Parijat-(Night Jasmine)
పారిజాత పుష్పాలు… వీటిని దేవతా పుష్పాలు అని కూడా అంటారు. పారిజాతం చెట్టుకు దేవతా వృక్షం అని పేరు. పారిజాతాలతో పాటు మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం వీటిని కూడా దేవతా వృక్షాలనే అంటారు. వీటికి ఎటువంటి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితో పాటు క్షీరసాగరం నుంచి పుట్టిన ఈ పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది.
పారిజాతం యొక్క ప్రాచీన కథ…
పారిజాతం చెట్టుని నారదుడు శ్రీకృష్ణుడికి ఇచ్చి..ఆ పుష్పం విలువ, గొప్పదనం గురించి చెప్పి నీకు ఇష్టమైన భార్యకు ఇవ్వమని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు రుక్మిణి వద్దే ఉండటంతో రుక్మిణీదేవికే ఆ చెట్టుని ఇవ్వటం జరుగుతుంది. ఆ తరువాత కృష్ణుడికి అతి ప్రీతికరమైన భార్య సత్యభామ తనకు ఇవ్వలేదని అలుగుతుంది. అప్పుడు సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ కథలు చెబుతున్నాయి.
అరుదుగా దోరికే అద్భతమైన పుష్పలు… Parijat-(Night Jasmine)
పారిజాత పువ్వుల్ని చూస్తుంటే అలా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే వాటి అందం అలాంటిది. తెల్లని పువ్వు మధ్యలో నారింజ రంగును అలంకరించినట్లుగా ఉండే పారిజాతాలను ఎటువంటి దోషం అంటని పుష్పాలు అని అంటుంటారు. పారిజాత పూలకు ఒక ప్రత్యేకత ఉంది. పారిజాతాలు అటువంటి దోషం అంటని పుష్పాలు మరియు దేవతా పుష్పాలు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పుష్పాలు. అందుకే పారిజాతాలు కింద పడినా ఈ పుష్పాలని పూజకు ఉపయోగించే అరుదైన, అద్భుతమైన పుష్పాలు.
కింద పడినా దోషం అంటని పుష్పాలు…
రాత్రి సమయంలో పూసి సువాసనల్ని వెదజల్లే ఈ పుష్పాలతో దేవతార్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఎన్నో విశిష్టతలు మరియు గొప్పతనం కలిగిన పారిజాత పుఫ్సాలు రాత్రి సమయంలో మాత్రమే పూస్తాయి. ఉదయానికల్లా రాలిపోతాయి దీనికి కారణం దేవేంద్రుడి శాపం. రాత్రి పూసి ఉదయానికే రాలిపోయినా పూజకు ఉపయోగించవచ్చు. వీటికి ఎటువంటి దోషం ఉండదు. చెట్టు కింద రాలినా వాటి అందం.. వాటి సువాసన మాత్రం ఏమాత్రం తగ్గదు. చెట్టు కింద తివాచీ పరిచినట్లుగా పారిజాతాల అందం చూస్తే మనస్సు ఆహ్లదంగా నిండిపోతుంది. కిందపడిన పూలనే జాగ్రత్తగా ఏరి దేవుని సేవలో వినియోగిస్తారు. దేవతా పుష్పాలు కావడంతో కిందపడినా వీటికి ఎటువంటి దోషమూ ఉండదు.
సాధారణ మొక్కల కంటే విశిష్టమైనది… ఈ మొక్క Parijat-(Night Jasmine)
ఈ చెట్టు ఉన్నచోట లక్ష్మీదేవి కోలువై ఉంటుందంటారు. పారిజాతం మొక్క నాటితే దాన్ని సాధారణ మొక్కల్లాగా వదిలేయకూడదు. ఏదో నీళ్లు పోసాంలే అని వదిలేయకూడదు. మనం మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పారిజాతం చెట్టు చుట్టూ అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ చెట్టు కింద పేడతో అలికి చక్కగా ముగ్గులు పెట్టాలి. దానిపై పడిన పూలను దేవుడికి ఉపయోగించాలి. ఈ చెట్టు ఇంట్లో ఉంటే సిరుల వర్షం కురుస్తుందని అందరి నమ్మకం. అంతే కాదు పారిజాతం చెట్టు, ఆకులు, పువ్వులు, గింజలు అన్ని గోప్పవే. అంతే కాకుండా వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పారిజాతం మొక్కతో ఆరోగ్య ప్రయోజనాలు…
ఈ మొక్కలోని ఆకులు, పువ్వులు, కాడలు, గింజలు ఇవన్ని ఆరోగ్యనికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపేణులు చెబుతున్నారు. పారిజాత మొక్క ఆకులను మెత్తగా నూరి చర్మానికి రాసుకుంటే చర్మ సమస్యలు దూరం అవుతాయి. వీటి పువ్వులను నూరి ఆ పేస్ట్ ను ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఆర్థరైటిస్, సయాటికా, ఎముకల పగుళ్లు, చర్మ వ్యాధులు, పైల్స్, జ్వరం, డెంగ్యూ, మలేరియా, పొడి దగ్గు, మధుమేహం వివిధ రకాల వ్యాధుల చికిత్సకు పారిజాత మొక్కలు ఉపయోగపడతాయి.
స్త్రీల ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి సహయపడుతుంది. వీటి గింజలను ఎండబెట్టి పొడి చేసి పేస్ట్ లా చేసి జూట్టుకు పట్టింస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి. వీటి ఆకులను మొత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ఆముదంలో వేడి చేసి వాపులు నోప్పులపై కట్టు కట్టడం వల్ల నోప్పులు తగ్గుతాయి. ఈ గింజలను నల్లగా అయ్యే వరకు వేపి పొడి చేసి దానికి హరతి కర్పూరం పొడిని, కొబ్బరి నూనెను కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను లేపనంలా రాయడం వల్ల గజ్జి, తామర వంటి అన్ని చర్మ సమస్యలు దూరమైతాయి.