AP
పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నది సామెత.. రెండు రాష్ట్రాలు చేజారినా (రాజస్థాన్, చత్తిస్ గఢ్) ఫర్లేదు తెలంగాణలో అధికారం దక్కడంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది కాంగ్రెస్… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోసం ఏపీలో నిలువునా కాంగ్రెస్ ను చంపేసుకుంది ఆపార్టీ అధిష్టానం. నష్టపోయినా ఫర్వాలేదు మాట కు కట్టుడి తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు సోనియా. తీరా చూస్తే రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్రం ఇచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదు. కేసీఆర్ పదేళ్లు అప్రతిహతంగా పాలించాక ఇప్పుడు కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది. సో.. తమకు మంచిరోజులు వచ్చాయి అన్న భావనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో పడింది.రేవంత్ వచ్చాక కాంగ్రెస్ ఫేస్ వాల్యూ గణనీయంగా పెరిగింది. రేవంత్ చరిష్మాను, ఇమేజ్ ను వినియోగించి ఏపీలోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలలో ఉంది హై కమాండ్.
షర్మిల కాంగ్రెస్ అస్త్రమా?
వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు.. వైఎస్ చరిష్మాను వారసత్వంగా పొందిన షర్మిల కాంగ్రెస్ కి ఒక పెన్నిధిలా కనిపించారు. ఏపీలో సొంత అన్నతో వైరం ఉండనే ఉంది.. ఇకనేం షర్మిల సేవలు వినియోగించుకుంటే పార్టీ అధికారంలోకి రాకపోయినా, కనీసం గౌరవ ప్రదమైన ప్రతిపక్ష హోదా అయినా దక్కకపోదా అనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ హై కమాండ్. తెలంగాణలో పార్టీ పెట్టి తీవ్రంగా నష్టపోయిన షర్మిల చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పడనివ్వలేదు. షర్మిలను తెలంగాణ బిడ్డగా ఒప్పుకోబోమని కావాలంటే ఏపీలో ఆమె సేవ చేయాలని పట్టుబట్టాయి. ఈ తిరకాసుతో అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈలోగా తెలంగాణ ఎన్నికలు వచ్చేశాయి.
బహిరంగ సభల పర్యవేక్షణ AP
ఎందుకో ఏమో గానీ షర్మిల ఏపీలో పనిచేసేందుకు జంకుతున్నారు. సొంత అన్నతో విభేదించి తెలంగాణకు వచ్చిన తాను మళ్లీ అదే అన్నను రాజకీయంగా ఢీ కొనాల్సి రావడంపై ఆమె తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే హై కమాండ్ షర్మిలకు ఏపీలో కాంగ్రెస్ ఎలక్షన్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రియాంక గాంధీ విశాఖలో బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రత్యేక హోదా హమీ, అమరావతి ఏకైక రాజధాని హామీతో అమరావతిలో రాహుల్ గాంధీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏర్పాట్లన్నింటినీ షర్మిల దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. దీనికి ప్రతిగా షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా పంపాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని ఏపీ కాంగ్రెస్ నేత గిడుగు రుద్ర రాజు సూచన ప్రాయంగా తెలిపారు. అంటే షర్మిల ఏపీ పాలిటిక్స్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయ్యిందన్న మాట. AP
ఏపీపై తెలంగాణ ప్రభావం…
మరిప్పుడు ఏపీలో షర్మిల కాంగ్రెస్ జెండా పట్టుకుని అన్నకు ఎదురు నిలబడితే జగన్ ఎలా కౌంటర్ ఇస్తారన్నది చూడాలి. సర్వేలన్నీ జగన్ కు పట్టం కడుతున్నా.. తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణల ప్రభావం ఏపీపై తప్పకుండా ఉంటుంది కాబట్టి జగన్ కు ఈసారి ఎన్నికలలో గెలుపు అంత సులభం కాదని అర్ధమవుతోంది.
తిలాపాపం తలాపిడికెడు AP
కానీ ఇక్కడో అంశముంది. ఏపీకి సరైన రాజధాని లేకుండా, హోదా ఇవ్వకుండా అన్యాయంగా విడదీసిన పాపం కాంగ్రెస్ దే. కనీసం హైదరాబాద్ ఆదాయంలో వాటా కూడా ఇవ్వలేదు. పోలవరం కడతామన్న హామీకి అతీ గతీ లేదు… విభజన తో ఏపీకి సోనియా అండ్ కో చేసిన నష్టం చిన్నదేమీ కాదు. అందుకే అక్కడ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా నాశనమైంది. ఇప్పుడు ఏపీలో అధికారం దక్కాలంటే పాత హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పాలి. కానీ ఉట్టికెక్కలేనమ్మ, స్వర్గానికి వెళ్లినట్లు కేంద్రంలో అధికారం లోకి రాకుండా ఈ హమీలు ఎలా అమలు చేస్తుంది? అక్కడ నరేంద్ర మోడీ అనే ఆజాను బాహుడు హాట్రిక్ విజయం కోసం సిద్ధంగా ఉన్నాడు.. కాబట్టి కాంగ్రెస్ చేసే ప్రయత్నం ఒక సర్కస్ ఫీట్ లా మిగిలినా ఆశ్చర్యం లేదు. AP