Non-Veg
మనలో చాలా మందికి ప్రతిరోజూ నాన్ వెజ్ తిననిదే ముద్ద దిగదు. ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాల్సిందే కానీ మాంసాహారం ఎక్కువగా తినేవారిలో ఊబకాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మాంసంలో కొవ్వు అధికంగా ఉంటుంది. రోజూ, లేదా వారానికి మూడు నాలుగుసార్లు మాంసాహారం తిన్నావాటిలో ఉండే కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. దానిని కరిగించకపోతే కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులొస్తాయి. నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. కడుపులో ఆమ్లం పెరగడంతో ఎముకలు, కీళ్లలో నొప్పి మొదలై అసౌకర్యం అనిపిస్తుంది ఏ పనిచేయలేకపోతారు.
నాన్ వెజ్ తో పాటు కూరగాయలు…
అందుకే మాంసాహారం ఎక్కువగా తినాలనుకునేవారు దానితోపాటు కూరగాయలు, పండ్లు, సలాడ్ లు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల శరీరానికి ప్రొటీన్ తో పాటు ఫైబర్ కూడా అందుతుంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా, మొక్కల ఆధారిత ఆహారం గ్లోబల్ లేబుల్లపై ట్రెండింగ్లో ఉంది. నాన్ వెజ్ ఎక్కువగా తినేవారిపై చేసిన పరిశోధనలో కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. లైఫ్ టైమ్ రిస్క్ పూలింగ్ ప్రాజెక్టులో భాగంగా యునైటెడ్ స్టేట్ప్ లోని 6 ప్యూచర్ సమన్వయ అధ్యయనాల నుంచి పరిశోధకులు వీరిని ఎంచుకున్నారు. మెుత్తం 30 వేల మంది నుంచి వారి డైట్ కు సంబంధించిన విషయాలను సేకరించారు.
మాంసహరం తినేవారిపై పరిశోధన….
నాన్ వెజ్ తినేవారిపై ఈ ప్రత్యేక పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో దాదాపు 30,000 మంది వ్యక్తుల డేటా సేకరించారు. ఇందులో వీరి డైట్కు సంబంధించిన పలు విషయాలను సేకరించారు. లైఫ్టైమ్ రిస్క్ పూలింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ లోని ఆరు ఫ్యూచర్ సమన్వయ అధ్యయనాల నుంచి పరిశోధకులు ఈ వ్యక్తులను ఎంచుకున్నారు. (ARIC) అథెరోస్క్లెరోసిస్ రిస్క్ ఇన్ కమ్యూనిటీస్ అధ్యయనం, (CARDIA) యువకులు,పెద్దలలో కొరోనరీ ఆర్టరీ రిస్క్ డెవలప్మెంట్ అధ్యయనం, (CHS) హార్ట్ హెల్త్ స్టడీ,( FHS) ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ, FOS ఫ్రేమింగ్హామ్ సంతానం అధ్యయనం, MESAమల్టీ-ఎత్నిక్ స్టడీ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్ అధ్యయనం చేపట్టారు.
హృదయ సంబంధిత వ్యాధులు…. Non-Veg
రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసాన్ని వారానికి రెండుసార్లు తినేవారికి గుండెపోటు, స్ట్రోక్ తో సహా హృదయ
సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 3% నుంచి 7% ఎక్కువగా కలిగి ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ కారణాల వల్ల మరణించే ప్రమాదం 3% ఎక్కువ. వారానికి రెండుసార్లు పౌల్ట్రీ తినేవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 4% ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. అయితే చేపలు తినేవారిలో గుండెజబ్బులు, తక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరణాల మధ్య ఎటువంటి సంబంధం లేదని అధ్యయనం కనుగొన్నారు. నాన్ వెజ్ తిన్నా, ఆరోగ్యకరమైన జీవన శైలిని, ఫైబర్ ఉండే ఆహారాన్ని అదనంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. కాబట్టి నాన్ వెజ్ తినేవారు డైటరీ ఫైబర్ కోసం అదనపు ఆహారాన్ని తీసుకోవాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.