Diwali Lamps
దీపావళి పండుగ వచ్చేస్తోంది.. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగంటే అందరికి చెప్నలేనంత ఇష్టం. కానీ అసలు దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం… చీకటి అంటే దరిద్రం (జేష్టాదేవి), వెలుగు అంటే లక్ష్మీదేవి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను వెళ్లగొట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి దీపావళి పండుగ రోజు దీపాలను వెలిగించడానికి గల ముఖ్యకారణం. దీపం అంటేనే లక్ష్మీదేవి. దీపాన్ని పూజిస్తే లక్ష్మీదేవిని పూజించినట్లే. అందుకే దీపావళి రోజున ఇల్లంతా దీప కాంతులతో వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ దీపావళి పండుగ ఇక్కడితో ఆగదు. తర్వాత వచ్చే కార్తీకమాసం అంతా కూడా కోనసాగుతుంది.
ఈ పర్వదినాన ఇంట్లో ఎక్కడెక్కడ దీపాలు పెడితే మంచిది…
సాధారణంగా దీపావళి పండుగ రోజున పూజ గదిలో, తులసికోట దగ్గర, ఇంటి ముంగిట్లో, గోడలపైన, అరుగులపైన, డాబాలపైన, బాల్కనీల్లో, ఇంటి వెనుక పెరట్లో దీపాలను పెడుతుంటారు. అంతేకాకుండా ఇల్లంతా కూడా దీపాలు పెట్టాలని శాస్త్రం చెబుతుంది. ఇంటికి నాలుగు మూలలు ఉంటాయి. ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఈ నాలుగు మూలల్లోనూ కూడా దీపాలు పెట్టుకోవాలి. ఇంట్లో ఉండే ప్రతి రూమ్ లో, స్టోర్ రూమ్ లో, ఆఖరికి బాత్ రూమ్ లో కూడా దీపం పెట్టుకోవాలి. ఈ పర్వదినాన ఏ గదిలోనూ చీకటిగా ఉండకూడదు. చీకటి అంటే దరిద్రదేవత, ఆ రోజు చీకటి లేకుండా ఇల్లంతా వెలుగుతో నింపుకోవాలి.
దీపాలతో వాతావరణ మార్పులు… Diwali Lamps
దీపాలను వెలిగించడం వల్ల వాతావరణంలో కోన్ని మార్పులు ఉత్పత్తి అవుతాయి. ఇంట్లో స్వచ్ఛమైన దేశీయ నెయ్యి లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దాని పొగ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం వల్ల సూక్ష్మజీవులను నాశనం చేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే అది వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. కాలుష్యన్ని కూడా నివారిస్తుంది. మరో విశేషమేమిటంటే దీపం కొండెక్కిన తర్వాత సుమారు నాలుగు గంటల వరకు దీని ప్రభావముంటుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా చీకటి మాయమవుతుంది. అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ మంచి పని చేసినా జ్యోతిప్రజ్వలనతో ఆ పనిని ప్రారంభిస్తారు. అంతటి అద్భుతమైన శక్తి దీపానికి ఉంది.
దేవతలకు ప్రతిరూపమైనది… దీపం
దీపం వెలుగుతో చీకటి మాయమవ్వడమే కాకుండా మనుషుల్లోని అంధకారాన్ని.. మనసులోని చెడు భావాన్ని తొలగిస్తుంది. ఇంతటి అద్భుత శక్తిగల దీపం లక్ష్మీదేవికి ప్రతీక. కాబట్టే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం. పంచభూతాల్లో ప్రధామైనది అగ్ని. అగ్ని సకల జీవరాశి మనుగడకు కాంతిని అందిస్తుంది. దీపాల వెలుగును సరిగ్గా గమనిస్తే.. నీలం, పసుపు, ఎరుపు రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు సత్వా, రజో, తమహ్ గుణాలకు ప్రతీకలుగా ఉంటాయని వేదాలు చెబుతున్నాయి. ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవీగా పురణాలు చెబుతున్నాయి. అందుకే దీపావళి రోజు, కార్తీక పౌర్ణమి రోజున దీపాన్ని వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని ప్రతీతి.
దీపావళి యెుక్క విశిష్ట కథ…! Diwali Lamps
పురాతన కాలంలో ఓ మహిళ ప్రార్థించగా భగవంతుడు ప్రత్యేక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆమె దీపావళి పర్వదినాన గ్రామంలో ఒక్క దీపం కూడా వెలగకుండా చూడమని కోరింది. భగవంతుడు తథాస్తు అన్నాడు. దీపావళి పండుగ రానే వచ్చింది. ఊరిలో ఒక్క దీపం కూడా వెలగలేదు. ఆమె మాత్రం ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపాల వెలుగులతో నింపి ఇంటి గుమ్మంలో కూర్చుంది. ఆ గ్రామంలోకి వచ్చిన లక్ష్మీదేవికి ఏ ఇంటిలోను దీపం కనిపించలేదు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఓ ఇల్లు దీప కాంతులతో వెలిగిపోతుండటం చూసి అటువైపుగా వచ్చింది.
ఈ ఇల్లాలు ఎవరో చక్కగా దీపాలు పెట్టి ఎంత బాగా అలంరించిందో కదా అంటూ ఇంటిలోకి వెళ్లబోయింది. అప్పుడా ఇల్లాలు ఆగమ్మా లక్ష్మీదేవీ.. ఇంట్లోకి వెళ్లేముందు నాకో మాట ఇవ్వు అని అడగగా దానికి లక్ష్మీ దేవి కోరుకోమ్మా అంటే ఇంట్లోకి వెళితే..ఇంకెప్పుడు నీవు బైటకు వెళ్లను అని మాట ఇస్తేనే వెళ్లనిస్తాను అందట. దానికి లక్ష్మీదేవి ఇల్లు ఇంత కళగా ఉంటే నేనెందుకు వెళతాను అనిందట. అయితే తల్లీ రామ్మా అంటూ లక్ష్మీదేవికి ఇంట్లోకి ఆహ్వానించింది.
లక్ష్మీదేవి ఇంట్లోకి రావటంతో దరిద్రదేవత (జేష్టాదేవి) ఇంట్లో ఉండలేకపోయింది. ఇల్లు దీపాలతో వెలిగిపోతుంటే నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను.. లక్ష్మీదేవి ఉన్నచోట నేను ఉండను అంటూ ఇంటి నుంచి వెళ్లబోయిందట. అప్పుడు ఆ ఇల్లాలు దరిద్ర దేవతను ఆపి ఇంకెప్పుడూ మా ఇంట్లోకి రానని అంటేనే వెళ్లనిస్తాను అందట. ఇల్లు దీపాలతో వెలిగిపోతుంటే నేనెలా ఉండగలను. ఇకపై ఎప్పుడూ నీ ఇంటివైపు కన్నెత్తి చూడను అంటూ వెళ్లిపోయిందట. లక్ష్మీదేవి రాక.. దరిద్రదేవత వెళ్లటంతో ఆ ఇల్లాలు ఎంతో సంతోషించింది. దీపావళి రోజున దీపాల వెలుగులతో ఇల్లు నిండిపోతే ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఈ కథలో నిరూపితమైనది.