ఉత్తరాఖండ్ సిల్క్యారీ టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కూలీలు ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు. చావు నోట్లో తలపెట్టి బయటపడిన వీరందరూ ఇప్పుడు తీవ్రమైన ఉద్విగ్న మనో భావాలతో సతమతమవుతున్నారు. దాదాపు చనిపోతున్నామని సిద్ధపడిపోయిన వారంతా 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు రావడం మన ఇంజనీరింగ్ అధికారులు సాధించిన ఘన విజయం. వీరంతా మానసికంగా ధృడంగా గనిలోనే ఉండేందుకు ఓ వ్యక్తి చేసిన కృషి అభినందనీయం. గబ్బర్ సింగ్ నేగీ పౌరీ ఘర్వాల్ జిల్లాలో పుట్టిన నేగీ ఇలాంటి కుప్పకూలిన గనుల్లోనుంచి కూలీలను బయటకు తేవడంలో సిద్ధహస్తుడు..ఇప్పటికి ఇలాంటి మూడు సంఘటనలకు నేతృత్వం వహించాడు.
దాదాపు 400 గంటలు భూమిలో 200 అడుగుల లోతున కూరుకు పోయిన వారంతా మానసికంగా దిట్టంగా, స్థిర చిత్తంతో ఉండేందుకు వారికి గనిలోనే రోజూ యోగా, మెడిటేషన్ నేర్పాడు. అందుకనే కూలీలంతా శారీరకంగా, మానసికంగా అన్ని రోజులు స్థిరంగా ఉండగలిగారు. పైగా గనిలోంచి వారందరూ సురక్షితంగా బయటపడేలా తాను సహకరిస్తానని, అందరికన్నా తాను చివరన బయటకు వస్తాననీ చెప్పి వారికి భరోసానిచ్చాడు.
అంతా జయమల్ నేగీ శిక్షణ, గైడెన్స్ 41
నిజానికి నేగీ వారికి అలాంటి భరోసాను, మానసిక ధైర్యాన్ని ఇవ్వకపోయి ఉంటే వారంతా బతికి ఉండేవారు కాదు. ఇవాళ నేను సంతోషంగా ఉన్నాను.. కార్మికుల కుటుంబాలన్నీ సంతోషంలో ఉన్నాయి. వారే కాదు యావద్దేశం వారు సేఫ్ గా బయటకు ల్యాండ్ అవడంపై చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. వారు బయటకు వచ్చిన నేపధ్యంలో స్వీట్లు పంచుకుని వారికి పూలదండలతో ఘనస్వాతం పలికారు అని నేగీ అంటున్నారు. రెండు వారాలుగా నేగీ గని కుప్పకూలిన స్థలంలోనే పని చేస్తున్నారు.
గనిలో యోగా, మెడిటేషన్
గనిలో చిక్కుకున్న కూలీలందరితో రోజూ నేగీ సోదరుడు బయటనుంచి మాట్లడేవాడు.. మొదట్లో అమర్చిన పైప్ ద్వారా వారి యోగ క్షేమాలు తెలుసుకునేవాడు.. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లను పంపి వాటి ద్వారా సంభాషించారు. ఆ టైమ్ లోనే రోజూ యోగా చేయాలని సూచించారు. నేగి సోదరుడు కూడా గనిలో చిక్కుకుపోవడంతో ఆయన వీరందరినీ గైడ్ చేసేవాడు. కార్మికులను బయటకు తరలించేటప్పుడు అందరూ ఒకేసారి బయపడాలని ప్రయత్నించడం వల్ల తొక్కిసలాట జరుగుతుందని భావించామని కానీ తన సోదరుడు లోపల ఉండటం వల్ల అందరికన్నా తను సీనియర్ కాబట్టి చివరన బయటకు వస్తానని, అందరినీ క్యూలో ఒక్కొక్కరిగా బయటకు పంపుతాననీ ప్రకటించాడు. గనిలో చిక్కుకుపోయిన సమయంలో కూడా వారందరినీ నవ్వించడం, జోకులు చెప్పడం, వారితో లూడో, ఛెస్ లాంటి ఆటలు ఆడించడం చేసేవాడు.
నేగీపై మోడీ ప్రశంసల జల్లు 41
జయమల్ నేగీ ధైర్యాన్ని ప్రధాని మోడీ సైతం ప్రశంసించారు. గతరాత్రి గని కార్మికులతో మోడీ స్వయంగా ఫోన్ లో సంభాషించారు. అందరూ సురక్షితంగా బయటకు రావడం సంతోషం కలిగించిందని, పొరపాటున ఎవరైనా ప్రాణాలతో రాకపోతే మా మనోభావాలు మరో రకంగా ఉండేవని ప్రధాని వారితో అన్నారు. ఈ సందర్భంగానే జయమల్ నేగీ ధైర్య స్థైర్యాలను మోడీ ప్రశంసించారు.
దీవాలీ రోజున విషాదం
దేశం దీపావళి వేడుకలు జరుపుకుంటున్న వేళ ఉత్తరాఖండ్ సిల్క్యారీ టన్నెల్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. గని కొంత భాగం కుప్పకూలడంతో గనిలో కార్మికులు చిక్కుకుపోయారు. మొత్తం మీద 17 రోజుల ప్రయత్నాల తర్వాత సురక్షితంగా వారంతా బయటకు రాగలిగారు. గని ముఖ ద్వారం పాక్షికంగా కూలిపోవడంతో లోపల కార్మికులు చిక్కుకుపోయారు. కుప్పకూలినప్పుడు పెద్ద పెట్టున శబ్దం రావడంతో కొందరికి చెవులు పనిచేయకుండా పోయాయి. అయితే గనిలో దాదాపు 25 రోజులకు సరిపడ ఆహారం నిల్వ ఉంది. బాధితులను బయటకు తరలించేందుకు ఏం చేయాలి? ఎలా చేయాలి అన్న అంశంపై చర్చ కారణంగానూ, ప్రయత్నాలు ఫలించని కారణంగానూ ఇన్నాళ్లు ఆలస్యం జరిగింది. 41