Accident
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు.. డ్రైవర్లపై విపరీతమైన ఒత్తిడి వెరసి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇంజను మొరాయించడం, బ్రేకులు ఫెయిల్ అవడం, యాక్సిడెంట్లకు కారణమవుతోంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఈ ఉదయం జరిగిన ప్రమాదం కూడా అలాంటిదే. నగరంలోని పండింట్ నెహ్రూ బస్టాండులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 12వ నెంబర్ ప్లాట్ ఫాంపై ప్రయాణికులు వేచి ఉండగా వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆర్టీసీ బుకింగ్ క్లర్క్, ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు చీరాలకు చెందిన (కుమారి)గా గుర్తించారు, బుకింగ్ క్లర్క్ ను గుంటూరు 2 డిపోకు చెందిన ఉద్యోగిగా(వీరయ్య) గుర్తించారు. ప్రమాదంలో కుమారి కోడలు సుకన్య, మనవడు అయాన్( 18 నెలలు)కు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. మహిళ కాలు విరగగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. చిన్నారిని విజయవాడ నూతన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రివర్స్ గేర్ పడకపోడమే కారణమా? Accident
ప్రమాదానికి కారణం బస్సును వెనక్కు తీసేందుకు రివర్స్ గేర్ వేయగా అది ఫెయిల్ అయి ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లింది. ఈఘటనలో ముగ్గురు ప్రయాణికులు మరణించడం దురదృష్టకరం. గేర్ సరిగా పడక బస్సు అ దూసుకొచ్చిందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. శాఖాపరమైన దర్యాప్తు చేశాక చర్యలు తీసుకుంటామని ఏసుదానం వెల్లడించారు.
రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్…..
అయితే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బస్సు డ్రైవర్ రివర్స్ గేర్ కు బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి 11, 12 ప్లాట్ ఫాంల వద్ద రెయిలింగ్ తో పాటు, ప్లాట్ ఫైం ఉన్న కుర్చీలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా బస్సు పైకి రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా…… Accident
ఈ ఘటన దురదృష్టకరమని, బస్సులో అప్పటికే 24 మంది ప్రయాణికులున్నారని, బస్సు బయల్దేరే ముందు ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఆయన 24 గంటల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై పూర్తి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బస్సులన్నీ కండీషన్ లోనే ఉన్నాయని, ప్రమాదానికి మానవ తప్పిదమా.? లేదా సాంకేతిక కారణాలా? అనేది విచారణలో తేలుతుందన్నారు. Accident
సీఎం దిగ్భ్రాంతి
బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. Accident