(PC)
డబ్బు మానవ సంబంధాలను పలుచన చేసేస్తోంది. కుటుంబంలో ఘర్షణల వల్ల దూరంగా ఉన్న భార్యపై కక్ష తీర్చుకోడానికి ఆ భర్త ఎవరూ ఊహించలేని దారుణానికి తెగబడ్డాడు.. వివాహ బంధంపై నమ్మకం లేదు. భార్య అంటే గౌరవం లేదు.. నిక్షేపంలా బతికున్న భార్యని తన అవసరం కోసం రికార్డుల్లో చంపేసి ఆసొమ్ముతో ఉడాయించాడు. వివరాల్లోకి వెళితే నకిలీ డెత్త్ సర్టిఫికేట్, నకిలీ ఫ్యామీలి నెంబర్ సర్టిఫికేట్తో భార్య పేరు పై ఉన్న స్థలాన్ని ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ గా పని చేస్తూన్న శివశకర్కు మాధవి అనే మహిళతో 16 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు. గత కొన్నేళ్ళగా భార్య భర్తలు శివశంకర్, మాధవి మద్య విభేధాలు తలెత్తాయి. చట్టం ప్రకారం నడుచుకోవాల్సిన కానిస్టేబుల్ లక్షల విలువ చేసే అస్థి కోసం కట్టుకున్న భార్యనే చనిపోయిందటు ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించి ఈ మోసానికి దిగజారాడు.
భార్య స్థలంపై కన్నేసిన శివశంకర్
భార్యా, భర్తలకు మధ్య గొడవలు రావడం అవి మరింత ముదరడంతో కొంత కాలంగా మాధవి భర్తకు దూరంగా ఉంటోంది. భర్త వైఖరి నచ్చని భార్య కొన్నాళ్లుగా పుట్టింట్లో ఉంటోంది. భార్య మాధవి పేరుపై నంద్యాల జిల్లా రైతునగర్లో నాలుగు సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలం వివరాలు భర్త శివశంకర్ కు తెలుసు.. అ స్థలం విలువ ప్రస్తుతం లక్షల్లో పలకడంతో ఆశ పుట్టింది. భార్యకు తెలియకుండా అమ్మేయాలని డిసైడ్ అయ్యాడు. తనకు దూరంగా ఉంటున్న భార్యకు దక్కకుండా ఆస్థలం తనకే దక్కాలని డ్రామా మొదలు పెట్టాడు. ఆమెకు తెలియకుండా ఆ ఆస్తిని అమ్మి సొమ్ము చేసుకోవాలనే కుట్రకు ప్రాణం పోశాడు.నకిలీ సర్టిఫికేట్ల కోసం గిద్దలూరులోని కొందరు మధ్యవర్తులను శివశంకర్ సంప్రదించాడు.
భార్య చనిపోయిందని నకిలీ సర్టిఫికెట్ (PC)
కానిస్టేబుల్ కావడంతో కావాలసిన సర్టిఫికెట్లను పలుకుబడితో పుట్టించాడు. తన భార్య చనిపోయిందని నకిలీ డెత్ సర్ఠిఫికెట్ పుట్టించాడు. అసలు గిద్దలూరులో మాధవికి రెసిడెన్షియల్ అడ్రస్సే లేదు. అయినా తన పలుకుబడితో గిద్దలూరు నగర పంచాయతీ అధికారులు ఎలాంటి విచారణ లేకుండా 2019లో మరణించిందని మాధవి డెత్త్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ మంజూరు చేశారు. ఈ రెండు సర్టిఫికేట్ ల అధారంగా కానిస్టేబుల్ శివశంకర్ అ ఆస్తికి తానే వారసుడనని నమ్మబలికి మాధవి పేరు మీదున్న స్థలాన్ని అమ్మకానికి పెట్టాడు. గుట్టు చప్పుడు కాకుండా ఇతరులకు అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య మాధవి న్యాయం కోసం నంద్యాల తాలుకా అర్బన్ పోలీసులను సంప్రదించింది.
చీటింగ్ కేసు నమోదు
మాధవి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ శివశంకర్ పరారీలో ఉన్నాడు. చట్టం పరిధిలో పని చేస్తూ చట్టాలకు అతీతంగా పని చెయ్యాల్సిన ఓ కానిస్టేబుల్ ఇలా ఆస్తి కోసం అడ్డదారిలో కట్టుకున్న భార్యనే చనిపోయిందని సర్టిఫికెట్లను సృష్టించడం పై జిల్లా పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.