40
టన్నెల్ లోపల కార్మికులు.. టన్నెల్ బయట కుటుంబ సభ్యులు.. వారం రోజులుగా ఉత్తరాఖండ్ లో ఇదీ పరిస్థితి..ఉత్తరాఖండ్ టన్నెల్ లో వారం రోజుల క్రితం చిక్కుకుపోయిన కూలీల వెలికి తీత కష్టంగా మారుతోంది. వారం రోజులకు పైగానే సాగుతున్న వెలికి తీత ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. తమను త్వరగా బయటకు తీయకపోతే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని, ప్రాణాలతో ఉండే పరిస్థితి ఉండదని కూలీలు భయపడుతున్నారు. దాదాపు 40 మంది కూలీలు ఆదివారం ఉదయం నుంచి ఆ టన్నెల్ లో చిక్కుకుపోయారు. అయితే కూలీలంతా సురక్షితంగా ఉన్నారని, వారందరికీ ఆహారం, మంచి నీరు స్టీల్ పైపుల ద్వారా సప్లయ్ చేస్తున్నామని రెస్క్యూ అధికారులు చెప్పారు.
వాస్తవానికి శుక్రవారం కూలీలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. టన్నెల్ లో ఓ పాసేజ్ ను క్రియేట్ చేయడానికి చేస్తున్న డ్రిల్లింగ్ లో పెద్ద శబ్దం రావడంతో పనులు నిలిపివేశారు. టన్నెల్ గనక కుప్పకూలితే వారు ఇక బయటకు వచ్చే ఆస్కారముండదు. ఆ భయంతోనే అధికారులు తమ పనులకు విరామం ఇచ్చారు. కూలీల కుటుంబ సభ్యులు వారం రోజులుగా టన్నెల్ ముందే తమ వారికోసం పడిగాపులు పడుతున్నారు. కూలీలు అత్యంత బలహీనంగా ఉన్నారని వారి మాటలను బట్టి తెలుస్తోందని, సాధ్యమైనంత త్వరగా వారిని కాపాడాల్సిన అవసరముందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎక్కువ సమయం ఇలా టన్నెల్ లో కూలీలు ఉండిపోతే వారి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తినే ప్రమాదముందంటున్నారు డాక్టర్లు.
ప్రమాదం ఎలా జరిగిందంటే… 40
ఈనెల 12న ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు యమునోత్రి నేషనల్ హై వే దగ్గర నిర్మాణంలో ఉన్న ఈ టన్నెల్ కుప్పకూలింది. సిల్క్యారా, దండలగావ్ లను కలిపేందుకు డిజైన్ చేసిన ఈ టన్నెల్ నిర్మాణంలో ఉండగానే కుప్ప కూలడంతో కూలీలు లోపల చిక్కుకు పోయారు. తాము లోపల చిక్కుకుపోయిన విషయాన్ని కూలీలు వాకీ టాకీల ద్వారా బయట ఉన్న అధికారులకు తెలియ చేశారు. వారికి ఒక పైప్ లైన్ ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా చేస్తూ వచ్చారు. బీహార్, జార్ఖండ్, యూపీ, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాతాలకు చెందిన కూలీలు ఈ టన్నెల్ లోపల చిక్కుకుపోయారు.శిథిలాలు, మట్టి, దుమ్ము, థూళి మధ్య వారు చిక్కుకు పోయారు. శిథిలాలను, మట్టి దిబ్బలను తొలగించడం అధికారులకు కష్టంగా మారింది. టన్నెల్ దగ్గర వాతావరణం అనుకూలించకపోవడం, ఆ శిథిలాలను తొలగించడానికి భారీ యంత్ర పరికరాలు అవసరం కావడంతో కొంత ఆలస్యమైంది. 40
టన్నెల్ లో పగుళ్ల శబ్దాలు… పని నిలిపివేత
శుక్రవారం టన్నెల్ లోపల బీటలు వేసిన శబ్దాలు రావడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సహాయ చర్యలను నిలిపివేశారు. భారత వైమానిక దళం ఇండోర్ నుంచి సీ-130 హెర్య్యులస్ మిలటరీ ప్లేన్ ను యంత్రపరికరాల తరలింపుకు రంగంలోకి దింపింది. టన్నెల్ లోకి మార్గం రూపొందిస్తున్న తరుణంలోనే ఓ కీలక పరికరం పని చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఇప్పుడు విమానం ద్వారా మరో యంత్రపరికరం రప్పించడం వల్ల పనులు వేగం పుంజుకునే అవకాశముంది. టన్నెల్ లోకి మార్గం ఏర్పడితే కూలీలందరినీ ఒకరి తర్వాత ఒకరిని బయటకు లాగే అవకాశముంటుంది. పరిస్థితి అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో కూలీల కుటుంబ సభ్యుల ఆందోళన ఎక్కువవుతోంది. చిక్కుకున్న 40 మంది కూలీల్లో ఓడిషాకు చెందిన వారు ఐదుగురు ఉన్నారు. 40