ఇజ్రాయెల్ – హమాస్ మధ్య మానవతా థృక్పథంలో చర్చలు జరగాలన్న ఐక్యరాజ్యసమితి (UN) తీర్మానం ఓటింగ్ కు భారత్ దూరంగా నిలిచింది. అందులో హమాస్ ఉగ్ర సంస్థ నిర్వాకాన్ని ప్రస్తవించనందునే భారత్ ఓటింగ్ కు దూరం జరిగినట్లు తెలుస్తోంది. గాజా స్ట్రిప్ లో మానవతా థృక్పథంతో రాకపోకలకు వీలు కల్పించాలని కూడా ఐరాస తీర్మానం కోరింది. ఐక్యరాజ్యసమితి పదవ అత్యవసర ప్రత్యేక సమావేశంలో జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా 193 మంది సభ్యులు దీనికి మద్దతు తెలిపారు. ఈ తీర్మానాన్ని బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్థాన్, రష్యా, దక్షిణాప్రికా సహా 40దేశాలు బలపరిచాయి. గాజాలోఅమాయక పౌరులను రక్షించాలని అక్కడ న్యాయపరమైన చర్యలు చేపట్టాలన్న తీర్మానాన్ని 120 దేశాలు బలపరచగా,14 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ సహా 45 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, బ్రిటన్ దేశాలు కూడా ఈ తీర్మానం ఓటింగ్ కు దూరంగా నిలిచాయి.
జోర్డాన్ ప్రభుత్వం రూపొందించిన ఈ తీర్మానంలో ఎక్కడా హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రస్తావన లేకుండా పోవడాన్ని అమెరికా తీవ్రంగా తప్పు పట్టింది. ఈ తీర్మానంపై ఓటింగ్ కు ముందు 193 మంది సభ్యుల సంఘం కొన్ని సవరణలు సూచించింది. అమెరికా ,కెనడాలతో సహా ఈ సవరణల కోసం పట్టుబట్టాయి. హమాస్ తీవ్రవాదులు అక్టోబర్ 7న చేసిన దాడిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు, ఖండిస్తున్నట్లు ఒక పారాగ్రాఫ్ ను తీర్మానంలో చేర్చాలని కెనడా సహా పలు దేశాలు కోరాయి. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని అంతర్జాతీయ చట్టాలకు లోబడి మానవతా దృక్పథంతో ట్రీట్ చేయాలని, వారిని తక్షణం, బేషరతుగా విడుదల చేయాలని తీర్మానంలో చేర్చాలని కెనడా కోరింది.
బందీల విడుదల తీర్మానానికి భారత్ మద్దతు (UN)
అయితే భారత్ సహా 87 దేశాలు ఈ సవరణకు మద్దతు తెలిపాయి. మరో55 దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించగా, 23 దేశాలు ఓటింగ్ కు దూరంగా నిలిచాయి. అయితే సవరణ తీర్మానానికి మూడింటా రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో తీర్మానం వీగిపోయినట్లయ్యింది. గాజాస్ట్రిప్ లో ఉన్న వారికి వైద్య సేవలు, అత్యవసర సేవలను పునరుద్ధరించాలని, నిత్యావసర సరుకులను తక్షణం అందేలా చేయాలని కేవలం నీళ్లు, ఆహారం, మందులు, ఇంధనం, కరెంటు ఇస్తే సరిపోదని, ఇతర నిత్యావసరాలను కూడా అందచేయాలని జోర్డాన్ దేశం డిమాండ్ చేసింది. రెడ్ క్రాస్ సహ పలు స్వచ్ఛం సంస్థలు,అంతర్జాతీయ కమిటీ గాజా స్ట్రిప్ లోకి వెళ్లి సేవలందించేలా అనుమతించాలని తీర్మానంలో కోరారు. గాజాలో ఉన్న వారిపట్ల సానుభూతితో మానవతా కారిడార్లను ఏర్పాటు చేయాలని, నిరభ్యంతరంగా, రాకపోకలు సాగేలా పరిస్థితులను పునరుద్ధరించాలని ఆ తీర్మానంలో కోరారు. సహాయం కావాలసిన వారికి తక్షణం అందించే వెసులుబాటు కల్పించాలన్నారు.
హమాస్ ప్రస్తావన లేకపోవడంపై అమెరికా సీరియస్
అయితే తీర్మానంలో ఎక్కడా హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రస్తావన తేవకపోవడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. ఇది అత్యంత దుష్ట శక్తిని స్వేచ్ఛగా వదిలివేయడమేనని ఆరోపించింది.అక్టోబర్ 7 నాటి దాడులకు కారకులైన వారిని ప్రస్తావించకపోవడం దారుణం. హమాస్ అనేది బరితెగించిన ఒక ఉన్మాద సంస్థ అని ఐరాస యూఎస్ రాయబారి థామస్ గ్రీన్ ఫీల్డ్ మండిపడ్డారు.అలాగే ఉగ్ర మూకల చెరలో ఉన్న బందీల గురించి ప్రస్తావన కూడా తీర్మానంలో లేకపోవడం అత్యంత దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా బలైపోయిన అమాయకుల గురించి ప్రస్తావన ఈ తీర్మానంలో లేనే లేదు. ఈ సభలో ఉన్న అనేక దేశాల ప్రజలు కూడా అక్కడ బందీలుగా ఉండి ఉండొచ్చు.. వారి ప్రస్తావనే లేకపోవడం విచారకరం. విడ్డూరం అని అమెరికా రాయబారి వ్యాఖ్యానించారు. ఈ కారణం వల్లనే కెనడా చేసిన సవరణ ప్రతిపాదనలకు తాము కూడా మద్దతు పలికామన్నారు. (UN)