ఐసీసీ ICC వాల్డ్ కప్ ఈసారి ఓ విశిష్ట అతిధికి ఆతిధ్యం ఇస్తోంది. ఆయన మరెవరో కాదు.. మన ప్రధాని నరేంద్ర మోడీ. ఇక మరో ప్రత్యేకత ఏంటంటే ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో ఫైనల్ సమరం జరగడం.. ఈ మ్యాచ్ కు మోడీయే అతిధిగా రావడం.. ఇక్కడి వరకూ ఒక ఎత్తయితే మ్యాచ్ జరుగుతున్నది అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం.. వేదిక పేరు కూడా మన ప్రధాని పేరే.. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ వాల్డ్ కప్ లో భారత్ జయకేతనం ఎగురవేయాలని అందరూ కోరుకుంటారు.. వాల్డ్ కప్ మాటేమో గానీ గుజరాత్ అహ్మదాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది.
హోటళ్లకు అదృష్టం పట్టింది.. ICC
ఐసీసీ వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఫైనల్స్కు చేరుకోగా, అహ్మదాబాద్ లోని హోటళ్లకు అదృష్టం తలుపులు తెరుచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆదివారం ఫైనల్ మ్యాచ్ కారణంగా నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు తమ ధరలను రెట్టింపు చేసినట్లు సమాచారం. సాధారణ రోజుల్లో హోటల్ గదికి ఒక రాత్రి అద్దె రూ.5 వేలు ఉండగా ఇప్పుడు రూ.50 వేలకు పెరిగింది. అంతే కాదు కొన్ని హోటళ్ల ధర రూ.లక్ష వరకు పెరిగినట్లు సమాచారం. ప్రస్తుత నివేదికల ప్రకారం, చాలా హోటళ్లు పూర్తిగా బుక్ చేయబడ్డాయి. కొన్ని లగ్జరీ హోటళ్ళు నవంబర్ 18 నుండి బుకింగ్లను తీసుకోవడం ఆపివేసాయి. నిజానికి ప్రపంచకప్ షెడ్యూల్ వెలువడిన వెంటనే ధరల పెంపుపై అహ్మదాబాద్లోని హోటళ్లలో ఆందోళన మొదలైంది. దానికి ప్రధాన కారణం నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్రమోఢీ గ్రౌండ్ వరల్డ్ కప్ ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వడమే. ప్రస్తుతం టీమ్ ఇండియా ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ హోటల్స్ కు మరింత డిమాండ్ పెరిగింది.
భారీగా పెరిగిన విమాన ఛార్జీలు..
ప్రస్తుతం హోటల్, విమాన ఛార్జీలు రెండూ సాధారణ రోజు కంటే 15 నుంచి 20 వేల రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణ రోజుల్లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి వన్ వే విమాన ఛార్జీ దాదాపు 4 నుంచి 5 వేలు. ఇప్పుడు రూ.25 నుంచి 30 వేలకు పెరిగింది. అలాగే నవంబర్ 19న అహ్మదాబాద్ చేరుకునే చాలా విమానాలు దాదాపు పూర్తిగా బుక్ అయ్యాయి. ప్రస్తుతం పరిమిత టిక్కెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వన్ వే విమాన ఛార్జీ దాదాపు రూ.3500 ఉండేది. కానీ నవంబర్ 18న విమాన టిక్కెట్ ధర రూ.23000కి పెరిగింది. ముంబై నుంచి అహ్మదాబాద్కు విమాన ఛార్జీ రూ.3500 నుంచి రూ.28000కి పెరిగింది. కోల్కతా నుంచి అహ్మదాబాద్కు వన్ వే ఛార్జీ రూ.7000 నుంచి రూ.36000కి పెరిగింది. అలాగే చెన్నై నుండి అహ్మదాబాద్ కు 5000 నుండి 24000 రూ. పెరిగినట్లు సమాచారం. ICC
ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ షో
ఇక ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముగింపు వేడుకలు సైతం నిర్వహించనున్నట్లు తెలిసింది. అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందు ముగింపు వేడుకలలో భాగంగా ప్రముఖ సింగర్ దువా లిఫా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. మరి అదే విధంగా ఎయిర్ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షో నిర్వహించనుంది. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ పది నిమిషాల పాటు ఎయిర్ షో నిర్వహించనున్నట్లు గుజరాత్ డిఫెన్స్ పీఆర్వో వెల్లడించారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్లో మొత్తం తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు ఉంటాయి.
మోడీ రాకకోసం సర్వం సిద్ధం
అహ్మదాబాద్ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరుకానున్నారు. చివరిసారిగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ నాలుగోవ టెస్ట్ మ్యాచ్కు మోఢీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటను ప్రధాని వీక్షించారు.. మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్పై విజయం సాధించి భారత్, రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఆస్ట్రేలియా వన్డే వరల్డ్కప్ ఫైనల్కు చేరుకున్నాయి. ఈ రెండు జట్లు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో అహ్మదాబాద్ నరేంద్ర మోఢీ స్టేడియం వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. 1 లక్షా 32 వేల మంది ప్రేక్షకుల మధ్య భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. క్రికెట్ అభిమానులందరూ ఆదివారం మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే టీమిండియా టెన్షన్ తో నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ఎందుకంటే ప్రతీ ఆటగాడి కెరీర్ లో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన సమయం కాబట్టి..