Vitamin-D
విటమిన్ డి ని ‘సన్షైన్’ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తుంది. మనలోని రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రస్తుత కాలంలో విటమిన్ డి మనకి ఎంతో అవసరం. అందుకే చాలా మంది డి విటమిన్ ట్యాబ్లెట్స్ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే, డి విటమిన్ అధికంగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి శరీరంలో విటమిన్ డి స్థాయిలను పెంచడానికి ఉదయం సమయంలో ఎండలో ఉండటం మంచిది. ఇది కాకుండా అధిక పోషకాహారాలు తినడం, సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో విటమిన్ డి అవసరమైన మొత్తాన్ని పొందవచ్చు. అయితే విటమిన్ డి మన శరీరంలో కరెక్ట్ గా ఉన్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం తెలిసిందే.
ప్రస్తుత రోజుల్లో సిటీలలో ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే కావడంతో ఎక్కడ చూసినా కూడా నీడ ప్రాంతమే కనిపిస్తూ ఉంటుంది. అయితే విటమిన్ డి కేవలం సూర్య రశ్మి నుంచి మాత్రమే కాకుండా మనం తినే ఆహార పదార్థాల నుంచి కూడా లభిస్తూ ఉంటుంది. తగిన మోతాదులో శరీరంలో విటమిన్ డి ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలా అని విటమిన్ డి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.
Vitamin-D లోపం సంకేతాలు…
ఆకలి లేకపోవడం సమయానికి భోజనం సరిగా చేయకపోవడం. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి ఎక్కువ అయితే కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మన శరీరానికి విస్తృత ప్రయోజనాలను అందిస్తుంది. అదే విటమిన్ డి లోపంతో బాధపడుతుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలసట, వాంతులు, బలహీనత, ఎముకల నొప్పి, కండరాల బలహీనత, కండరాల నొప్పులు, తిమ్మిర్లు, విపరీతమైన మానసిక కల్లోలం, వాంతులు విరేచనాలు వికారం లాంటి సమస్యలు వస్తాయి. విటమిన్ డి మోతాదు శరీరంలో ఎక్కువైతే రక్తంలో కాల్షియం పేరుకుపోతుంది. దాని ఫలితంగా హైపర్ కాలిపోయిన అనే సమస్య వస్తుంది.
సప్లిమెంట్లు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్…
Vitamin-D ఇతర విటమిన్లకు భిన్నంగా ఉంటుంది. ఇది ఒక రకమైన హార్మోన్ అని చెబుతారు వైద్యులు. సూర్యరశ్మికి మన శరీరాన్ని తాకినప్పుడు చర్మం నుంచి విడుదలయ్యే స్టెరాయిడ్ హార్మోన్. తగినంత సూర్యరశ్మి లేనప్పుడు, శీతాకాలపు వాతావరణంలో శరీరానికి తగినంత విటమిన్ డిని పొందడం కష్టమవుతుంది. విటమిన్ డి టాక్సిసిటీ, హైపర్విటమినోసిస్ డి అనే అరుదైన పరిస్థితి ఎదరవుతుంది. ఇది శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరిగితే వస్తుంది. సాధారణంగా విటమిన్ డి సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది వస్తుంది. అయితే, సూర్యరశ్మి వల్ల, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎప్పుడూ రాదు. కేవలం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్లే వస్తుంది.
హైపర్కాల్సెమియా…
శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉండటం ఈ లక్షణం కనిపిస్తుంది. అంటే రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి హానీ చేస్తుంది. సాధారణంగా, శరీరంలో కాల్షియం స్థాయి 8.5 నుంచి 10.8 mg/dL మధ్య ఉంటుంది. ఇది సాధారణ స్థాయిని మించిపోయినప్పుడు వికారం, వాంతులు, బలహీనత, తరచుగా మూత్రవిసర్జన, జీర్ణశయ సమస్యలు వస్తాయి. శరీరంలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల రక్తంలో కాల్షియం స్థాయి పెరుగుతంది. కాల్షియం, హార్మోన్లు కలిసి ఎముకలకు పోషకాన్ని అందకుండా అవుతుంది. ఇది కీళ్ల
నొప్పులకు దారి తీస్తుంది. ఎముక పగుళ్లు, గాయాలు పెరిగే అవకాశం ఉంది.
కిడ్నీ, ఊపిరితిత్తులకు ప్రమాదం… Vitamin-D
Vitamin-D టాక్సిసిటీ వల్ల వచ్చే హైపర్కాల్సెమియా కూడా కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. రక్తంలో కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. దీని పాలీయూరియా అంటారు. విటమిన్ డి అధిక మోతాదుతో తీసుకుంటే చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. రక్త ప్రవాహంలో కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల కణజాలం, అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఇది క్రమంలో కిడ్నీ ఫెయిల్యూర్కి దారి తీస్తుంది. మీ శరీరంలో విటమిన్ డి సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో కాల్షియం, ఫాస్ఫేట్ స్ఫటికాలు ఏర్పడతాయి. ఈ స్ఫటికాలు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి వాటిని దెబ్బతీస్తాయి. ఇవి క్రమంగా ఛాతీ నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగజేస్తాయి. అధిక మోతాదులో విటమిన్ డీ తీసుకోవడం అనేది ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. అంతేకాదు, మానసిక సమస్యలను పెంచుతుంది. ఇది డిప్రెషన్, సైకోసిస్, ఆందోళన వంటి లక్షణాలకు దారితీస్తుంది.