Israel
ఇజ్రాయెల్, హమాస్ మధ్య పరస్పర బందీల విడుదల ఒప్పందం గడువును పెంచాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. హమాస్ బందీల విడుదలలో పెద్ద మనసుతో అడుగులేస్తుండటం, అడగని ఇతర దేశాల ఖైదీలను కూడా వాలంటరీగా విడుదల చేయడంతో రెండు దేశాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీల విడుదల నెమ్మదిగా సాగుతోంది. ఇప్పుడు మూడో బందీల బృందం కూడా విడుదల అవుతోంది. అమెరికాకు చెందిన నాలుగేళ్ల అమ్మాయిని కూడా ఉగ్రవాదులు విడిచి పెట్టారు. ఇందుకు బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. అయితే బందీల విడుదల సజావుగా సాగేందుకు కాల్పుల విరమణ ఒప్పందం గడువును మరింత పెంచాలనే ఆలోచనలో హమాస్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల అయిన వారితో కలుపుకుని ఇప్పటి వరకూ 17 మంది ఇజ్రాయిలీ పౌరులు స్వదేశంలోకి అడుగు పెట్టారు.
అయితే వీరిలో 80 ఏళ్ల వయసున్న ఓ ముసలావిడ పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. విడుదలైన బందీల్లో నాలుగేళ్ల అమెరికన్ చిన్నారి కూడా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆమె మానసికంగా బాగా దెబ్బతిందని, ఆ చిన్నారి తల్లి దండ్రులిద్దరినీ హమాస్ ఉగ్రవాదులు కళ్ల ఎదుటే దారుణంగా హత్య చేశారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం పరిమితి దాటి ముగ్గురు థాయ్ పౌరులను కూడా హమాస్ ఉగ్రవాదులు విడుదల చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాలస్తీనాకు మద్దతు పలుకుతుండటంతో రష్యన్, ఇజ్రాయెలీ పౌరుడొకరిని కూడా హమాస్ విడుదల చేశారు. Israel
పోటా పోటీగా రెండు దేశాల ప్రతీకార దాడులు
రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యాక చాలా ప్రాణ నష్టమే జరిగింది. ఇజ్రాయెలీ అధికారుల కథనం ప్రకారం హమాస్ ఉగ్రవాదులు దాదాపు 1,200 మంది ఇజ్రాయెలీలను, మరికొందరు విదేశీయులను చంపేశారని తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ హమాస్ ను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు 1,500 మందిని ఇజ్రాయెలీ అధికారులు చంపేశారు. గాజాలోని హమాస్ ప్రభుత్వం సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ జరిపిన మిలటరీ దాడుల్లో అమాయక పౌరులు, చిన్న పిల్లలతో సహా 15 వేలమంది చనిపోయరని తెలుస్తోంది. నిన్న ఆదివారం విడుదల చేసిన ఇజ్రాయెల్ పౌరులతో కలిపి ఇప్పటి వరకూ 39 మంది బందీలు విడుదలయ్యారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్ లనుంచి 78 మంది పాలస్తీనా ఖైదీలు ఈ రెండు రోజుల్లో విడుదల అయ్యారు.
ఒప్పందాన్ని దాటి మరీ బందీల విడుదల Israel
అయితే ఒప్పందాన్ని దాటి శుక్రవారం నాడు హమాస్ పది మంది థాయ్, ఫిలిప్పీన్ బందీలను విడుదల చేయడం సంచలనంగా మారింది. ఆదివారం హమాస్ విడుదల చేసిన వీడియోలో బందీలు వాహనాలతో గాజా సిటీ నుంచి ఇజ్రాయెల్ లోకి అడుగుపెడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇదే సమయంలో బందీల విడుదల గడువును పొడిగించాలని ఇజ్రాయెల్ హమాస్ పై ఒత్తిడి తీసుకొస్తోంది. ఫ్రాన్స్ బందీలతో సహా అందరు బందీలు విడుదల అయ్యే వరకూ కాల్పుల విరమణ ఒప్పందం గడువును పొడిగించడమే మంచిదని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కామెంట్ చేశారు. ఈ వాదనలను అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా సమర్ధిస్తున్నారు. ఇది బందీలందరూ సురక్షితంగా విడుదల అవడానికి ఒక మార్గమని అదే సమయంలో గాజాలో మానవతా సాయం ఆశిస్తున్న వారికి సాయం చేసేందుకు వీలుపడుతుందని అన్నారు. ఈ ప్రతిపాదనలకు హమాస్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గడువును రెండు నుంచి నాలుగు రోజులకు పెంచాలంటూ తమ బృందాలు కోరుతున్నాయని హమాస్ మధ్యవర్తి దేశాలకు తెలియ చేసింది. ఆ టైమ్ లో 20 నుంచి 40 మంది ఇజ్రాయెలీ ఖైదీలను కూడా విడుదల చేసే అంశం ఆలోచిస్తామని హమాస్ అంటోంది.
Israel