(CBN)
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఎట్టకేలకు ఆరోగ్య కారణాల మీద నెల్లాళ్ల మధ్యంతర బెయిల్ జారీ అయ్యింది.ఇదేదో న్యాయపోరాటంలో విజయం సాధించినంత సంబరంగా పండగ చేసుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. ఊరు, వాడా బాణాసంచా కాల్చి ఆయనకు స్వాగతం పలుకుతారట. న్యాయం గెలిచిందిట. మంచి తనానికి రోజులు ఉన్నాయిట. ఇలా రకరకాల వ్యాఖ్యానాలతో చంద్రబాబు అవినీతి ఆరోపణల కేసు గెలిచినట్లే టీడీపీ నేతల మాటలు ఉంటున్నాయ్. ఆయనకు మధ్యంతర బెయిల్ జారీ అయిన కారణాలు వేరు. ఆయనకు కంటి చూపు మందగించడం, చర్మంపై ఇన్ఫెక్షన్లు పెరిగిపోవడం, విరోచనం సాఫీగా కాకపోవడం లాంటి సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. దాంతో ఆ సమస్యల నుంచి బయటపడేందుకు ఆయనకు చికిత్స తీసుకోడానికి వీలుగా హై కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఆయన తనకు నచ్చిన కార్పోరేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకుని ఆ రిపోర్టుల వివరాలు తమకు సబ్మిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. విడుదల అయ్యాక ఫోన్లలో మాట్లాడకూడదని, మీడియా మీటింగులు, బహిరంగ సభలు పెట్టరాదని, ఎవరితోనూ కేసు విషయాలు చర్చించకూడదని షరతులు విధించింది కోర్టు. నాలుగు వారాల తర్వాత మళ్లీ జైలులో సరెండర్ కావాలని ఆదేశించింది. చంద్రబాబుకు విజయవాడ కోర్టులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వర రావు లక్ష రూపాయల బెయిల్ బాండ్ తోపాటు, ష్యూరిటీ సంతకాలు చేశారు. ఈ సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలున్నాయి. వైద్య చికిత్సలు పూర్తి చేసుకుని నవంబర్ 28న మళ్లీ జైలుకు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు ప్రధాన బెయిల్ పై విచారణఈనెల 10న జరగనుంది. మెడికల్ గ్రౌండ్స్ పై విడుదల అవుతున్నారు కాబట్టి ఇతర కేసుల్లో అరెస్టు అయ్యే ఛాన్స్ ఉండదన్నది సీబీఎన్ తరపు న్యాయవాదులు చేస్తున్న వాదన. (CBN)
టీడీపీ నేతల చవకబారు వ్యాఖ్యలు
బెయిల్ రావడం పాపం టీడీపీ మళ్లీ ఓవర్ యాక్షన్ మొదలు పెట్టేసింది. వీరుడు, యోధుడు, శూరుడు 53 రోజుల తర్వాత జైలు గోడలు బద్దలుకొట్టుకుంటూ వస్తున్నాడంటూ నానా పొగడ్తలు కురిపిస్తోంది. లయన్ ఈజ్ బ్యాక్ అంటూ స బరాలు చేసుకుంటోంది. చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచి రోడ్ షో చేసుకుంటూ మంగళగిరి ఉండవల్లి లోని ఆయన నివాసానికి తీసుకెళతామని టీడీపీ అంటోంది. ఈ మాటలన్నీ టీడీపీ నేతల అల్పత్వాన్ని తెలియ చేస్తున్నాయి. వాళ్ల మైండ్ సెట్, సైకాలజీ ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో తెలియ చెబుతోంది.
చట్టం పట్ల, న్యాయం పట్ల, కోర్టు నియమాల పట్ల, జైలు నిబంధనల పట్ల, కేసుల పట్ల ఏ మాత్రం అవగాహన లేనట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఈ వందిమాగధ వీరగణం చంద్రబాబు తప్పు చేయనే చేయరు అనే భ్రమల్లోనే ఉన్నారంటే ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో అర్ధమవుతుంది. స్కిల్ స్కామ్ లో ఆధారాలుంటే బయట పెట్టండి అంటూ పదే పదే అరుస్తున్నారు. 13 చోట్ల ఆయన స్వ హస్తాలతో చేసిన సంతకాలే ఉన్నాయి అంటున్నా… పట్టించుకోవడం లేదు..బెయిల్ వస్తే న్యాయం గెలిచింది, రాకపోతే జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు… ఇది టీడీపీ నేతల మూర్ఖపు వాదనలు.
భువనేశ్వరి సైతం ఇదే వాదన (CBN)
కోర్టులను, వ్యవస్థలను జగన్ మేనేజ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబుకు బెయిల్ వచ్చేదా? చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సైతం ఇది ప్రజల గెలుపు అంటూ నినాదాలిస్తున్నారు. బాబు కంటికి ఆపరేషన్ కోసం జైలు నుంచి విడుదల కావడం ప్రజల గెలుపు ఎలా అవుతుందో, ఈ పరిజ్నానంతో రాజకీయాల్లోకి వచ్చి ఆమెఏం చేయదలచుకున్నారో ఆమెకే తెలియాలి. ఇక లోకేష్ అయితే అసలు యుద్ధం ఇప్పుడు ప్రారంభమవుతుంది. లయన్ ఈజ్ బ్యాక్ అంటున్నాడు.. తమ నేత నెల్లాళ్ల తర్వాత బెయిల్ మీద బయటకొస్తుంటే కార్యకర్తలు, నేతల్లో అత్యుత్సాహం కోసం ఏదో మాట్లాడారు అనుకోవచ్చు.. కానీ పూర్తిగా చదువు, తెలివి తేటలు ఉండి, ఓ పార్టీని నడిపే నేతలూ కూడా ఇలా నేలబారు గా నిరక్షరాస్యుల్లా మాట్లాడటం మూర్ఖత్వం కాక ఇంకేమవుతుంది?