Nayanatara
మూవీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరంటే నయనతార పేరు మారుమోగుతుంది. లేడీ సూపర్ స్టార్ గా తన హవా కొనసాగిస్తోంది నయన్. ఈ మధ్యకాలంలో జవాన్ మూవీలో షారుక్ సరసన నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తన మూవీ కెరీర్ లో లేడీ ఓరియెంటెడ్, స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. అటు హీరోయిన్ గా ఇటు నిర్మాతగా బిజీ బిజీగా లైఫ్ లీడ్ చేస్తుంది ఈ గ్లామర్ బ్యూటీ.
లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ రోజురోజుకు మరింత పెరుగుతోంది. రౌడీ పిక్చర్స్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించింది ఈ అమ్మడు. నయతార ని యాక్షన్, థ్రిల్లర్, కమర్షియల్ సినిమాలల్లోనే ఇప్పటి వరకు చూశాం…. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ లేడీ డాన్ కొత్త అవతారం ఎత్తబోతుందట. అన్నపూర్ణగా కొత్త పాత్రలో నటిచిందట ఈ బ్యూటీ. నయనతార 75వ సినిమా అన్నపూరణి మూవీ తెరకెక్కబోతుంది. కన్నప్ప మూవీలో పార్వతి దేవి అవతారంలో కనిపించబోతుంది. కొత్త కొత్త పాత్రల్లో నటిస్తూ అందరిని మెప్పిస్తుంది నయనతార.
అన్నపూరణిగా లేడీ డాన్: Nayanatara
తాజాగా అన్నపూరణి సినిమాలో నటించి మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని డిసెంబర్ 1వ తేదిన రిలీజ్ కి సిద్ధంగా ఉంది. డైరెక్టర్ నీలేఖ్ కృష్ణ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ అన్నపూరణి స్టోరి ని రివీల్ చేశాడు.
మూవీ స్టోరీ:
చిన్న వయస్సులోనే వంటలపై ఆసక్తి కలిగిన అమ్మాయి ఎలా ఆ రంగంలో సక్సస్ అవుతుందో అనే కథనంతో కొనసాగుతుందట. ఆ అమ్మయి తన కుటుంబాన్ని, సమాజన్ని, పురుషాధిక్యతను ఎదుర్కొని ఎలా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. మానవత్వం, ప్రేమ, ఆత్మవిశ్వాసం గురించి చెప్పే మూవీ అన్నపూరిణి కథ నయనతార ఇప్పటి వరకూ ఎప్పుడు నటించని పాత్రల్లో కాకుండా సరి కొత్త పాత్రల్లో నటించి ప్రేక్షలను ఆకట్టుకుంటుంది.
మూవీ ప్రముఖులు
ఈ సినిమాలో సత్యరాజ్, జయ, కేఎస్ రవికుమార్, కుమారి సచ్చు, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లీ, రేణుక, కార్తీక్, సురేష్ చక్రవర్తి ముఖ్యపాత్రల్లో నటించారు. తమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.
పార్వతి దేవిగా రాబోతున్న సినిమా Nayanatara
చేతి నిండా సినిమాలతో అటు మూవీలో ఇటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది ఈ లేడీ సూపర్ స్టార్. తెలుగు లో పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ కి జోడిగా నయనతార ని ఫిక్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పార్వతి దేవిగా నటించబోతుంది ఈ బ్యూటీ. మహభారతం సిరీస్ ను తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ సినిమాలకు పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్న నయన తార తన నటనకు గాను ఎన్నో ప్రశంసలు దక్కించుకుంది. శ్రీరామ రాజ్యం సినిమా తర్వాత నయనతారను ఈ తరం వారెవరైనా సీతగా పరిగణిస్తారు. తన నటనకు ఫిదా కానీ వారంటూ ఉండరు.