వచ్చేనెల నుంచి అంటే రేపటినుంచి దక్షిణ భారత దేశంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ IMD అంచనా వేస్తోంది. రానున్న మూడ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరోసారి వర్షాలు ప్రారంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. కేరళ, తమిళనాడులో సోమవారం నుంచి వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది.నవంబర్ 2వ తేదీ నుంచి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.అక్టోబర్ 30, నవంబర్ 3వ తేదీల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.అయితే తెలుగు రాష్ట్రాల్లో మబ్బు కమ్ముకుంది.
పెద్దగా ఎండ లేదు.రెండు రోజుల నుంచి ఉదయం పూట చలిగాలులు వీస్తున్నాయి. దట్టమైన మబ్బులు కమ్ముకుని ఉదయపు ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. మధ్యాహ్నాలు కూడా మబ్బు, నీరెండతో సరిపెడుతోంది. ఇలా ఉన్న ఈ సీజన్ లో ఎల్లుండి నుంచి వర్షాలు పడే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ.మరోవైపు లక్ష ద్వీప్, హిమాచల్ ప్రదేశ్ లలోనూ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కరైకల్ లోనూ అయిదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది.తమిళనాడులో ప్రత్యేకించి వచ్చే నెల మూడున భారీ వర్షం పడొచ్చు.శ్రీలంక పరిసర ప్రాంతాల్లో తుఫాను గాలుల ప్రభావం వల్ల ఉత్తర బంగాళా ఖాతంలో చలి గాలులు వీచే అవకాశం ఉంది. IMD
వెంటాడిన వర్షా భావ పరిస్థితులు IMD
ఎల్ నినో వల్ల దేశంలో కరువు ఛాయలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే వర్షాలు తగినంత పడక వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. జూన్ నెలంతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా, జూలైలో విస్తారంగా కురిసిన వర్షాలతో వర్షపాతం లోటు కాస్తా రికవర్ అయింది. ఆగస్టులో మళ్లీ వర్షాల జాడే కన్పించలేదు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరోసారి వర్షాలు ప్రారంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.మరోవైపు ఏపీలోన అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ హెచ్చరించింది. IMD
వర్షాభావ పరిస్థితుల వల్లనే మార్కెట్ లో నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అటు పప్పుల ధరలు, ఇటు కూరగాయలు, పళ్ల ధరలు కూడా అమాంతం పెరిగాయి. ఆకు కూరల ధరలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో పెరిగాయి.పంటలు వేసినప్పుడు భారీ వర్షాలు, తుఫాన్లు రావడం పంట నష్టం జరగడం వల్ల మార్కెట్ కు సరుకు చేరడం లేదు. మిగిలిన సమయాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల విత్తులు కూడా వేసే పరిస్థితి లేదు. దీంతో వ్యవసాయమంటేనే రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగినన్ని పడితేనే భూ గర్భ జలవనరులు పెరిగి వ్యవసాయానికి వీలుగా ఉంటుంది. ఎల్ నినో కారణంగా ఆ పరిస్థితులు లేకపోవడంతో పంటలు పండించడమే గగనంగా మారింది. అందుకే పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కందిపప్పు ధర అయితే కేజీ రెండు వందలు పైనే పెరిగింది. IMD