T20
ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో T20 సమరానికి సిద్ధమైంది. T20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ యువ ఆటగాళ్లతో కూడిన జట్టు.. నేడు ఆస్ట్రేలియాతో తొలి T20 మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్లో సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఇది సువర్ణావకాశం. వైజాగ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఆస్ట్రేలియాపై తొలి టీ 20 మ్యాచ్లో విజయం సాధించి వన్డే ప్రపంచకప్ పైనల్లో ఎదురైన పరాజయానికి కాస్తైన మరుగున పడేయాలని సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు కోరుకుంటోంది. తనకు ఇష్టమైన ఫార్మాట్లో విధ్వంసం సృష్టించేందుకు సూర్య సిద్ధంగా ఉన్నాడు. జట్టు కెప్టెన్గా, ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్కు ఈ సిరీస్ కీలకంగా మారనుంది.
బారి మార్పులతో ఇరు జట్లు……. T20
ఇండియా, ఆస్ట్రేలియా జట్లలో భారీ మార్పులు జరిగాయి. గత నెలన్నరగా ప్రపంచ కప్లో ఆడిన చాలా మంది సీనియర్ ఆటగాళ్లు టీ20లో పాల్గొనడం లేదు. పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ గైర్హాజరు కావడంతో అనుభవజ్ఞుడైన మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్సీ చేపట్టారు. సూర్యకుమార్ యాదవ్కు భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతను అప్పగించారు. ఈరోజు జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కు ముందు సూర్య కుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఫైనల్లో ఘోరం పరాజయం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టడం అంత సులభం కాదని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. కానీ మన ముందుకు వెళ్లాల్సిందేనని వ్యాకరించారు.
సీనియర్లకి రెస్ట్…… T20
అంతా జూనియర్లతోనే…. సీనియర్లు లేకుండానే తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇటీవల వరసగా వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడిన సీనియర్లకు విశ్రాంతి నిచ్చి యువకులకు అవకాశమిచ్చారు. యువకులకు ఇది సరైన అవకాశం. తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి లభించే అరుదైన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న వారే టీం ఇండియాలో చోటు సంపాదించుకుంటారు. వత్తిడి ఏమీ లేకున్నా సొంత మైదానం కావడంతో ఆచి తూచి ఆడాల్సి ఉంటుంది. అప్పుడే బ్యాటర్లు కానీ, బౌలర్లు కానీ తమ ఆటను ప్రదర్శించే వీలుంటుంది.
ఇరు జట్ల నెట్ ప్రాక్టీస్ – విశాఖలో భారీ ఏర్పాట్లు
నేడు విశాఖలో జరగనున్న భారత్- ఆస్ట్రేలియా టీ-20 తొలి మ్యాచ్ కి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలను పూర్తి చేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మధురవాడ స్టేడియం బయట భారీ ఎత్తున బారికేడింగ్ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విశాఖ చేరుకున్న భారత్ ఆస్ట్రేలియా క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్ ఆరంభించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాలుగు రోజుల క్రితమే విశాఖ చేరుకుని రోజూ సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నెట్ ప్రాక్టీస్ చేశారు. ఈ నెట్ ప్రాక్టీస్ గురువారం కూడా కొనసాగనుంది.
వర్షం పడే ఛాన్స్ తక్కువ…….
విశాఖ లో నేడు వాతావరణం మబ్బుతో కూడి ఉన్నప్పటికి అప్పుడప్పుడు చిరుజల్లులు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ ఫోర్ క్యాస్ట్ చేస్తోంది. గత రెండు రోజులుగా నెట్ ప్రాక్టీస్ కు చిరుజల్లులు పడ్డా పెద్ద ఇబ్బంది కలగలేదు. మ్యాచ్ సమయంలో మాత్రం వర్షం రాకూడదని క్రికెట్ అభిమానులు వరుణదేవుడిని ప్రార్థిస్తున్నారు.
టీంమ్ ఇండియా జట్టు……
సూర్య కుమార్ యాదవ్, (కెప్టెన్) రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్
టీంమ్ ఆస్ట్రేలియా జట్టు……
మాధ్యూవేడ్, (కెప్టెన్) ఆరోన్ హార్దీ, జాసన్ బెహ్రెనార్డ్, సీన్ అబాట్, టీమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్ సన్, ఆడం జంపా