Peanuts
వేరుశెనగలు… అంటే పల్లీలు…వీటి గురించి తెలియని వారుండరు. నేల లోపల కాస్తాయి కాబట్టి వీటిని గ్రౌండ్నట్స్ అనీ అంటారు. ఎలా పిలిచినా సరే.. వేరుశనగలు బలమైన ఆహారం. వీటిల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అవన్నీ మన శరీరానికి అవసరమే. పల్లీలతో చాలా మంది అనేక రకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతిరోజు గుప్పెడు పల్లీలను తింటే… దాంతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైధ్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు గుప్పెడు పల్లీలతో అద్భతమైన లాభాలు… Peanuts
ప్రతిరోజు పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వీటిలో ఫాలీ ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. కార్సినోజెనిక్ పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపుతాయి. వీటిని తరచూ తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వీటిలో మోనో అన్ శాచురేటుడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. మరియు మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. ఈ క్రమంలో అధిక బరువు కూడా తగ్గుతారు. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
పల్లీలతో మానసిక ఒత్తిడి దూరం…
ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల విటమిన్ బి3 లభిస్తుంది. దీంతో మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకు నిత్యం ఒక గుప్పెడు పల్లీలను తినిపిస్తే ఎంతో మంచిది. ఎదైనా ఈజీగా గ్రహింపు చేసుకునేలా చురుకుగా తయారవుతారు. వేరుశెనగల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది సెరటోనిన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలు తగ్గుతాయి. రోజూ వేరుశెనగలను తింటే గాల్ స్టోన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. వయస్సు మీద పడడం కారణంగా సహజంగానే కొందరికి అల్జీమర్స్ వస్తుంటుంది. అయితే పల్లీలను తింటే ఆ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో కూడా మతిమరుపు ఎక్కువగా రాకుండా ఉంటుంది. గర్భిణీలు రోజూ పల్లీలు తింటే ఫోలిక్ యాసిడ్ వారికి ఎక్కువగా లభిస్తుంది. దీంతో బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పోషకాహార లోపం లేకుండా బిడ్డ జన్మించేందుకు అవకాశం ఉంటుంది. రోజూ గుప్పెడు పల్లీలను తింటే శరీరంలో శక్తి బాగా పెరుగుతుంది. ఎక్కువ సేపు పనిచేసినా అలసిపోకుండా ఉంటారు. దీంతోపాటు రోజంతా యాక్టివ్గా ఉంటారు. Peanuts
ఎదైనా మితంగా తీసుకోవాలి… ఎక్కువైతే అనారోగ్యం తప్పదు…
వీటిని మరీ ఎక్కువగా వాడితే శరీరంలో ఆమ్లగుణం పెరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్లు తక్కువగా తినాలి. వీళ్లు కాస్త ఉప్పునీళ్లలో ఉడికించి తింటే అంతగా సమస్య ఉండదు. అలాగే గ్యాస్త్ట్రెటిస్, కామెర్లు ఉన్నవాళ్లు కూడా వీటిని ఎక్కువ వాడకూడదు. అజీర్తికీ హైపర్ఎసిడిటీకీ కారణమవుతాయి. పెరిగేదశలో లేదా నిల్వచేసే సమయంలో గింజలకి యాస్పర్జిలస్ ఫ్లేవస్ అనే ఫంగస్ సోకే అవకాశం ఉంది. ఇది ఎఫ్లోటాక్సిన్ అనే విషరసాయనాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇది రకరకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. అందుకే వీటిని కొనేటప్పుడూ నిల్వచేసేటప్పుడూ చాలా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం ఫంగస్ సోకినట్లున్నా వాడకూడదు.
Peanuts