(TS Elections)
తెలంగాణ రాష్ట్రంలో నిన్న నామినేషన్ల జాతర జరిగింది. మంచి రోజు కావడంతో అతిరథ మహారథులు తమ తమ నియోజక వర్గాలలో నామినేషన్ వేశారు. సీఎం కేసీఆర్ మొన్న కోనాయి పల్లె వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు జరిపించారు. మరోవైపు ఫామ్ హౌస్ లో చండీ యాగం,రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇవాళ ఉదయం ఊరేగింపుగా గజ్వేల్ వెళ్లి అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్ లో ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ మధ్యాహ్న భోజనం చేసి కామారెడ్డి బయల్దేరారు. అక్కడ నామినేషన్ వేసిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు.
సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్ (TS Elections) (TS Elections)
ఇక కేటీఆర్ ఇంట్లో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సిరిసిల్ల వెళ్లారు. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా సిరిసిల్ల చేరుకుని నామినేషన్ వేశారు. ఆపై ఓ బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం ఆర్మూర్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా వాహనానికి సడెన్ బ్రేక్ వేయడంతో రెయిలింగ్ విరిగి వాహనంపై నుంచి కేటీఆర్ ముందుకు పడి కిందకు జారిపోయారు. అదృష్ట వశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అక్కడ నుంచి బయల్దేరి కొడంగల్ రోడ్ షోకు వెళ్లిపోయారు. తన ఆరోగ్యం బానే ఉందని ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఇక సిరిసిల్లలో కేటీఆర్ ప్రత్యర్ధిగా కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేశారు.
హుజూరాబాద్ నుంచి ఈటల
బీజేపి అభ్యర్ధి ఈటల రాజేందర్ కూడా నిన్నే నామినేషన్ వేశారు. ప్రత్యేక హెలికాప్టర్ లో హుజూరాబాద్ చేరుకున్న ఈటలకు కార్యకర్తలనుంచి ఘన స్వాగతం లభించింది. ఆయన్ను దుశ్వాలువతో సన్మానించి ఆపై ఆర్డీఓ కార్యాలయానికి ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు.. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కూడా నిన్నే నామినేషన్ దాఖలు చేశారు.
భట్టి సహా పలువురి నామినేషన్
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిరలో వివేక్ వెంకట స్వామి చెన్నూరులోనూ నామినేషన్లు వేశారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి టీఆర్ ఎస్ అభ్యర్ధి పట్నం పట్నం నరేందర్ రెడ్డి రెడ్డి నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ల సమయంలోనే కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరపడం పట్ల ఆ పార్టీ మండి పడింది.
ఐటి దాడులతో పొంగులేటి నామినేషన్ ఆలస్యం (TS Elections)
పాలేరు నుంచి నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బయల్దేరుతుండగా ఆయన ఇంటికి ఐటీ అధికారులు దాడులకు వెళ్లారు. ఆయన ఇంటిని, కార్యాలయాన్ని దిగ్బంధించి కదలకుండా చేశారు. వారు సోదాలు నిర్వహిస్తుండగానే తాను నామినేషన్ కు వెళ్లాలని పొంగులేటి చెప్పడంతో నామినేషన్ వేసి మళ్లీ వచ్చి ఇక్కడ హాజరు కావాలని ఐటీ అధికారులు చెప్పారు. పొంగులేటి ఇంటిపై ఐటీ దాడులపై ఆయన ముందే ఊహించారు. అన్నట్లుగానే దాడులు జరిగాయి. పొంగులేటికి మద్దతుగా రేవంత్, భట్టీ చాలా గట్టిగానే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పొంగులేటికి అండగా నిలుస్తుందని, సీనియర్ నేతలు ప్రకటించారు. పెద్ద పల్లి బీఆర్ ఎస్ అభ్యర్ధిగా బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్ధిగా వివేక్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
నిన్న చాలా మంచిరోజు కావడంతో పేరున్న నేతలంతా నిన్నే అనుకున్న ముహూర్తానికే నామినేషన్లు వేశారు. ఇవాళే శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకూ మాత్రమే సమయం మిగిలి ఉండటంతో అభ్యర్ధులు హడావుడి పడుతున్నారు.