GowDurbar
హిందూ ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు సనాతన ధర్మానికి పెద్ద పీట వేస్తాయి. అనూచానంగా వస్తున్న మన ఆచార , వ్యవహారాల్లో ప్రధానమైనది పూజా కార్యక్రమం.. ఉదయం దేవుడిని భక్తితో, ప్రశాంతమైన చిత్తంతో సేవించాలంటే అందుకు మనం అనుసరించే విధానాలతో పాటు, మనం వినియోగించే ఉత్పత్తులూ ఎంతో ముఖ్యం.. హిందువులకు ఆవు పరమ పవిత్రమైన దైవం.. ముక్కోటి సకల దేవతలూ కొలువై ఉన్న గో మాతను పూజిస్తే అందరు దేవుళ్లను ఆరాధించినట్లే.. అలాగే గోమాత విడిచే వ్యర్ధాలు, ప్రకృతిలో లభించే వనమూలికలు వినియోగించి చేసిన పూజా ఉత్పత్తులు మనకెంతో పవిత్రమైనవి.. గోమాత నుంచి తయారు చేసే పంచగవ్యాలు పూజకు ఉపయుక్తమైనవి. అంతేకాదు ప్రకృతిలో లభించే అనేక వనమూలికలతో తయారు చేసే పూజా ఉత్పత్తులను వాడటం వల్ల భగవంతునితో మనం అనుసంధానమై పూజించే అవకాశం ఏర్పడుతుంది. ఆత్మను పునరుజ్జీవింప చేసే సుగంధ భరిత పరిమళ ద్రవ్యాలు మనకు ఏకాగ్రతనిస్తాయి. మరింత స్థిర చిత్తంతో అర్చన చేయాలన్నభావనను కలిగిస్తాయి.
పంచగవ్యాల సమ్మిళితం గౌ దర్బార్ ఉత్పత్తులు GowDurbar
సంప్రదాయ తయారీ విధానాలతో గౌదర్బార్ ఎప్పటినుంచో విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తోంది. గౌ దర్బార్ పర్యావరణ హితమైన ఉత్పత్తులను తయారు చేస్తుంది. వెదురు కడ్డీలు లేని,బొగ్గు వాడకుండా పూల వ్యర్ధాలు, పంచగవ్యాలతో చేసిన ధూప్ స్టిక్స్, దేశీయ ఆవు నెయ్యి, సకల సంపదలను సిద్ధించే ఐశ్వర్య దీపం నూనె , గౌ దర్బార్ విశిష్టతలు.
దేవతలకు ప్రతిరూపం దీపం GowDurbar
హిందువుల పూజా కార్యక్రమాలు దీపారాధన తోనే మొదలవుతాయి.. పంచభూతాల్లో ప్రధానమైనది అగ్ని. అగ్ని సకల జీవ రాశి మనుగడకు కాంతినిస్తుంది. దీపాన్ని సరిగ్గా గమనిస్తే నీలం, పసుపు, ఎరుపు రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు సత్వ, రజో, తమ: గుణాలకు ప్రతీకలు. ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కార్తీక మాసం లో ఆవునేతి దీపానికి అంతటి ప్రత్యేకత ఉంది. గౌదర్బార్ ఉత్పత్తులలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒకటి..
సంపదలనిచ్చే ఐశ్వర్యదీపం
దీపం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు, పవిత్రతకు ఒక చిహ్నం… చీకటిని తరిమికొట్టే శక్తి ఒక్క దీపానికి మాత్రమే ఉంది. దీపాలను వెలిగించడం వల్ల వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. ఇంట్లో స్వచ్ఛమైన దేశీయ నెయ్యి లేదా వనమూలికల నూనెతో దీపం వెలిగిస్తే అది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు నాలుగు గంటల పాటూ వాతావరణంలో ఉంటాయి.దీపం లక్ష్మీ దేవి రూపం అంటారు. సంపదకు ప్రతిరూపం అనమాట.
ఆర్ధిక ఇబ్బందులు తొలగించే ఐశ్వర్య దీపం
ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారు తప్పనిసరిగా ఐశ్వర్య దీపం పెడితే ఆ ఇబ్బందులనుంచి బయటపడతారని పెద్దలు చెబుతారు. ఇంటిలో ఈశాన్యం వైపు లేదా దేవుని మందిరంలో ఈ ఐశ్వర్య దీపం పెడతారు. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాలు కలసి రాని వారు, ఆదాయానికి , రాబడికి మధ్య సమన్వయం కొరవడిన వారు, సంపాదన అంతా మంచి నీళ్లలా ఖర్చయిపోతున్న వారు ఈ ఐశ్వర్య దీపం పెట్టడం మంచిది. దీనికి గౌ దర్బార్ సహజ సిద్ధమైన ప్రకృతి ఉత్పత్తులతో సువాసన భరితమైన ఐశ్వర్య దీపం నూనె అందిస్తోంది. కార్తీక మాసంలో దీపానికి ఎంతో విశిష్టత ఉంది. గౌర్బార్ కార్తీక మాసం కోసమే సహజ సిద్ధమైన ఐశ్వర్య దీపం నూనెను అందిస్తోంది.
పంచగవ్యాలతో పూజా ఉత్పత్తులు
హిందువులకు పవిత్రమైన గోమాత నుంచి సేకరించే వాటినే పంచగవ్యాలంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గో మూత్రము, గోమయం.. ఈ అయిదింటిని పవిత్ర హోమాల్లో,పూజల్లో వినియోగిస్తారు. గౌదర్బార్ పూజా ఉత్పత్తులన్నీ పంచగవ్యాలతో రూపొందిచబడ్డాయి.
సాంబ్రాణి కడ్డీలు లేదా ధూప్ స్టిక్స్
వెదురు, బొగ్గు లాంటి కాలుష్య కారకాలను వినియోగించకుండా పూర్తి ప్రకృతి పరమైన, పర్యావరణ హితంగా తయారు చేసిన గౌ దర్బార్ ధూప్ స్టిక్స్ పరిమళ భరితంగా, కాలుష్య రహితంగా, భగవత్ సేవకు ప్రేరకాలుగా ఉన్నాయి. సువాసన భరితమైన, స్వచ్ఛమైన ధూప్ స్టిక్స్, అగరొత్తుల తయారీ, నాణ్యతలో ఎక్కడా రాజీ లేదు.
గౌ దర్బార్ ఆవు నెయ్యి GowDurbar
కార్తీక మాసంలో ఆవునేతి దీపానికి ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది. ఈ మాసంలో ఆవునేతితో దీపం పెడితే దేవతలు సంతోషిస్తారు. సహజ సిద్ధంగా గోశాలలనుంచి సేకరించిన పాలు,పెరుగుతో తయారు చేసిన ఆవునెయ్యి పూజకు ఉపయుక్తమైనది.