(WAR)
ఇజ్రాయెల్ అన్నంత పనీ చేసింది. తమ బందీలను హమాస్ విడిచి పెట్టకపోవడంతో చెప్పినట్లుగానే గగన తల దాడులతో విరుచుకు పడుతోంది. గాజా స్ట్రిప్ లో పరిమితమైన భూభాగంపై ఇజ్రాయెల్ జెట్ ఫైటర్లతో దాడులు జరిపింది.దీనికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ వీడియో ఫుటేజ్ కూడా విడుదల చేసింది. ఈ దాడులలో చాలా మంది హమాస్ తీవ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. గాజా భూభాగాన్ని మళ్లీ ఆక్రమించి తమ బందీలను విడిపించుకోడానికే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఐడీఎఫ్ దళాలు, ఐడీఎఫ్ ఫైటర్ జెట్ల సాయంతో సెంట్రల్ గాజా ప్రాంతంలో ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఐడీఎఫ్ ఉగ్రస్థావరాలను గుర్తించ గలిగిందని అందుకే యాంటీ టాంక్ మిసైళ్లను ప్రయోగించే కేంద్రాలు, మిలటరీ కమాండ్, కంట్రోల్ సెంటర్లతో సహా అనేక స్థావరాలను, హమాస్ తీవ్రవాదులను మట్టు పెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. (WAR)
ఈ కార్యకలాపాలు పూర్తి చేశాక తమ దళాలు అక్కడనుంచి వైదొలగాయని కూడా ప్రకటించింది. ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో ఫుటేజ్ లో బ్లాక్ అండ్ వైట్ లో కొన్ని మిలటరీ వాహాల కదలికలు, దట్టమైన పొగ కనిపించాయి. అదే టైమ్ లో ఆర్మీ గాజా భూభాగంపై యుద్ధ ట్యాంకులు, పదాతిదళాలను ప్రయోగించి పాలస్తీనా ఉత్తర భూభాగంలో దాడులు చేసింది. తమ దళాలు పాలస్తీనా భూభాగంపై దాడులు చేస్తాయని నేతన్యాహు గతవారం ప్రకటించిన ప్రకారమే ఈ దాడులు జరిగాయి.
అక్టోబర్ 7న హమాస్ గన్ మెన్ గాజా నుంచి ఇజ్రాయెల్ లోకి చొరబడి 1400 మందిని కాల్చి చంపారు. వీరిలో ఎక్కువమంది సివిలియన్లే ఉన్నారు.మరో224 మందిని బందీలుగా పట్టకుపోయారు. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో గాజా స్ట్రిప్ లో 7,028 మంది చనిపోయారు. వీరిలో 2,913 మంది చిన్న పిల్లలు ఉన్నారని హమాస్ నియంత్రిత ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2005 లో పాలస్తీనా భూభాగం నుంచి ఏకపక్షంగా ఇజ్రాయెల్ వైదొలగిన తర్వాత గాజా స్ట్రిప్ లో ఇంత మంది చనిపోవడం ఇదే ప్రధమం. ఇజ్రాయెల్ రాత్రి వేళ వ్యూహాత్మకంగా ఈ దాడులు చేసింది.
ఇవాళ శుక్రవారం కూడా ఇజ్రాయెల్ దళాలు ఫైటల్ జెట్లు, ద్రోన్ లతో రెండోసారి గాజాపై విరుచుకుపడ్డాయి. గాజా సిటీ శివార్లలో ఉన్న లక్షిత ప్రదేశాలపై బాంబులు కురిపించాయి. మరోవైపు యూఎస్ యుద్ధ విమానాలు అటు సిరియా తూర్పు భూభాగంపై దాడులు చేసినట్లు పెంటగాన్ ప్రకటించింది.సిరియాకు ఇరాన్ మద్దతు పలుకుతున్న నేపధ్యంలో అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ ఫైటర్లు దాడులు చేయడంతో అమెరికా తీవ్రంగా ప్రతిఘటించింది. మూడు వారాలుగా గాజాలో కాల్పుల మోత మోగుతుండగా అమెరికా, ఇరాన్ మధ్య సిరియా భూభాగం కేంద్రంగా దాడులు ఉథృతమవడంతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
పాలస్తీనా భావోద్వేగ విన్నపం! (WAR)
మరోవైపు బాంబు దాడులు ఆపండి, ప్రాణాలు కాపాడండి అంటూ పాలస్తీనా రాయబారి ఐక్యరాజ్యసమితిలో ఉద్వేగ పూరితమైన అపీల్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే తప్ప తమ దగ్గర బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడం కుదరదని పాలస్తీనా హమాస్ గ్రూప్ స్పష్టం చేసింది.బందీలుగా పట్టకున్న ఇజ్రాయెల్ పౌరులను ఎక్కడెక్కడకు తరలించినది తమకే అంచనా సరిగా లేదని, కాల్పులు విరమిస్తే వారందరినీ వెతికి ఒక చోట చేర్చి అప్పగిస్తామని హమాస్ నేత ఒకరు వ్యాఖ్యానించినట్లు రష్యా పత్రిక రాసింది.బందీలను సురక్షితంగా అప్పగించాలి అంటే ముందు దాడులు ఆపాలని హమాస్ పట్టుబడుతోంది. ఇజ్రాయెల్ ముప్పేట దాడికి హమాస్ దిగి వచ్చినట్లే కనిపిస్తోంది.