Finals
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాకు అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్డేడియం సిద్ధమైంది. 22 ఏళ్ల తరువాత ఇండియా ఫైనల్ చేరడంతో క్రికెట్ అభిమానుల్లో ఆనందానికి హద్దుల్లేవు. ఇండియా ఈ ప్రపంచకప్2లో సాధిస్తున్న జైత్రయాత్రతో పాటు టీమ్ ఇండియా ఆటగాళ్ల అద్భుత ఫామ్ చూస్తుంటే కచ్చితంగా మూడోసారి కప్ గెలుస్తుందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. నవంబర్ 19 ఆదివారం జరగనున్న ఫైనల్ పోరు చూసేందుకు అంతా అహ్మదాబాద్కు పయనమౌతున్నారు. టికెట్ దక్కించుకున్నవాళ్లంతా మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు లేదా స్డేడియం బయట ఏర్పాటు చేస్తున్న వివిధ స్క్రీన్లలో అక్కడ మ్యాచ్ చూసేందుకు చలో అహ్మదాబాద్ అంటున్నారు.
రోహిత్ ఫామ్ కోనసగించాలి… Finals
టీం ఇండియా ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ కోణంలో చూస్తే రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా పటిష్టంగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రపంచకప్లో ఒక్క ఓటమి కూడా లేకుండా సెమీఫైనల్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది టీమిండియా. అయితే ఫైనల్లో భారత్ గెలవాలంటే రోహిత్ శర్మ చెలరేగి ఆడాల్సి ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా రెండోసారి బ్యాటింగ్ చేసినా దూకుడుగా ఆడుతూ మంచి ఓపెనర్ అనిపించుకుంటున్నాడు. రోహిత్ శర్మ రెచ్చిపోతుండటంతో తర్వాత వచ్చే బ్యాటర్లకు పని సులభం అవుతుంది. 20 ఓవర్లకు సాధించే స్కోరును రోహిత్ 10 ఓవర్లలోపే సాధిస్తున్నాడు.
మిడిలార్డర్స్ దూకుడు..
దాంతో తర్వాత వచ్చే బ్యాటర్లు మిడిల్ ఓవర్స్ లో ఎటువంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా మిడిలార్డర్ లో దూకుడు కనబరుస్తున్నాడు. అతడు కూడా అటాకింగ్ ఆటతో పరుగులు సాధిస్తున్నాడు. ఇక కేఎల్ రాహుల్ పరిస్థితులకు తగ్గట్లు ఆడుతున్నాడు. నెదర్లాండ్స్ పై కేవలం 62 బంతుల్లోనే సెంచరీ చేసి వేగవంతమైన సెంచరీ చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. ఆఖరి ఓవర్లో దూకుడు పెంచి పరుగులు రాబడుతున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టాలంటే రోహిత్ శర్మ తొలి 10 ఓవర్లలో రెచ్చిపోవాల్సి ఉంటుంది. అందుకే కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కంటే కూడా ఫైనల్లో రోహిత్ శర్మ అత్యంత కీలకం కానున్నాడు. Finals
ఫైనల్ లో మాక్స్ వెల్
ఆస్ట్రేలియా జట్టు గురించి మాట్లాడితే, ప్రపంచ కప్లో ఆ జట్టు ఆరంభం అంత బాగా లేదు. తమ మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోయారు. అయితే, ఆ తర్వాత ఆ జట్టు పునరాగమనం చేసి వరుసగా 7 మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. అదే సమయంలో భారత జట్టు కూడా వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ బ్యాట్ నుంచి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ను చూడగలిగాం. ఇది చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఐదో విజయాన్ని నమోదు చేసి ఆస్ట్రేలియాకు బిగ్ షాకిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, మాక్స్ వెల్ వారి ముందు నిలబడి డబుల్ సెంచరీతో సత్తా చాటి, తన జట్టును విజయపథంలో నడిపించాడు. మాక్స్ వెల్ తన జట్టుకు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
కప్పు మనదే : రజనీకాంత్ Finals
ఈ సారి భారత్ వరల్డ్ కప్ గెలిచి తీరుతుందని సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసేందుకు రజనీకాంత్ సతీసమేతంగా ముంబై వెళ్లారు. నిన్న ఆయన చెన్నైకి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మ్యాచ్ న్యూజిలాండ్తో.. తొలుత కాసేపు టెన్షన్గా అనిపించింది. కానీ ఆ తరవాత ఒక్కో వికెట్ పడే కొద్దీ పరిస్థితి అనుకూలంగా మారింది. కానీ ఆ గంటన్నర సమయంలో మాత్రం చాలా టెన్షన్గా అనిపించింది. అయితే, ఈ సారీ ప్రపంచకప్ భారత్దే అన్నారు. రజనీ జోస్యం కోట్లాది మంది క్రికెట్ ప్రేమికుల ఆకాంక్షలు నెరవేరి ఈసారి టీమిండియా కప్ గెలుస్తుందని ఆశిద్దాం..