Yashasvi Jaiswal
ఆస్ట్రేలియాతో జరుగుతున్నా టీ20లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తనదైన మెరుపు ఆటతో చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తిరువనంతపురం వేదికగా జరిగిన మ్యాచ్లో కేవలం 25 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. అంతకుముందు జరిగిన తొలి టీ20లో కూడా జైశ్వాల్(21) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ నేపథ్యంలో యశస్వీ జైశ్వాల్పై అతడి చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి దూకుడైన ఆట తీరును పోలి ఉన్నాడని జ్వాలా సింగ్ కొనియాడాడు.యశస్వికి ఈ టాలెంట్ ఎలా వచ్చింది? ఇప్పుడు చూద్దాం.
పూర్తి పేరు యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్. జననం 28 డిసెంబర్ 2001 భారత క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. ఇతగాడు 28 డిసెంబర్ 2001జన్మించాడు. ఒక చిన్న హార్డువేర్ దుకాణం యజమాని భూపేంద్ర జైస్వాల్ మరియు గృహిణి కాంచన్ జైస్వాల్ ల సంతానంగా జన్మించాడు. ఉత్తర ప్రదేశ్లోని భదోహిలోని సూర్యవాన్లో ఆరుగురు సంతానంలో నాల్గవ సంతానం యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్. పదేళ్ల వయసులో అతను ఆజాద్ మైదాన్ లో క్రికెట్ శిక్షణ పొందేందుకు ముంబైకి వెళ్లాడు. ఒక్కప్పుడు పానీ పూరి అమ్మిన అతను ఇప్పుడు పరుగుల వీరుడయ్యాడు.
11 ఏళ్ల వయస్సులో జైస్వాల్ పట్టుదల……. Yashasvi Jaiswal
యశస్వికి ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. దీంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేది. అయితే యశస్వికి ఊహ తెలిసిన నుంచి క్రికెట్ అంటే ప్రాణం. అతను స్కూల్ అయిపోగానే గ్రౌండ్ కు వెళ్లి క్రికెట్ ఆడేవాడు. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ముంబై వెళ్లాలని యశస్వి నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు మొదట వారు ఒప్పులేదు. కానీ 11 ఏళ్ల జైస్వాల్ పట్టుదల చూసిన తండ్రి యశస్విని ముంబైకి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఉపేంద్ర జైస్వాల్ ముంబైలోని తన తమ్ముడి దగ్గరికి యశస్విని పంపించాడు. అయితే ముంబైలో జైస్వాల్ బాబాయ్ ఓ పూరి గుడెసేలో ఉండేవాడు. జైస్వాల్ ఉండేందుకు చోటు కూడా ఉండేది కాదు. దీంతో జైస్వాల్ ను వాళ్ల బాబాయ్ ఓ డెయిరీలో పనికి పెట్టాడు. అక్కడ ఉదయం పని చేసుకుంటూ సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అయితే ఒక రోజు డెయిరీ ఓనర్ జైస్వాల్ ను బయటకు పంపించేశాడు. దీంతో యశస్వి ఆజాదీ మైదానానికి చేరుకున్నాడు.
ఉదయం ప్రాక్టీస్, సాయత్రం పానీ పూరి… Yashasvi Jaiswal
అక్కడ ఓ వ్యక్తి ఓ చిన్న గూడారంలో జైస్వాల్ కు నివాసం కల్పించారు. అలా అక్కడ ఉంటూ సాయంత్రం పానీ పూరి అమ్మి ఉదయం ప్రాక్టీస్ చేసేవాడు. అయితే జ్వాలా సింగ్ అనే క్రికెట్ కోచ్ యశస్వి ప్రతిభను చూసి చేరదీశాడు. అతనికి ఉండడానికి ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత యశస్వి ముంబై U-16 జట్టుకు ఎంపికయ్యాడు.
మలుపు తిప్పిన ఆసియాకప్
2018 U-19 ఆసియా కప్ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. యశస్వి ఈ టోర్నమెంట్లో అత్యధికంగా 318 పరుగులు చేసి భారత్ను విజయపథంలో నడిపించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. 2019న చత్తీస్గఢ్తో జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి సత్తా చాటాడు.
అత్యంత వేగవంతమైన అర్ధశతకం….. Yashasvi Jaiswal
2020 IPL వేలంలో యశస్వి జైస్వాల్ అన్క్యాప్డ్ జాబితాలోకి వచ్చాడు. యశస్వి జైస్వాల్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023 వేలంలో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. యశస్వి జైస్వాల్ భారత జట్టులో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది.