WAR
హమాస్ ను తుద ముట్టించేందుకు రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ దళాలు ఇవాళ గాజా నడిబొడ్డుకు చేరుకున్నాయి. అక్టోబర్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా నెల్లాళ్ల నుంచి పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దళాలు దాడులు జరుపుతున్నాయి.హమాస్ మూకలు ఇజ్రాయెల్ సరిహద్దు భూభాగంపై దాడి చేసి 1400 మందిని మట్టుపెట్టిన నాటినుంచి ఇజ్రాయెల్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. భూతలంనుంచి గగన తలంనుంచి విడవకుండా పాలస్తీనా భూభాగంపై దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడులలో ఇప్పటి వరకూ పదివేల మంది చనిపోయారు.
బందీలను వదిలితేనే కాల్పుల విరమణ WAR
ఇజ్రాయెల్ దళాలు హమాస్ ఉగ్రమూకల అధీనంలో ఉన్న రహస్య టన్నెల్ నెట్ వర్క్ ను ధ్వంసం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వందల కిలోమీటర్అల మేర విస్తరించిన ఈ టన్నెల్ ను ధ్వంసంచేయడానికి ఇంజనీరింగ్ నిపుణులు పేలుడు పదార్ధాలను వినియోగిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు లెబనాన్ ను తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ మద్దతుతో తమ భూభాగంపై ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేసే వరకూ గాజాకు ఇంధన సరఫరాను సైతం నిలిపివేస్తామని ప్రకటించారు. అప్పటి వరకూ కాల్పుల విరమణ అంశం పరిగణనలోకి రాదని తేల్చి చెప్పారు. గాజాలో హమాస్ అతిపెద్ద ఉగ్రవాద నెట్ వర్క్ ను ఏర్పాటు చేసిందని దీనిని ధ్వంసం చేసి తీరుతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ తెలిపారు.
తీవ్రంగా నష్టపోతున్న రెడ్ క్రాస్, ఛారిటీ దళాలు WAR
గాజాలో నిన్న అత్యవసర మందులను తీసుకు వెళుతున్న రెడ్ క్రాస్ కాన్వాయ్ పై దాడులు జరిగాయి. ఐదు ట్రక్కులు, రెండు వాహనాలు ఈ కాన్వాయ్ లో ఉండగా, ఇందులో రెండు ట్రక్కులు ధ్వంసం అయ్యాయి. డ్రైవర్ గాయపడ్డాడు. అనంతరం ఆ కాన్వాయ్ దారి మళ్లించుకుని నిర్దేశిత ప్రాంతానికి చేరిందని రెడ్ క్రాస్ ప్రకటించింది.
గాజా పై బాంబింగ్ వల్ల ఎమర్జెన్సీ సర్వీసులు అటెండ్ చేస్తున్న ఛారిటీ డాక్టర్ల కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. గాజాలో ఏ ప్రాంతమూ ఇప్పుడు సురక్షితం కాదని డాక్టర్లు అంటున్నారు. యుద్ధం ఆగిపోతే గాజాకు భద్రతా పరంగా సమస్యలు తలెత్తకుండా చూస్తామని,బందీలను విడుదల చేయడం అన్నది తమకు కీలకమని ఇజ్రాయెల్ ప్రకటించింది.
గాజాపై సుదీర్ఘ దాడులు మంచిది కాదు : అమెరికా
అయితే యుద్ధం పేరుతో గాజాపై ఇజ్రాయెల్ సుదీర్ఘకాలం దాడులు చేయడాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది. పాలస్తీనా ప్రజలు ముందుకొచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గాజాను అటు ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించడాన్ని తాము సమర్ధించబోమని ప్రకటించింది.ఇజ్రాయెల్ గాజాలో తన మిలటరీ ఆపరేషన్స్ ను ఉథృతం చేసింది. ఈ పరిణామంతో 20 లక్షల మంది భయపడుతున్నారని తీవ్రమైన ఉద్రిక్తత, రక్తపాతం, విధ్వంసం, ఆగ్రహ జ్వాలలు గాజాలో కనిపిస్తున్నాయి.
ఫ్లాష్ లైట్ల వెలుగులో సర్జరీలు
ఇజ్రాయెల్ దాడులకు గాజా తుక్కు తుక్కుగా మారిపోవడంతో గాజా ప్రజలు నానా రకాల అవస్థలూ పడుతున్నారు. కరెంట్ నిలిపివేయడంతో సర్జన్లు ఫోన్ ఫ్లాష్ లైట్ల వెలుతురులో ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.సగటున గాజాలో రోజుకు 160 మంది చిన్న పిల్లలు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
దేశం దాటేస్తున్న పాలస్తీనియన్లు WAR
దాదాపు 400 మంది ఇప్పటికే రఫా బోర్డర్ దాటి ఈజిప్టుకు వెళ్లిపోయారని, వేలాది మంది పాలస్తీనియన్లు విదేశీ పాస్ పోర్టులతో ఎయిర్ పోర్టులో క్యూలో నిలబడ్డారు. యుద్ధంలో గాయపడిన పాలస్తీనియన్లు, విదేశీయులు, ద్విజాతి పౌరసత్వం కలవారు రఫా బోర్డర్ దాటి వెళ్లేందుకు వీలుగా అయిదు రోజుల నుంచి ఆ సరిహద్దును తెరిచే ఉంచారు.