Sai Pallavi
టాలీవుడ్ లో సౌందర్య తరువాత అంతటి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరంటే సాయి పల్లవి పేరు మారుమోగుతుంది. టాలీవుడ్ లేడి పవర్ స్టార్ సాయి పల్లవి తన నటనతో,డాన్స్ తో, క్యూట్ గా నవ్వుతూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. నేచురల్ యాక్టింగ్ తో నెమలి లాంటి నాట్యంతో ఫ్యాన్స్ మనసును దోచేస్తుంది ఈ గ్లామర్ బ్యూటీ. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకులను అలరించింది ఈ లేడీ సూపర్ స్టార్. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటించి… తన నటనతో ఎందరినో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కేవలం నటన, డాన్స్ తో మాత్రమే మూవీ ఆఫర్స్ ను దక్కించుకుంటుంది. ఎక్స్ పోజ్ చేసే పాత్రలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ.
ఈ మధ్యకాలంలో గార్గీ సినిమాలో నటించి అందరిని మెప్పించింది. ఆ తరువాత ఏడాది గ్యాప్ ఇచ్చింది ఈ అమ్మడు. సాయి పల్లవి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండటం చూసి ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వటంతో ఫ్యాన్స్ చాలా సంతోషపడుతున్నారు. ఏడాది గ్యాప్ తరువాత ఇప్పుడు వరస ఆఫర్ లతో దూసుకుపోతుంది…. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో వరస సినిమాలతో బిజీగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో సరసన హీరోయిన్ గా నటించబోతుందట.
స్టార్ హీరో సరసన హీరోయిన్ గా Sai Pallavi
ఏడాది గ్యాప్ తరువాత ఇప్పుడు వేగాన్ని పుంజుకుంది సాయి పల్లవి. తెలుగులో వరుస సినిమాలలో నటిస్తుంది. ఇప్పడు ఏకంగా స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిందట. తెలుగు లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నా కానీ సాయి పల్లవి స్టార్ హీరోలతో జోడి కట్టలేదు. ఇక ఇప్పుడు మెగా స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఓ సినిమాలో నటించబోతుందట. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా కమిటయ్యాడు. ఈ సినిమాలోనే సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. సాయి పల్లవి-రామ్ చరణ్ కాంబినేషన్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అలాగే అల్లు అర్జున్ సరసన కూడా నటిస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. పుప్ప-2 సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ పుకార్లు మాత్రం వస్తున్నాయి.
బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ
తెలుగుతో సహా తమిళ్ లో కూడా పలు చిత్రాలకు ఓకే చేయగా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది ఈ లేడి డాన్. స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా సీత పాత్రలో నటించబోతుందట ఈ గ్లామర్ బ్యూటీ. రణ్ బీర్ రాముడి పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాకు నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు.
జునైద్ ఖాన్ తో జోడిగా
స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో కలిసి నటించేందుకు మరో సినిమా కూడా లైన్ లో ఉన్నట్లు సమాచారం.. నటనతో పాటు నృత్యానికి ప్రాధాన్యత ఉన్న కథాశం కావడంతో దర్శకుడు సాయిపల్లవి వైపు మొగ్గుచూపారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. Sai Pallavi