IND VS NZ
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసలు సిసలైన సమరం నేడు మొదలవనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు వరల్డ్ కప్ ఫైనల్ లోకి అడుగుపెడుతుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఓటమి లేకుండా ఆడి తొమ్మిది మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా సెమీస్ లోనూ కివీస్ ను మట్టి కరిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రికెట్ ప్రియులు ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు.
కదిలి వచ్చిన స్టార్స్…….
వాంఖడేలో జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చుసెందుకు పలువురు సెలెబ్రెటీలు ఇప్పటికే ముంబాయి చెరుకున్నారు. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మ్యాచ్ ను వీక్షించేందుకు బయలుదేరి ముంబయి చెరుకున్నారు. ఇక బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ అలాగే టాలీవుడ్ నుంచి వెంకటేశ్ లాంటి స్టార్లు ఈ మ్యాచ్ నిచుసెందుకు ముంబయి చెరుకున్నారు. వాంఖడేలో జరిగే ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడనున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులను బీసీసీఐ ఆహ్వానించడం విశేషం.
వాంఖడే స్టేడియంలో టాస్…. IND VS NZ
టాస్ గెలిచిన 10 సార్లు కెప్టెన్లు బౌలింగ్ ఎంచుకోగా, మిగతా 17 సార్లు మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాయి. అంటే ఈ వేదికపై మొదట బ్యాటింగ్ చేయడానికి ప్రాధాన్యతనిస్తుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు 17 మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచి తొమ్మిది మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టు 10కి నాలుగు గెలిచి ఆరు ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్లో రెండుసార్లు మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాయి. రెండు సందర్భాల్లో ఓడిపోయాయి. అయితే, వాంఖడేలో ఇప్పటివరకు జరిగిన టోర్నీలో పరిస్థితులు పేసర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. పేసర్లు 6.60 ఎకానమీ రేటుతో 47 వికెట్లు తీశారు. మరోవైపు స్పిన్నర్లు ఓవర్కు సగటున 5.9 పరుగులిచ్చి 11 వికెట్లను మాత్రమే సాధించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో లైట్ల వెలుతురులో కొత్త బంతితో పేసర్లు స్వింగ్, సీమ్ కదలికలను కూడా ఆస్వాదించారు. మొదటి పవర్ప్లేలో ఛేజింగ్లో ఉన్న జట్టు నాలుగు మ్యాచ్ల్లో 17 వికెట్లు కోల్పోయింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సంబంధిత వ్యవధిలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయింది.
ఏ జట్టు ఎన్నిసార్లు…
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్లు మద్య తొమ్మిది సార్లు తలపడ్డాయి. ఇందులో కివీస్ ఐదుసార్లు, భారత్ జట్టు నాలుగు సార్లు గెలిచింది. ఈ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో కివీస్ పై భారత్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. లీగ్ దశలో జరిగిన అన్ని మ్యాచ్ లలో విజయం సాధించి భారత్ జట్టు కొండంత ఆత్మవిశ్వాసంతో సెమీస్ లో కివీస్ ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు విజయానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
వర్షం పడితే రిజర్వు డే……. IND VS NZ
ఇక ఇలాంటి క్రమంలో మ్యాచ్ ఆడిన సందర్భంలో వర్షం కనక పడితే పరిస్థితి ఎంటి అనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. అయితే దీనికి ఐసిసి ఒక పరిష్కారం కూడా చూపించింది. అదేంటి అంటే సెమీఫైనల్ మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తే సెమీ ఫైనల్ మ్యాచ్ కి రిజర్వ్ డే కింద ఈ మ్యాచ్ ను నెక్స్ట్ డే నిర్వహించడం జరుగుతుందని ఐసిసి తెలియజేసింది. వర్షం వల్ల మొత్తానికే మ్యాచ్ స్టార్ట్ అవ్వకపోతే రిజర్వుడ్ డే కింద నెక్స్ట్ డే మళ్లీ మ్యాచ్ మొదటినుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మ్యాచ్ సగం లోకి వచ్చిన తర్వాత వర్షం పడితే ఆ మ్యాచ్ కి ఎక్కడైతే బ్రేక్ పడిందో అక్కడి నుంచి నెక్స్ట్ డే కంటిన్యూ చేయడం జరుగుతుంది.
ఇక ఇలా కాకుండా రెండు రోజులు వర్షం అంతరాయం వల్ల మ్యాచ్ రద్దు చేయాల్సి వస్తే మాత్రం పాయింట్స్ టేబుల్ లో ఎవరు అగ్రస్థానంలో ఉంటారో వాళ్లు ఫైనల్ కి అఫీషియల్ గా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ లెక్కన ఒకవేళ న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ వర్షం కారణం గా రద్దు అయితే ఇండియా ఫైనల్ కి చేరుకుంటుంది. అలాగే సౌతాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయినట్లయితే సౌతాఫ్రికా టీం ఫైనల్ కి చేరుకుంటుంది.