సింగపూర్ కోర్టు ఒక అత్యాచార కేసులో భారతదేశానికి చెందిన26 ఏళ్ల చిన్నయ్య అనే వ్యక్తికి 16 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. నిందితుడు చిన్నయ్య క్లీనర్ గా పనిచేస్తున్నాడు. సాయమడిగిన బాధితురాలిని నమ్మబలికి మోసగించి, అత్యంత దారుణంగా, రేప్ చేసి మనిషిని గుర్తు పట్టలేనంతగా గాయపరిచాడు. అత్యంత క్రూరమైన నేరం చేసినందుకే సింగపూర్ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈకేసులో బాధితురాలు ఒక కాలేజీ స్టూడెంట్..2019 మే 4వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఆమె ఒంటరిగా బస్ స్టాండ్కు వెళ్లింది.
అప్పటికే అక్కడ చిన్నయ్య ఉన్నాడు.. ఓ ప్రాంతానికి వెళ్లేందుకు ఆమె, అతడిని దారి అడిగింది. కానీ అతను ఆమెకు తప్పు దారి చెప్పి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పుడే, ఆమెపై దాడి చేశాడు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. హత్య చేసిన మరుసటి రోజే చిన్నయ్యను అధికారులు అరెస్ట్ చేశారు. చిన్నయ్య మానసిక స్థితిపై స్పష్టత వచ్చేందుకు ఇన్నేళ్లు పట్టిందని అధికారులు తెలిపారు. బాధితురాలిపై నిందితుడి దాడి అత్యంత అమానవీయంగా సాగింది. అత్యాచారాన్నిప్రతిఘటించిన బాధితురాలిని చిన్నయ్య దారుణంగా కొట్టాడు. ఆ సమయంలో ఆమెకు చాలాసార్లు ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదురైంది. ఇలా ఆమెను చిత్రహింసలకు గురిచేసి, గాయపడేట్టు, రేప్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత బాధితురాలి బ్యాగ్ను ఓపెన్ చేశాడు చిన్నయ్య. అందులో నుంచి బాటిల్ తీసి, కొంత నీరు తాగాడు. ఆ తర్వాత అక్కడనుంచి పరారయ్యాడు.
స్నేహితుల సాయంతో ఆస్పత్రికి
కొంతసేపటికి తేరుకున్న బాధితురాలు తన బాయ్ఫ్రెండ్కి కాల్ చేసింది. కాని అతను స్పందించక పోవడంతో మరొక ఫ్రెండ్ కి కాల్ చేసింది. అతను, పోలీసులను సంప్రదించాడు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి బాధితురాలిని రక్షించారు. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన బాధితురాలి బాయ్ఫ్రెండ్ ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. చిన్నయ్య చేసిన దాడితో కాలేజ్ స్టూడెంట్ ముఖం అంతలా మారిపోయింది.
శిక్ష ఎందుకు ఆలస్యమైంది ? 16
ఈ కేసుపై గత కొన్నేళ్లుగా కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. చివరికి ఇటీవలే తీర్పు వెలువడింది. అయితే చిన్నయ్య మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న అనుమానంతో అతడికి చాలా రౌండ్లు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణ సందర్భంలో బాధితురాలి తరఫు న్యాయవాది నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోర్టును అభ్యర్థించారు. కనీసం 17ఏళ్ల జైలు శిక్ష, చెరకు కర్రతో 17 దెబ్బలు కొట్టాలని కోరారు.ఈ కేసుకు సంబంధించి 2023 జులైలో బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్నారు.ఆ ఘటన గురించి ఇప్పటికీ నాకు పీడకలలు వస్తున్నాయి.ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించింది, అని బాధితురాలు చెప్పింది. అన్ని కోణాల్లో విచారణ పూర్తైన తర్వాత నిందితుడికి 16 ఏళ్ల జైలుతో పాటు చెరకు కర్రతో 12 దెబ్బల శిక్షను విధించింది సింగపూర్ కోర్టు. కేసు విచారణకు నాలుగు సంవత్సరాలు పట్టడానికి చిన్నయ్య మానసిక పరిస్ధితి సరిగా లేకపోవడంతో అనేక దఫాలు మానసిక వైద్య పరీక్షలు అవసరమయ్యాయని అందుకే కేసు విచారణ లేట్ అయ్యిందని కోర్టు పేర్కొంది.