Caste
ప్రేమ వ్యవహారం ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసింది. ప్రేమించిన బాలికతో ఒంటరిగా ఉన్న యువకుడిని పట్టుకున్న సదరు బాలిక కుటుంబం ఆగ్రహంతో రెచ్చిపోయింది. చిత్రహింసలకి గురి చేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పోచారం మునిసిపాలిటీ పరిధి అన్నోజిగూడలో జరిగింది.
తమ కులం వాడు కాదన్న అక్కసుతో Caste
మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తమ కుమార్తెను ప్రేమించాడన్న అక్కసుతో కర్రలతో కొట్టి నగ్నంగా చేసి దారుణంగా ఓ యువకుడిని హత్య చేశారు. ఓ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరై.. ఆమెతో సన్నిహితంగా ఉన్న 18 ఏళ్ల కుర్రాడిని బాలిక కుటుంబం చంపిన తీరు చర్చనీయాంశమైంది. పోచారం మునిసిపాలిటీ పరిధి లోని అన్నోజిగూడలో మొన్న రాత్రి దరావత్ కరణ్ హత్య జరిగింది. అయితే ఈ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే… ధరావత్ సుశీల తన కొడుకు కరణ్తో అన్నోజిగూడలో 15 ఏళ్లుగా నివసిస్తోంది. ఆమె కూలిపనులు చేస్తూ జీవిస్తోంది. కరణ్ తమ ఇంటికి దగ్గర్లోనే ఉంటున్న 15 ఏళ్ల బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అప్పటినుంచి చాటుమాటుగా ఆ బాలికను కలుస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, నువ్వు లేకుండా ఉండలేనని చెప్పాడు.
ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి
తాజాగా బుధవారం రాత్రి బాలిక తల్లి దండ్రులు స్థానికంగా జరుగుతన్న ఓ శుభకార్యానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కరణ్ అమెను కలుసుకునేందుకు అమె ఇంటికి అర్ధరాత్రి వెళ్లాడు. ఇంతలో ఆమె తల్లి తండ్రులు వచ్చారు. ఆమెతో సన్నిహితంగా ఉండటం చూసి కరణ్ పారిపోకుండా, తప్పించుకోకుండా ఇంటి బయట తాళం వేశారు. తర్వాత దాదాపు 10 మంది కుటుంబ సభ్యులు కలిసి తాళం తీసి ఇంట్లోకి వెళ్లి బాలికతో ఉన్న గదిలోనే కరణ్పై దాడి చేశారు. Caste
చిత్రహింసల పాలు
దాదాపు మూడు గంటల పాటు కరణ్ను చిత్రహింసలు పెట్టారు. కర్రలు, బెల్టుతో కొట్టారు. రహస్య భాగాలపై కారం చల్లుతూ కనీసం కనికరం లేకుండా చిత్రహింసలకు గురిచేశారు. ఇంకోసారి ఆ బాలిక జోలికి వస్తే, చంపేస్తామని హెచ్చరించి, వదిలేశారు. అప్పటికే నీరసించిపోయిన కరణ్ తన ఇంటికి వెళ్లి పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తల్లి సుశీలఅతన్ని ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్ తెలిపారు. తల్లి ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు కేసు రాసి.. బాలిక కుటుంబ సభ్యులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక్కడ తప్పు రెండువైపులా ఉంది. ప్రేమ పేరుతో బాలికకు దగ్గరవ్వడం కరణ్ చేసిన తప్పు. అతనికి తప్పొప్పులు చెప్పి.. సరైన దారిలో పెట్టాల్సిన బాలిక కుటుంబ సభ్యులు, అతనిపై దాడి చేసి, ప్రాణం పోయే పరిస్థితి తేవడం వారు చేసిన నేరం. ఈ ఘటన వల్ల సుశీల తన కొడుకును కోల్పోగా… బాలిక కుటుంబ సభ్యులు జైలు పాలయ్యారు.మొత్తానికి ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నాగరికత పెరుగుతున్నా ఇంకా కులాల పేరుతో అణచివేత, దాడులు జరగడం విచారకరం. Caste