BRAIN Transplant
అవయవ దానం వంటివి చేసే అప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక హెలికాప్టర్లు మరియు రోడ్డు మార్గంల్లో అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేసి అంబులెన్సులో మనిషి అవయవాలు తరలిస్తుంటారు. ఎందుకంటే మనిషి శరీరం నుంచి వేరు చేసిన తర్వాత అవయవాలు కొంత సమయం మాత్రమే సజీవంగా ఉంటాయి. ఆలోగా వాటిని ఇతరుల శరీరంలో అమర్చి అవయవ మార్పిడి సర్జరీ చేయాలి. సమయం మించే కొద్దీ పనికి రాకుండా పోతాయి. అయితే UTసౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్లోని శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. మెదడును శరీరం నుంచి వేరు చేసినా, ఎక్కువ సేపు సజీవంగా ఉంచే దిశగా చేసిన పరిశోధనల్లో కీలక ముందడుగు వేశారు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలో కీలక మార్పులకు నాంది పలుకుతున్నారు.
పందిపై తొలి అధ్యయనం BRAIN
శాస్త్రవేత్తలు పంది మెదడును శరీరం నుంచి వేరుచేసి, ఎక్కువ సమయం దాన్ని సజీవంగా ఉంచగలిగారు. ఇందుకు ఒక డివైజ్ను అభివృద్ధి చేశారు. మెదడుకు రక్త ప్రవాహాన్ని వేరు చేయడం, కంప్యూటరైజ్డ్ అల్గారిథం ద్వారా అవసరమైన ఫిజియోలాజికల్ పారామీటర్స్ ని మెయింటెన్ చేయడంతో ఇది సాధ్యమైంది. ఈ ప్రయోగం విజయం మానవ మెదడును అధ్యయనం చేయడానికి కొత్త మార్గాలను తెరవడమే కాకుండా భవిష్యత్తులో బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీల్లో మార్పులు తీసుకొస్తుంది.
మెదడు పరిశోధనపై ప్రభావం… BRAIN
ఈ పద్ధతి మెదడు పరిశోధనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఇతర శారీరక విధుల జోక్యం లేకుండా కేవలం మెదడుపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ ఐసోలేషన్ టెక్నిక్ గతంలో అసాధ్యమైన మార్గాల్లో ఫిజియోలాజికల్ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఈ రకమైన పరికరాల్లో ఎక్స్ ట్రా కార్పోరియల్ పల్సటైల్ సర్క్యులేటరీ కంట్రోల్ EPCCమొదటిది. దీన్ని పంది మెదడును వేరు చేయడానికి ఉపయోగించారు. కంప్యూటరైజ్డ్ అల్గారిథం ద్వారా రక్తపోటు, వాల్యూమ్, ఉష్ణోగ్రత, పోషకాలు కంట్రోల్ చేశారు. మెదడు శరీరంలోని మిగిలిన భాగాల నుంచి ఎలాంటి ఇన్పుట్ను స్వీకరించనప్పటికీ, ఈ పద్ధతి ద్వారా దాదాపు ఐదు గంటలపాటు మెదడు సజీవంగా ఉంది. మెదడు కార్యకలాపాల్లో చిన్న చిన్న మార్పులను కూడా అబ్జర్వ్ చేసే అవకాశాన్ని శాస్త్రవేత్తలకు కల్పించింది.
మెదడు పనితీరుపై స్వతంత్ర అధ్యయనం…
ఈ టెక్నాలజీ ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే… శరీర నేచురల్ డిఫెన్స్ మెకానిజం లేకుండా మెదడుపై నిర్దిష్ట కారకాల ప్రభావాన్ని అధ్యయనం చేయడం. ఉదాహరణకు, పరిశోధకులు ఎక్స్ టర్నల్ ఫ్యాక్టర్స్ పరిగణనలోకి తీసుకోకుండా మెదడుపై హైపోగ్లైసీమియా ప్రభావాలను విజయవంతంగా పరిశోధించారు. మెదడును వేరు చేయడం ద్వారా, ల్యాబ్ యానిమల్స్ విషయంలో ఆహార నియంత్రణ లేదా ఇన్సులిన్ డోసేజ్ వంటి ట్రెడిషినల్ రీసెర్చ్ మెథడ్స్ అవసరం లేదు. దీంతో కాంపెన్సేటరీ మెకానిజం ద్వారా స్వతంత్రంగా పోషకాలు తీసుకోవడం గురించి అధ్యయనం చేసే వీలు శాస్త్రవేత్తలకు కలిగింది.
న్యూరోసైన్స్ లో పురోగతి…
ఈ పరిశోధన ఫలితాలను మెయింటెనెన్స్ ఆఫ్ పిగ్ బ్రెయిన్ ఫంక్షన్ అండర్ ఎక్స్ ట్రాకార్పోరియల్ పల్సటైల్ సర్క్యులేటరీ కంట్రోల్ పేరుతో వెల్లడించారు.ఈ ఫలితాలు న్యూరోసైన్స్ లో కూడా కీలక మార్పులు సాధ్యమని చూపుతున్నాయి. ప్రయోగాల సమయంలో సెరిబ్రల్ ఫిజియోలాజికల్ పారామీటర్స్ నియర్-నేటివ్ లెవెల్స్ ను పరిశీలించారు. మెదడు పనితీరుపై లోతైన అవగాహన పొందేందుకు ఇవి ఉపయోగపడతాయి.
భవిష్యత్తు అవకాశాలు….
EPCC సిస్టమ్ విజయం, మెదడు మార్పిడిలో తీసుకురానున్న మార్పులపై చర్చలకు దారి తీసింది.ఇప్పటికే మానవులపై పరిశోధనలు జరగనప్పటికీ, మెదడును స్వతంత్రంగా సజీవంగా ఉంచే సామర్థ్యం వైద్య శాస్త్రంలో కొత్త సరిహద్దులను అన్వేషించడానికి పునాది వేస్తుంది.టెక్నాలజీ భవిష్యత్తు, న్యూరోసైన్స్ రంగాన్ని రూపొందించడంలో దాని పాత్ర గురించి పరిశోధకులు ఆశాజనకంగా ఉన్నారు.