TS
రేవంత్ మంత్రి వర్గంలో ఐటీ, సినిమాటో గ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన శాఖల పర్యవేక్షణలో తనదైన ముద్ర వేస్తున్నారా? తెలంగాణలో పదేళ్ల బీఆర్ ఎస్ పాలన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆత్మ గౌరవ నినాదం, సీమాంధ్రుల పెత్తనంనుంచి తెలంగాణను విముక్తి చేయడంలో ఉద్యమ పార్టీ చేసిన కృషి ఇంతా అంతా కాదు.. ఆ మాట కొస్తే సినిమా ఇండస్ట్రీ ఈ ఉద్యమ ప్రభావంతో బాగా ఎఫెక్ట్ అయ్యింది.
భయం ఏంటో నేర్పిన పార్టీ
అప్పట్లో వెండితెరపైనా సీమాంద్రులదే పెత్తనమా అంటూ బీఆర్ ఎస్ పెద్ద విప్లవాన్నే తీసుకొచ్చింది. తెలంగాణ భాష, యాసలను అవమానిస్తున్నారని, విలన్లకు తమ భాష పెడుతున్నారని, టాలెంట్ ఉన్న తెలంగాణ వారికి అవకాశాలు రావడం లేదని ఇలా.. రకరకాలుగా ఎన్నో లోపాలు, అవకతవకలు అంటూ బీఆర్ ఎస్ ఏకరువు పెట్టింది. ఈ ఉద్యమ ధాటికి చాలా సినిమా షూటింగులు ఆగిపోయాయి. కొందరు ఇక్కడ తీయడం మానుకున్నారు. చాలామంది కేసీఆర్ కు సాగిల పడి ఇక్కడే అడ్జస్ట్ అవడానికి నిర్ణయించుకున్నారు.
కారణం దశాబ్దాలుగా తమ స్థిర, చర ఆస్తులు ఇక్కడే ఉండటం , వాటిని కాపాడుకోవడం కోసం కేసీఆర్ కు సాగిల పడ్డారు. షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్, ఇలా రకరకాల అత్యున్నత సాకేంతిక టెక్నాలజీ,మేన్ పవర్, అనుకూలమైన క్లైమేట్, ఇక్కడే ఉండటం వల్ల సీమాంధ్ర ఇండస్ట్రీ పెద్దలెవరూ ఇక్కడ నుంచి వెళ్లేందుకు ఇష్టపడలేదు. దాంతో బీఆర్ ఎస్ కు అందరూ దాసోహం అనేశారు. షూటింగుల టైమ్ లో కొందరైతే తెలంగాణ స్థానిక నేతలకు కప్పం కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయ్…
తెలంగాణ వారికి పెరిగిన అవకాశాలు TS
తెలంగాణ రాకతో సినిమా ఇండస్ట్రీ తీరు మారిపోయింది. స్వయం పాలన, ఆత్మగౌరవ నినాదం ఇండస్ట్రీని ప్రభావితం చేశాయ్.. తెలంగాణ వారికీ సమానావకాశాలు వస్తున్నాయ్.. మెజారిటీ షూటింగులు వరంగల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయ్. అగ్ర నటులందరూ తెలంగాణ బాస్ కు సలాం కొట్టారు.. ఏమాట కామాట.. కేసీఆర్ కూడా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టలేదు.. అవసరమైనప్పుడల్లా బీఆర్ ఎస్ కూడా సినీ హీరోల ఆక్రమణలను , కట్టడాలను కొల్ల గొడుతూ వారు తమకు జీ హుజూర్ అనాల్సిందేనన్న సంకేతాలు పంపారు… మహేష్ బాబు, నాగార్జున,,చిరంజీవి, పవన్, జూనియర్ ఎన్జీఆర్, నాని ఇలా అగ్రహీరోలంతా కేసీఆర్ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారంటే అది కేసీఆర్ కల్పించిన భయమే..
షూటింగులు, సినిమా విడుదలలకు, వందరోజుల వేడుకలు ఇలా ప్రతీ చిన్న ఫంక్షన్ కు ప్రభుత్వ నేతలను పిలవడం ఆనవాయితీగా మారింది. అలా సినిమా ఇండస్ట్రీని శాసించారు కేసీఆర్.. అయినా సరే ఇక్కడుండేందుకే ఇండస్ట్రీ ప్రముఖులు మొగ్గు చూపారు. తప్ప ఆంధ్రకు వెళ్లిపోవాలని అనుకోలేదు. అక్కడి ప్రభుత్వం రాయితీల ఎర వేసినా ఇండస్ట్రీ అటువైపు వెళ్లింది లేదు..
కొరడా ఝుళిపించిన జగన్
అందుకే జగన్ ప్రభుత్వం వచ్చాక ఇండస్ట్రీ మీద కక్ష కట్టిందన్న వాదనలు రేగాయి. సినిమా టిక్కెట్ల రేట్ల తగ్గింపు పేరుతో అగ్రహీరోల సినిమాల వసూళ్లకు కత్తెర్లు వేసింది ఏపీ ప్రభుత్వం.. దాంతో హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ మరింత బలపడిపోయింది. ఇది ఎంతలా అయిపోయిందంటే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఇండస్ట్రీ పెద్దలు ఆయన్ను ఫార్మాలిటీకి కూడా కలవలేదు.. కనీసం సన్మానం చేయలేదు.. పైగా ఒక సామాజిక వర్గం జగన్ ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటే.. దానికెందుకు మోకరిల్లడం అనే లాజిక్ కూడా తీశారట..
దిల్ రాజు తప్ప రాని ఇండస్ట్రీ TS
కానీ తెలంగాణలో పదేళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్రం ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చింది.కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఇండస్ట్రీ పెద్దలు అందరూ నామ్ కే వాస్తే ప్రకటనలు ఇచ్చారు తప్ప కొత్త సీఎంనుగానీ, సినిమాటో గ్రఫీ మంత్రిని కానీ ఇప్పటి వరకూ నేరుగా కలసి బొకే ఇవ్వలేదు… ఈనేపధ్యంలో సినిమాటో గ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఇండస్ట్రీలో అసలేం జరుగుతోందని ఆరా తీశారు.
తనకు వెంటనే నివేదిక పంపాలని ఆదేశించారు. కోమటిరెడ్డిని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తప్ప మరెవరూ ఇప్పటి వరకూ కలవక పోవడం, అభినందనలు తెలపక పోవడంతో అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? వారేమనుకుంటున్నారు అన్న అంశాలపై కూపీ లాగుతున్నారు కోమటిరెడ్డి..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సినిమా ఇండస్ట్రీలో ఇంత రిలాక్సింగ్ మూడ్ ఏంటి? సంబంధిత మంత్రిని కలవకపోవడం ఏంటి అన్న వాదనలు వినిపిస్తున్నాయ్. కొంపదీసి గత కాంగ్రెస్ ప్రభుత్వంలోలాగా మళ్లీ ఇండస్ట్రీ రిలాక్స్ అయిపోతోందా? TS