IPL
ఐపీఎల్ వేలం ప్రక్రియకు టైం దగ్గర పడుతోంది. ఈసారైనా సరైన ఆటగాళ్లను జట్లు ఎంపిక చేసి కొనుక్కోకపోతే గతంలోలాగే నష్టం వాటిల్లుతుంది. ఈసారి ఈ వేలం ప్రక్రియ ఈనెల 19న దుబాయ్ లో జరగబోతోంది. అంటే వేలం సమయం గట్టిగా వారం రోజులు మాత్రమే ఉంది. గత వేలంలో కొనుగోలుచేసిన ఆటగాళ్లెవరూ సరైన ప్రతిభ కనపరచిన దాఖాలాలు లేవు. కోట్లు పోసి కొన్నా… వారంతా ఆయా జట్లకు ప్రాతినిధ్యం సరిగా వహించినది లేదు.
దాంతో ఈసారి వేలంలో ఆర్సీబీ కంపెనీ చాలా జాగ్రత్తలు తీసుకోబోతోంది. ఈసారి వేలంలో మొత్తం 1166 ఆటగాళ్ల పేర్లను వెల్లడించారు.10 జట్లలో 77 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందువల్ల ఈ వేలంలో కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం దక్కనుంది. వేలం సమయంలో ఈ విషయాలు మరిచిపోతే గతంలో లాగా ఆర్ సీబీ జట్టులో పేలవ ఆటగాళ్లు చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, గత 16 సీజన్లలో కొంతమంది ఆటగాళ్లకు ఖరీదైన మొత్తాన్ని ఇచ్చి ఆర్సీబీ ఇబ్బందుల్లో పడింది.
అన్ని జట్లు సిద్దం…. IPL
ఐపీఎల్ సీజన్ 17 వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 19న దుబాయ్లో నిర్వహించనున్న మినీ వేలానికి రూపురేఖలు సిద్ధమవుతున్నాయి. ఈ వేలం కోసం RCB కూడా భారీ ప్లాన్లో ఉంది. ఎందుకంటే ఈ వేలం ద్వారా RCB జట్టు మొత్తం 6గురు ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఆరుగురు ఆటగాళ్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో తలపడాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆర్సీబీ వద్ద రూ.23.25 కోట్లు ఉన్నాయి. కాబట్టి ఆటగాళ్లను తెలివిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
గత వేలం పాటల్లో ఆర్బీబీ ఎంపిక పేలవం!
వేలం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గతంలో లాగా ఆర్సీబీ జట్టులో పేలవమైన ఆటగాళ్లు చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, గత 16 సీజన్లలో కొంతమంది ఆటగాళ్లకు అంత విలువ లేకున్నా ఖరీదైన మొత్తాన్ని ఇచ్చి ఆర్సీబీ ఇబ్బందుల్లో పడింది. కాబట్టి, గత పదహారు సీజన్ల వేలంలో RCB ఎంపిక చేసిన ఆటగాళ్లెవరూ సరైన ప్రతిభ కనపరచనే లేదు.. వాళ్లమీద కోట్లు పెట్టుబడి పెట్టి తీసుకుంటే వారు అత్యంత పేలవంగ ఆడి ఓటమిని తీసుకొచ్చారు…
టైమల్ మిల్స్ IPL
2017 వేలంలో ఇంగ్లండ్ పేసర్ టైమల్ మిల్స్ ను 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆ రోజు 5 మ్యాచ్లు ఆడిన మిల్స్ 8.5 పరుగుల సగటుతో 5 వికెట్లు మాత్రమే తీశాడు. 2021 వేలంలో న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమిసన్ ను ఆర్సీబీ రూ. 15 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ తరపున 9 మ్యాచ్లు ఆడిన జేమీసన్ 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. సౌరభ్ తివారీ 2011లో ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ సౌరభ్ తివారీని ఆర్సీబీ రూ.7.36 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, ఆర్సీబీ తరపున మూడు సీజన్లు ఆడిన తివారీ 22.23 సగటుతో 578 పరుగులు మాత్రమే చేశాడు. ఛెతేశ్వర్ పుజారా 2011 వేలంలో ఆర్సీబీ రూ.3.22 కోట్లకు చెతేశ్వర్ పుజారాను కొనుగోలు చేసింది. మూడు సీజన్లలో ఆర్సీబీ తరపున 14 మ్యాచ్లు ఆడిన పుజారా 14.3 సగటుతో 143 పరుగులు మాత్రమే చేశాడు.
క్రిస్ వోక్స్
2018లో ఆర్సీబీ క్రిస్ వోక్స్ ను రూ.7.4 కోట్లకు కొనుగోలు చేసింది. దీని ప్రకారం, ఆర్సీబీ తరపున 5 మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ పేసర్ ఓవర్ కు 10.36 సగటుతో పరుగులు ఇచ్చి 8 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈసారైనా ఆర్సీబీ సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకుని ఐపీఎల్ లో రాణిస్తుందా ? చూడాలి…