(Love crime)
ఆడపిల్లలు జాగ్రత్తగా, చైతన్యంతో వ్యవహరించాలంటూ ఎన్ని సందేశాలు ఇస్తున్నా… ఎన్నిసార్లు చెబుతున్నా అమ్మాయిల్లో ఆ వివేచన రావడం లేదు… ప్రేమ పేరుతో అబ్బాయిల వలలో పడి సర్వం కోల్పోయి, ఆపై లబో దిబో మంటున్నారు. ఈ దిశగా మహిళా సంఘాలు, సంస్థలు ఎంత ఎడ్యుకేట్ చేసినా చదువుకుంటున్న అమ్మాయిలే ఈ రొంపిలోకి దిగి భవిష్యత్తును బుగ్గి పాలు చేసుకుంటున్నారు. కొందరు అవమానం, వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఈ రకమైన మోసాలు, వేధింపులు ఎక్కువవుతున్నాయి. వివరాల్లోకి వెళితే… ప్రేమ పేరుతో వంచించి ఓ యువతి పై ఒకరు అత్యాచారం చేయగా అతడితో ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి మరొకరు లైంగిక దాడి చేసిన ఘటన తాడిపత్రి నియోజకవర్గంలో చోటు చేసుకుంది.
పదే పదే మోసపోయిన బాధితురాలు
తాడిపత్రి పట్టణ పరిధి లోని ఓ మండలానికి చెందిన విద్యార్థిని విజయవాడలో బీటెక్ చదువుతోంది. ఈమెకు అదే మండలానికి చెందిన కృష్ణారెడ్డితో ఐదు నెలలుగా పరిచయం ఉండేది ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఆమెను నమ్మించడానికి బ్లేడుతో చేతిని కోసుకున్నాడు. దీంతో భయపడిన యువతి అతడితో చనువుగా ఉండేది. అక్టోబరు 19న నిందితుడు కృష్ణారెడ్డి విజయవాడలో హాస్టల్లో ఉన్న యువతికి ఫోన్ చేసి బెంగళూరుకు రావాలని లేని పక్షంలో ఇద్దరి పరిచయాన్ని కుటుంబ సభ్యులకు, తెలిసినవారికి చెబుతానని బెదిరించాడు. దీంతో బాధిత యువతి 20న బెంగళూరుకు వెళ్లింది. అక్కడ ఆమెను నిందితుడు తన మిత్రుడి గదికి తీసుకెళ్లాడు. గదిలో ఎవరూ లేనప్పుడు బెదిరించి అత్యాచారం చేశాడు. ఇలా నాలుగు రోజుల పాటు లైంగిక దాడి చేశాడు. చివరికి అతడి నుండి ఎలాగోలా తప్పించుకుని సొంతూరుకు వెళ్లింది.
గుంతకల్లు నుంచి నిందితుడి మిత్రుడి ట్రాప్ (Love crime)
తిరిగి అక్టోబరు 28న కళాశాలకు వెళ్లడానికి తండ్రితో కలిసి గుత్తి వరకు వెళ్లింది. తండ్రి ఆమెను అక్కడ వదిలి వెనుదిరిగాడు. ఆ సమయంలో యువతి ఫోనుకు గుంతకల్లు పట్టణానికి చెందిన దివాకర్ అనే వ్యక్తి ఫోన్ చేసి ‘బెంగళూరులో కృష్ణా రెడ్డితో ఏకాంతంగా కలిసి ఉన్న ఫొటోలు, వీడి యోలు నా వద్ద ఉన్నాయి. “ నేను చెప్పినట్లు విన కపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి గుంతకల్లుకు రావాలన్నాడు. భయపడిన బాధితురాలు గుంతకల్లుకు వెళ్లగా.. ఆమెను స్థానికంగా ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. పలుమార్లు బెదిరింపులకు పాల్పడుతూ రెండు రోజుల పాటు లైంగికంగా నరకం చూపించాడు.”
ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు రహస్యంగా చిత్రీకరించాడు. వాటిని మొదటి నిందితుడు కృష్ణా రెడ్డి, మరికొందరికి పంపాడు ఇలా కృష్ణారెడ్డి, దివాకర్ వాళ్లకు తెలిసిన మిత్రులు అందరికీ పంపించారు. ఇది తెలియని బాధితురాలు లాడ్జి నుంచి బయటపడి విజయవాడకు వెళ్లిపోయింది. ఆ ఫొటోలు, వీడియోలు అదే మండలానికి చెందిన సుదర్శన్ రెడ్డికి చేరడంతో అతడు ఆ అమ్మాయి సమీప బంధువులకు తెలిపాడు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. దిశ పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఒక సారి లొంగిపోయిన ఆ యువతిని నిందితులు బ్లాక్ మెయిల్ చేయడంతో భయపడి పదేపదే వారికి లొంగిపోయింది.