తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో బీజేపి BJP ఖాళీ అవుతోంది. చివరకు విజయశాంతి కూడా బీజేపికి రాజీనామా చేసేశారు. తొందరలోనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని, మెదక్ ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారని సమాచారం. మొత్తం మీద బీజేపీలో చేరికలు ఎంత స్పీడుగా జరిగాయో అంత స్పీడుగానూ పార్టీని వదిలేయడం జరిగిపోయింది. పార్టీ అధ్యక్షుడుగా బండి సంజయ్ ను తప్పించడమే ఆపార్టీ చేసిన నేరమా? అంటే అవుననే చెప్పాలి. బండి సంజయ్ నాయకత్వంలో టాప్ గేర్ లో దూసుకు పోతున్న బీజేపికి నాయకత్వ మార్పిడి చేయడం ద్వారా కూర్చున్న కొమ్మనే నరుక్కుంది బీజేపి. అనూహ్యంగా పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగించడం బండి సంజయ్ ను నిమిత్త మాత్రుడిని చేయడం వల్ల బీజేపి ఎంత స్పీడుగా ఎదిగిందో అంతే స్పీడుగా, పాల పొంగులాగా చల్లబడిపోయింది.
పగ్గాలెందుకు మారాయి? BJP
సంజయ్ ను ఎందుకు తప్పించారనడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కేసీఆర్, బీజేపి ఒప్పందంలో భాగంగానే బండిని తప్పించారని కొందరి ఎనాలిసిస్..కేంద్రంలో ఎంపీ సీట్ల కోసం బీజేపి కేసీఆర్ తో లాలూచీ పడిందని చాలా మంది అంటుంటారు. అందరి అనుమానాలను నిజం చేస్తూ కేసీఆర్ ఈ మధ్య మోడీనిగానీ, బీజేపిని గానీ పల్లెత్తు మాట అనటం లేదు. ఇప్పటి వరకూ బీఆర్ ఎస్ కు కాంగ్రెస్ ప్రధాన, ప్రప్రధమ శత్రువు. బీజేపికి కూడా అంతే.. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే.. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపికి తప్పుడు సంకేతాలుగా పరిణమిస్తాయని ఆ పార్టీ కూడా వర్రీ అవుతూ ఉండొచ్చు.. కాబట్టి రెండు పార్టీలు తెర చాటున, చాటు మాటుగా ఈ ఒప్పందానికి ఒచ్చి ఉండొచ్చు.
కేసీఆర్ పై వ్యతిరేకతతోనే
ఈ రెండు పార్టీల ప్రయోజనాల మాటెలా ఉన్నా.. కేసీఆర్ అంటే పీకల దాకా కోపమున్న విజయ శాంతి లాంటి నేతలు అప్పట్లో బీజేపిలో చేరారు.. వారు కమలం పార్టీకి మద్దతు పలకడానికి మెయిన్ రీజన్ కేసీఆర్ ను వ్యతిరేకించడం కోసమే.. మరిప్పుడు అలాంటి పార్టీతో పువ్వు గుర్తు పార్టీ చాటు మాటు ఒప్పందాలకు తెర లేపిందని అపోహలూ, అనుమానాలు చాలానే ఉన్నాయ్.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి రాజగోపాల్, కొండా విశ్వేశ్వర రెడ్డి, సీనియర్ నేత ఈటల లాంటి వారందరూ కేసీఆర్ పై కోపంతోనే ఇన్నాళ్లూ జాతీయ పార్టీ కొమ్ము కాశారు. కానీ పరిస్థితులు అంతకంతకూ మారుతుండటం, బీజేపి- బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని అనుమానిస్తున్న వారంతా బీజేపిని వీడుతున్నారు. వివేక్, రాజగోపాల్ లాంటి వారు ఇప్పటికే పార్టీని వీడారు. ఎన్నికలయ్యాక కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీ.కె. అరుణ కూడా బీజేపికి గుడ్ బై కొడతారని వార్తలున్నాయి. ఇప్పుడు విజయ శాంతి వంతు వచ్చింది. BJP
బీజేపి బీ టీమ్ బీఆర్ ఎస్ ?
నేతలలో ఉన్న ఈ భావన ప్రజల్లోకి కూడా బలంగా వెళితే అది బీజేపీకే నష్టంగా మారి, కాంగ్రెస్ కు లాభం కలుగుతుంది. మరి ఈ విషయం బీజేపి పెద్దలు ఆలోచించుకున్నారో లేదో తెలీదు.. బండి సంజయ్ లాంటి వ్యక్తులు పైకి మామూలుగా ఉన్నా, లోన కేసీఆర్ పై బీజేపి మెతక వైఖరిపట్ల కుతకుతలాడుతున్నారు. ఇప్పుడు విజయ శాంతి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడమే కాదు , ఇదే పాయింట్ మీద కేసీఆర్ ను,బీజేపీని దెబ్బ తీయాలనే ఉద్దేశంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది.ప్రజలకు ఈ విషయాన్ని బహిరంగ సభల ద్వారా వివరించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గంపగుత్తగా కాంగ్రెస్ కు పడేలా చేయాలన్నది ప్లాన్ అయి ఉండొచ్చు. విజయశాంతిని రాజకీయ నేతకన్నా హీరోయిన్ గ్లామర్, చరిష్మా ఉన్న మహిళగానే జనం గుర్తిస్తారు. కాబట్టి రాములమ్మ పార్టీ మారినా బీజేపికి పెద్ద నష్టం ఉండకపోవచ్చు.. కానీ బీజేపి బీ టీమ్ బీఆర్ ఎస్ అన్న విషయం అంత స్పష్టంగానూ నిరూపించగలిగినప్పుడే కాంగ్రెస్ కు చేరికల వల్ల లాభం కలిగేది. BJP