మంగళగిరి MLA ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు. మంగళగిరిలో ఇదొక పెను సంచలనం.. వైసీపీ పార్టీకి ఇది తీరని నష్టం.. వైసీపీ పార్టీ ప్రారంభం నుంచి విశ్వాసంగా మెలిగిన అత్యంత నమ్మకస్తుల్లో ఆళ్ల ఒకరు.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన లోకేష్ ను మట్టి కరిపించడంలో ఆళ్ల సక్సెస్ అయ్యారు. అప్పట్లో చంద్రబాబు తనయుడిని ఓడించిన నేతగా ఆయనకు ప్రజలు, వైసీపీ నేతలు కూడా బ్రహ్మ రథం పట్టారు.. ఆళ్ల రామకృష్ణా రెడ్డి కుటుంబానికి మొదట్నుంచీ వైఎస్ రాజశేఖర రెడ్డితో అనుబంధం ఉంది. ఫార్మా కంపెనీలున్నాయ్. అన్న అయోధ్య రామి రెడ్డి కూడా వైఎస్ కి ఆప్తుడే..వైఎస్ మరణానంతరం జగన్ పెట్టిన పార్టీలో చేరారు అన్నదమ్ములు.. ఇద్దరూ జగన్ కు కావలసిన వారే.. పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసిన వారే…
రెండు సార్లు దక్కని మంత్రి పదవి
వాస్తవానికి తొలి విడతలోనే ఆళ్ల మంత్రి పదవిని ఆశించారు. కానీ తొలివిడత, రెండో విడత రెండు కేబినెట్ విస్తరణల్లోనూ ఆయనకు మంత్రిపదవి దక్కలేదు.. .. ఆయన అడిగారో లేదో తెలీదు కానీ.. కనీసం కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలాంటిదేదీ ఆయనకు దక్కలేదు. అయిదేళ్లు నిరాశగా గడిచిపోవడం ఎన్నికల కు పీకే టీమ్ అభ్యర్ధుల కసరత్తు చేయాల్సి రావడం అందులో కుల సమీకరణలను మార్చాల్సిన అవసరాన్నిసర్వేలు తెలియ చెప్పడంతో ఆళ్లపై జగన్ దృష్టి పడలేదు. అప్పటినుంచి ఆయన ఒంటరి అయిపోయారు. నియోజక వర్గంలో తన ప్రత్యర్ధులకు పెద్ద పీట వేయడం, పద్మశాలీ అయిన గంజి చిరంజీవిని వైసీపీ అభ్యర్ధి గా ఖాయం చేయడంతో ఆళ్ల నొచ్చుకున్నట్లుగా ఉంది.
పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా MLA
నియోజక వర్గంలో ఆళ్ల వ్యతిరేక వర్గం రోజు రోజుకూ బలపడటం కూడా ఆయనకు పార్టీపైనా, రాజకీయాలపైనా వ్యతిరేకతకు కారణమైంది. రెండో సారి విస్తరణలోనైనా ఆయనకు మంత్రి పదవి కేటాయించి ఉంటే బాగుండేది.. ఈకారణాలతో తప్పు కోడం మేలనుకున్నారో ఏమో గానీ ఇవాళ ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేసారు. ఈ సందర్భంగా మీడియా మీట్ లో ఆయన జగన్ కు ఇప్పటి వరకూ సహకరించినందుకు కృతజ్నతలు చెప్పారే కానీ, తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు సాకుగా చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ చాలా సూటిగా, క్లుప్తంగా ముగిసింది.
భవిష్యత్తుపై పెదవి విప్పని ఆళ్ల
తన భవిష్యత్ కార్యక్రమం గురించి కూడా ఆయన ఏ మాటా మాట్లాడలేదు. రాజకీయాలతో విసిగిపోయి విరామం తీసుకుంటున్నారా లేక వైసీపీపై కక్ష తో వేరే పార్టీలో చేరి రాజకీయం చేస్తారా అన్నది ఇంకా క్లారిటీ లేదు. చూడబోతుంటే జగన్ తో తెగతెంపులకే ఆయన సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది.పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడమే అందుకు నిదర్శనం.. రాజీనామాకు కారణాలేంటన్న విలేకరుల ప్రశ్నలకు అన్ని విషయాలు త్వరలో చెబుతానంటూ లేచివెళ్లిపోయారు ఆళ్ల.. ఇప్పటి వరకూ పార్టీపైనా, అధినేత పైనా ఒక్క మాట కూడా నెగటివ్ గా మాట్లాడలేదు.. కానీ ఇకపై అలా ఉండకపోవచ్చు..
టీడీపీపై కేసులువేసి పోరాడి… MLA
రాజధాని భూముల కుంభకోణం, ఓటుకు నోటు కేసు,అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం, హెరిటేజ్ కుంభకోణం ఇలా టీడీపీని ఇరుకున పెడుతూ, వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకుని ఎన్నో కేసులను వేసి కోర్టు ల చుట్టూ తిరిగి టీడీపీని మూడు చెరువుల నీళ్లు తాగించిన వ్యక్తి ఆళ్ల. అణువణువునా జగన్ భక్తిని నింపుకున్న వ్యక్తి.. తన నియోజక వర్గంలోనే ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి.. నియోజక వర్గంలో ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నా.. ఆళ్ల వ్యతిరేక వర్గం ఆయనపై కక్షకట్టింది. అందుకే రెండో సారి ఆయన మెజారిటీ తగ్గింది. కేవలం 12 ఓట్ల మెజార్టీతో 2019 ఎన్నికల్లో గెలిచారాయన..
ఏది ఏమైనా ఆళ్ళ లంటి వ్యక్తిని వైసీపీ కాపాడుకుని ఉండాల్సింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి ఊపిరిని అస్తిత్వాన్ని ఇచ్చి గెలుపు గుర్రాల్లా పనిచేసిన వ్యక్తులను పార్టీ కాపాడుకోవాలి.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేని పక్షంలో మరేదైనా పదవి ఇచ్చైనా వారి ప్రాధాన్యతను గౌరవించి ఉండాల్సింది. ఆళ్ల లాంటి నమ్మిన బంటులను కాపాడుకోలేక పోవడం వైసీపీకి నిజంగా దెబ్బే… MLA