Yash
కన్నడ నటుడు రాకింగ్ స్టార్ యష్ కేజిఎఫ్ పార్ట్1-2 లో నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమాతో ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో ఆయన నటనకు ఫిదా కానీ వారంటూ లేరు. ఇప్పటి వరకు 18 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన యష్ కి కేజిఎఫ్ కి వచ్చినంత క్రేజ్ ఏ సినిమాకు రాలేదు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో తన నెక్ట్స్ మూవీ కూడా అదే రేంజ్ లో హిట్ అందుకోవటం కోసం అనేక కథలను యష్ వింటున్నాడని సమాచారం. అందుకే దాదాపుగా 20 నెలలు గ్యాప్ తీసుకున్నాడని సమాచారం.
ఏ డైరెక్టర్ వచ్చి కథని చెప్పినా నచ్చలేదంటూ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. కేజిఎఫ్ వచ్చి ఇప్పటికి ఏడాది అవుతున్నా ఏ సినిమాకు ఒకే చెప్పలేదు. యష్ ఫ్యాన్స్ మాత్రం న్యూ మూవీ అప్డేట్ ఎప్పుడు ఇస్తాడో అని చాలా అతృతగా ఎదురుచూస్తున్నారు. యష్ ఎక్కడ కనిపించినా నెక్ట్స్ మూవీ ఎప్పుడంటు ఫ్యాన్స్ ప్రశ్న అడుగుతూ వచ్చారట. అందుకు గతంలో ఒకసారి ఎదురుచూస్తూ ఉండండి అంటూ బదులిచ్చాడు. తాజాగా తన 19వ మూవీ అప్డేట్ ఇచ్చాడు యష్. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు.
యష్ న్యూ మూవీ అప్డేట్: Yash
యష్ నెక్ట్స్ మూవీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ మలయాళ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ యష్-19 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యష్ కూడా సోషల్ మీడియాలో అధికారికంగా తన 19వ సినిమా అని ప్రకటించడం జరిగింది. KVN ప్రొడక్షన్ లో ఈ సినిమా రానుందట. టైటిల్ ని డిసెంబర్ 8వ తేదీన ఉదయం 9:55 నిమిషాలకు ప్రకటించబోతున్నట్లు తెలియజేశారు. యష్-19 సినిమా కూడా పాన్ ఇండియాగా తెరకెక్కుతుందని సమాచారం.
ఇక ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. యష్ ఈ సారి ఎలాంటి కథను ఎంచుకున్నాడు? ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందని? ఆయన గెటప్ ఎలా ఉంటుందని? అని చాలా అతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. యష్-19 మూవీ గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే డిసెంబర్ 8వ తేదీ వరకు ఆగాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్…. కౌండ్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.
యష్ మూవీ హీరోయిన్ ఎవరు?
యష్-19 మూవీలో హీరోయిన్ ను కూడా అనౌన్స్ చేశారని సమాచారం. ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్, మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీ మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించడంతో యష్ కి జోడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. యష్-సాయి పల్లవి కాంబినేషన్ అంటే ప్రేక్షకులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈసినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. సాయి పల్లవి కూడా ఏడాది గ్యాప్ తరువాత వరస సినిమా ఆఫర్స్ తో దూసుకుపోతుంది.