(WAR)
హమాస్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఉద్దేశించిన ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతాన్ని ఏకాకిని చేయగలిగాయి. ఉత్తర గాజాతోఇతర ప్రాంతాలకు ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయిజ హమాస్ మిలిటెంట్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో దాడులు జరిపి హమాస్ ఉగ్రమూకలను ఏరేసేదిశగా అడుగులు వేస్తున్నాయి. భూతల దాడులు జరిగితే ప్రాణనష్టం భారీగా ఉంటుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఇజ్రాయెల్ దాడులను తిప్పు కొట్టేందుకు హమాస్ కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే 10 వేలమంది చనిపోయారు. గాజాను కబళించిన ఇజ్రాయెల్ దానిని ఉత్తర , దక్షిణ ప్రాంతాలుగా విభజించింది.
ఇలా ప్రాంతాల వారీగా, వీధి వీధినా పోరాటాలు జరుపుతూ ఉగ్ర దళాలను అంతమొందించాలన్నది ఇజ్రాయెల్ ప్లాన్.అయితే హమాస్ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇజ్రాయెల్ పైకి రాకెట్లను హమాస్ ప్రయోగిస్తూనే ఉంది.ఈయుద్ధ వాతావరణం చూసి బెంబేలెత్తి సరిహద్దుల్లో వేలమంది ఖాళీ చేసి వెళ్లిపోయారు.ఉత్తర గాజాలో కరెంటు, నీటి సరఫరా వ్యవస్థలను స్తంభింప చేస్తున్నారు.
హమాస్ ఉగ్రవాదులను సంహరించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించిన ఇజ్రాయెల్ తమ దాడులను ఆగి, ఆగి విరామాల మధ్య చేయాలని నిర్ణయించింది. భీకర దాడులకు అప్పుడప్పుడు విరామివ్వాలని మానవతా థృక్పథంతో స్పందించింది.
భారత్ జోక్యం కోరిన ఇరాన్ (WAR)
పరిస్థితిని ప్రసన్నం చేసేందుకు ఇజ్రాయెల్ తో మాట్లాడి శాంతి వాతావరణాన్ని నెలకొల్పాలని ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ భారత ప్రధాని మోడీని కోరారు. మోడీతో జరిపిన టెలిఫోన్ సంభాసణలో ఈ విన్నపం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో తాము పాత విధానానికే కట్టుబడి ఉన్నామని మోడీ రైసీకి తెలిపారు. ప్రపంచంలో అలీన విధానానికి బాటలు వేసిన దేశంగా భారత్ తన పలుకుబడి, పరపతిని ఉపయోగించి ఇజ్రాయెల్ ను అదుపు చేయాలని రైసీ కోరారు.
గాజాలో అఛివేత దారులను, జినోయిస్టులను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధాన్ని ఆపడానికి భారత్ తన శక్తి యుక్తులను వినియోగించాలని ఆయన కోరారు. కాల్పుల విరమణకు చేసే ఏ ప్రతిపాదననైనా తమ దేశం వెను వెంటనే స్వాగతిస్తుందన్నారు. గాజా ప్రజలకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరముందన్నారు. పాలస్తీనా ప్రజలను అలా నిరంతరం హతమారుస్తూ ఉండటం ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్వాతంత్ర్య దేశాలనూ కలవర పెడుతోందని ఈ నరమేధానికి పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయని ఇరాన్ నేత రైసీ ప్రకటించారు.
అమాయకుల హననం
అమాయకులైన మహిళలు, చిన్నపిల్లలు, ఆస్పత్రులు, స్కూళ్లు, మసీదులు, చర్చిలు, నివాస ప్రాంతాలపై నిరంతర దాడులు ఖండించ దగినవని, ఆమోదయోగ్యం కావనీ రైసీ కామెంట్ చేశారు. పాలస్తీనా దళాలకు ఇజ్రాయెల్ ఆక్రమిత దాడులను వ్యతిరేకించే హక్కు ఉందని, జినోయిస్టుల ఉనికిని అంతం చేసే ప్రయత్నాని ఎదురొడ్డి పోరాడుతున్న వారి ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు మద్దతు తెలపాలని ఇరాన్ కోరింది.
జర్మనీ నియంత నాజీ పై యూరప్ దేశాలు చేసిన పోరాటాన్ని వీరోచితమైన పోరాటమని చెప్పే వాళ్లు, పాలస్తీనా ప్రజల పోరాటాన్ని ఎందుకు ఖండించరని ఇరాన్ నిలదీసింది. భారత్ తో టెహరాన్ సంబంధాలు అత్యంత వ్యూహాత్మకమైనవని, ఇరుదేశాలు అభివృద్ధి, పరస్పర సహకారం విషయంలో సహకరించుకుందామని కూడా రైసీ మోడీకి ప్రతిపాదించినట్లు సమాచారం. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగి మానవతా సాయం అంది, శాంతి, సుస్థిరతలను స్థాపించడం ఇరు దేశాల లక్ష్యంగా ఉండాలని మోడీ కూడా సూచించారు.