటాయి. కానీ ఉత్తరాదిన భూ ఘర్షణలు ఏకంగా హత్యలకు దారి తీస్తుంటాయి. జానెడు పొట్ట కోసం పేద వర్గాలు పడే ఈ కష్టాలు చూస్తుంటే కళ్లు చెమర్చక మానవు. భూమి కోసం అన్న దమ్ముల మధ్యన తగాదా నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తమ్ముడిపై నుంచి ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా ఎనిమిది సార్లు ట్రాక్టర్ నడిపి అత్యంత క్రూరంగా చంపేశాడా అన్న.. హృదయ విదారకమైన ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో జరిగింది. ఈ కేసులో అన్న దామోదర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.
భూమి కోసం ఘర్షణ.. గాలిలోకి కాల్పులు 8
భరత్ పూర్ లో వ్యవసాయ కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మధ్య ఓ చిన్న భూమిపై ఏళ్ల తరబడి వివాదం సాగుతోంది. ఈఉదయం బహదూర్ సింగ్ కుటుంబానికి చెందిన వ్యక్తులు ట్రాక్టర్ తో వివాదాస్పద భూమి దగ్గరకు చేరుకున్నారు. అథార్ సింగ్కు టుంబం కాస్త ఆలస్యంగా ఘటనా స్థలానికి వచ్చింది. రెండు కుటుంబాలు వచ్చీ రావడంతోనే కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గాలిలోకి కాల్పులు కూడా జరిగినట్లు శబ్దాలు వచ్చాయని స్థానిక గ్రామస్థులు చెబుతున్నారు.
ట్రాక్టర్ తో తొక్కించిన వైనం 8
ఈ గొడవల్లో అథార్ సింగ్ కొడుకైన నిర్పత్ కింద పడిపోయాడు. అంతే బహదూర్ సింగ్ కుటుంబం అతనిపై నుంచి ఎనిమిది సార్లు ట్రాక్టర్ నడిపింది. చివరకు అతడు కన్ను మూశాడు. ఇతర కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినకుండా దామోదర్ సింగ్ ట్రాక్టర్ ను క్రూరంగా తమ్ముడిపైనుంచి నడిపాడని పోలీసులు వివరించారు. ఈ ఘర్షణల్లో కనీసం పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఐదు రోజుల క్రితం కూడా రెండు కుటుంబాలు వివాదాస్పద భూమికోసం గొడవ పడ్డాయని బహదూర్ సింగ్ కుటుంబం అథార్ సింగ్ పైనా, నిర్పత్ పైనా కూడా కేసులు పెట్టిందనీ తెలుస్తోంది.
రాజకీయ రంగు పులుముకున్న ఘటన
వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ హత్యోదంతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపి దాడికి దిగింది.ఇంత క్రూరమైన , భయానకమైన, మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన జరిగిన భరత్ పూర్ గ్రామాన్ని సందర్శించడానికి ప్రియాంకా గాంధీకి గుండె, వెన్నెముక ఉండాలని బీజేపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. హృదయ విదారకమైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దృశ్యాలు ప్రియాంకా వాద్రాకు సవాల్ విసురుతున్నాయని, దమ్ము, ధైర్యం ఉంటే ఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి సమాధానం చెప్పాలని సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. మొదట ఈ ఘటనపై మాట్లాడాలనుకున్నా… ఆ వీడియో చూశాక ప్రియాంక గాంధీకి మొదట ఈ సవాల్ విసరాలన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నానని సంబిత్ పాత్రా అన్నారు.