ఏ పార్టీ అయినా నెంబర్ 2 అన్నవాళ్లు లేకుండా ఏకఛత్రాధిపత్యంతో నడిపితే జరిగినన్నాళ్లు బానే ఉంటుంది. పొరపాటున ఏదైనా తేడా వస్తే అప్పుడు అసలు కష్టాలు వస్తాయి. తెలుగు దేశం TDP బహుశా ఇలాంటి ఇబ్బందుల్లోనే పడింది.. చంద్రబాబు నాయుడు పార్టీలో నెంబర్ వన్ నుంచి అన్నీ తానే అయ్యి నడిపారు. పేరుకే అచ్చం నాయుడు అధ్యక్షుడు అయినా ఏ చిన్న విషయమైనా తన కనుసన్నలు దాటిపోకుండ ఇన్నాళ్లూ జాగ్రత్త పడ్డారు చంద్రబాబు.. అయితే ఈ అతి జాగ్రత్తే ఇవాళ పార్టీ దివాళా తీయడానికి కారణమైంది. పార్టీలో ఏకస్వామ్యం ఎక్కువైపోతే ఇలాగే జరుగుతుంది. అధినేత 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉండే సరికి ఏం చేయాలో ద్వితీయ శ్రేణి నేతలకు పాలుపోడం లేదు. పూర్తిగా వారి మైండ్లన్నీ బ్లాక్ అయిపోయాయి.
మతి లేని మాటలు… TDP
గత కొన్ని రోజులుగా వారు మాట్లాడే మాటలే అందుకు నిదర్శనం.. నిక్షేపంలా జైలులో సేద తీరుతున్న చంద్రబాబును సొంత పార్టీ వాళ్లే చంపేస్తున్నారు. చనిపోతే పలికే సానుభూతి వచనాలు పలికేస్తున్నారు.. టాప్ రేంజ్ నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకూ అందరూ ఇదే విధంగా తడబడుతున్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య చంద్రబాబు మరణించడం పట్ల అంటూ మాట్లాడారు. మరో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా చంద్రబాబు చనిపోయినందుకు అన్నారు. అసలు వీళ్లంతా మైండ్లు ఎక్కడ పెట్టుకు మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి.. ఇక భువనేశ్వరి యాత్రల్లోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది.టీడీపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎన్టీఆర్ సతీమణి భువనేశ్వరి అంటూ సంభోదించారు. మరో తృతీయ శ్రేణి నేత చంద్రబాబు గారి భర్త భువనేశ్వరి గారు అంటూ మాట్లాడాడు.. ఇలా ఇష్టాను సారం అర్ధం పర్ధం లేని మాటలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అర్ధం పర్ధం లేని కామెంట్లు
ఇక బాబు గారి భద్రత గురించి ఆయనే లేఖ రాయడంతో టీడీపీ నేతల ఆందోళన మరింత పీక్స్ కు చేరింది. మీడియా ముందుకు వచ్చిన ప్రతీ ఒక్కడూ ఏంటి బాబు గారిని చంపేద్దామనుకుంటున్నారా? అని ఒకరు, ఆయన్ను లేపేసేందుకు భారీ కుట్రకు తెర లేపారు అని మరొకరు, ఆయనను లేపేసినంత మాత్రాన తెలుగు దేశం పార్టీ ఏం నష్టపోదు.. బలమైన కేడర్ ఉందంటూ మరొకరు ఇలా చంద్రబాబు గారి గురించి ఇష్టా రీతిన మాట్లాడుతున్నారు. వీళ్ల మాటలు వింటుంటే సామాన్య జనానికి ఫ్యూజులు ఎగురుతున్నాయ్.
లాజిక్ లేని భువనేశ్వరి ఆన్సర్లు TDP
దీనికి తోడు మరికొన్ని చిత్ర విచిత్రాలు.. దేవాన్ష్ గురించి నన్నపనేని అడిగిన ప్రశ్న.. మరీ విచిత్రంగా అనిపిస్తుంది. చంద్రబాబు అరెస్టు గురించి దేవాన్ష్ ఏమనుకుంటున్నాడు అని ఆవిడ అడగగానే .. చిన్న పిల్లాడు కదా ఇలాంటివి తెలియనివ్వడం లేదు. విదేశాలకు వెళ్లారు అని చెబుతున్నాం అని భువనేశ్వరి సమాధాన మిచ్చారు. మరోవైపు కొడుకు ప్రతిభ గురించి మాట్లాడే లోకేష్ కంప్యూటర్ లో తానే సెర్చ్ చేస్తాడనీ, వార్తా పత్రికలు చదువుతాడనీ, ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లి సినిమాలు చూస్తాడనీ చెప్పాడు. మరి ఈ సందర్భాల్లో ఎక్కడో ఓ చోట చంద్రబాబు గురించి దేవాన్ష్ కు తెలియకుండా ఉంటుందా? ఇంట్లో మాట్లాడుకుంటుంటే వినడా? మరీ విడ్డూరం కాకపోతే.. ఇలా పబ్లిక్ కి మరీ కృత్రిమత్వంతో కూడిన సమాధానాలు ఇస్తున్నారు భువనేశ్వరి.
మాటకు ముందు ఓసారి జైల్లో ఉన్నా మీగురించే చంద్రబాబు ఆలోచన.. ఎప్పుడు బయటకు వచ్చి సేవ చేద్దామా అని అనుకుంటున్నారంటూ చెబుతుంటారు.. ఇలాంటివి వినడానికి విడ్డూరంగానూ, కాస్త ఎబ్బెట్టుగానూ ఉంటాయ్. ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనీ వీరే చెబుతారు. అలాంటి వ్యక్తి ప్రజాసేవ కోసమే కలవరించేస్తున్నారు అంటే మరీ అవాస్తవం అవుతుందన్న స్పృహ కూడా టీడీపీ నేతలకు ఉండటం లేదు. మొత్తం మీద చంద్రబాబు నిప్పు.. చట్టమైనా తప్పుగా ఉంటుందేమో గానీ చంద్రబాబు మాత్రం తప్పు చేయరు అన్నట్టుగా ఫిక్స్ అయిపోయిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడిప్పుడే వాస్తవంలోకి వస్తున్నారు.. . కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్న కొద్దీ అధినేత అసలు నైజం బోధపడుతున్నట్లుంది.