(Air Taxi’s)
ప్రపంచంలో అతిపెద్ద సమస్య రవాణా. అయితే భారతదేశంలో ప్రస్తుతం పెరిగిపోతున్న ట్రాఫిక్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్ త్వరలోనే అందుబాటులోకి వస్తోంది. ప్రముఖ విమాన సంస్థ ఇండిగోకు సపోర్ట్ ఇస్తున్న ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ అండ్ యుఎస్కు చెందిన ఆర్చర్ ఏవియేషన్ 2026 నాటికి భారతదేశంలో ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించే ఉద్దేశంలో ఉన్నాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో తీవ్రమైన రోడ్డు ట్రాఫిక్ రద్దీ , పెరుగుతున్న కాలుష్యానికి పరిష్కారంగా ఈ రెండు కంపెనీలు అవసరమైన అనుమతులు పొందిన తర్వాత భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో ఎయిర్ టాక్సీలను నడపడం ప్రారంభిస్తాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో దీన్నిమొదట అమలు చేయనున్నారు.
ఎయిర్ ట్యాక్సీ ఢిల్లీ నుంచి…. (Air Taxi’s)
ఢిల్లీలో కారులో 60 నుండి 90 నిమిషాలు పట్టే ప్రయాణాన్ని ఫ్లయింగ్ టాక్సీ ద్వారా దాదాపు 7 నిమిషాల్లో చేరుకోవచ్చు. కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, అత్యవసర సేవల కోసం కూడా వీటిని ఉపయోగించవచ్చు. భారత్లో ఎయిర్ ట్యాక్సీ సేవలు ఢిల్లీ-ముంబై నుంచి ప్రారంభం కానున్నాయి. మొదట ఢిల్లీ నుంచి ప్రారంభమై ముంబై మీదుగా బెంగళూరుకు చేరుకుంటుంది. ఆ తర్వాత మరో నగరంలో దీని సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ సర్వీస్ను ఆన్-రోడ్ ధరతో సరిపోల్చనున్నామని, తద్వారా ఎక్కువ మంది ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చని రెండు కంపెనీలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ రోడ్డు మార్గంలో ప్రయాణించే దూరాన్ని గరిష్టంగా తగ్గించనుంది. పైగా ట్రాఫిక్ జామ్ నుంచి విముక్తితోపాటు, ప్రజల సమయం కూడా ఆదా అవుతుంది.
నిలువుగా ల్యాండింగ్…..
ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ విమానాలను ఆర్చర్ ఏవియేషన్ తయారు చేస్తుంది. ఈ విమానాలు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి. ఈ ఎయిర్ టాక్సీ పైలట్తో సహా ఐదుగురు వ్యక్తులతో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రెండు వందల ఎయిర్ ట్యాక్సీలతో భారత్లో ఈ సర్వీసును ప్రారంభించాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. చార్టర్, లాజిస్టిక్స్, మెడికల్ ఎమర్జెన్సీ మొదలైన వాటికి కూడా వీటిని ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది. బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో తొలిసారిగా ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ టాక్సీ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రెండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ టాక్సీలో రెండు క్వింటాళ్ల లగేజీని కూడా తీసుకెళ్లవచ్చు. దీంతో భారత్లో ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించడంపై చర్చలు మొదలయ్యాయి. (Air Taxi’s)
గంటకు 128 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ…..
గత నెలలో ఎయిర్ టాక్సీ కార్యకలాపాలకు చైనా అనుమతి ఇచ్చింది. ఎహాంగ్ అనే కంపెనీకి ఎయిర్టాక్సీ నడిపేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ రెండు-సీట్ల ఎయిర్ టాక్సీ కేంద్రీకృత కమాండ్ ద్వారా నిర్వహించబడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 128 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీని ఒకసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.దీన్ని గంటకు రెండు వందల కిలోమీటర్లకు పెంచేందుకు చైనా కసరత్తు చేస్తోంది.2024 ఒలింపిక్ క్రీడలకు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రీడల సందర్భంగా ఫ్రాన్స్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని ప్రారంభించాలని పేర్కొంది. తర్వాత వైద్య అవసరాలకు వినియోగించే యోచనలో ఉన్నారు. ఇది కూడా రెండు సీట్ల ఎయిర్ టాక్సీ. ఇందులో ఒక పైలట్, ఒక ప్రయాణీకుడు ప్రయాణించడానికి వీలుంటుంది. (Air Taxi’s)