Gaja
గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. గాజా టన్నెల్స్ లో తిష్ట వేసిన ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సముద్రపు నీటిని సొరంగాల్లోకి పంప్ చేస్తోంది. చిక్కకుండా, దొరక్కుండా తప్పించుకుంటున్న హమాస్ దళాలను ఉన్నవారిని ఉన్నట్లే మట్టు పెట్టే వ్యూహమైన సీ వాటర్ పంపింగ్ ప్రక్రియను అమలు చేస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తన ప్రణాళికను అమలు చేస్తోందని ఇది ఇంకా తొలి దశలోనే ఉందనీ అమెరికా ప్రకటించింది. అయితే సొరంగాల్లోకి సముద్రపు నీరు పంప్ చేసే ప్రక్రియ పూర్తిగా అమలు కావడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్టొచ్చని అమెరికా అంచనా వేస్తోంది. ఈ ప్లాన్ వల్ల హమాస్ దళాలు సజీవ సమాధి అయిపోతాయి. వారు దాచిన ఆయుధాలు కూడా ఎందుకూ పనికి రాకుండా పోతాయి. వాళ్లు సేఫ్ డెన్ లుగా భావిస్తున్న ఛాంబర్లు, బందీలను దాచిన ప్రదేశాలు ఈ దెబ్బకు నీట మునుగుతాయని ఇజ్రాయెల్ దళాలు లెక్కలేస్తున్నాయి. అయితే సముద్రపు నీటిని ఇలా పంప్ చేయడం వల్ల గాజాలోని భూగర్భ జలవనరులు పాడైపోయే ప్రమాదముంది.
సీ వాటర్ పంపింగ్ తోనే ఫలితాలు Gaja
ఇజ్రాయెల్ దళాలు ఈ సొరంగాలను దెబ్బతీయడానికి భారీగా బంకర్లను ధ్వంసం చేసే బాంబులను, రసాయనిక ద్రవాలను వినియోగించాలని తొలుత భావించాయి. కుక్కలను పంపడం, రోబోలు, డ్రోన్ల ద్వారా వారి ఉనికిని కనుగొనాలని మొదట అనుకున్నాయి. అయితే వీటివల్ల వంద శాతం ఉగ్రవాదుల ఏరివేత సాధ్యం కాకపోవచ్చని ఇజ్రాయెల్ దళాలు అంచనా వేస్తున్నాయి. అందుకే సముద్రపు నీటిని పంప్ చేయడం ఒక్కటే సరైన ఫలితాలను ఇస్తుందని ఆ దళాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద పెద్ద పొడవైన పంపులను గాజా కు దగ్గరగా చేర్చినట్లు సమాచారం. మధ్యధరా సముద్రం నుంచి నీటిని తోడి ఈ సొరంగాల్లోకి పంప్ చేస్తున్నారు. గాజాలో దాదాపు 300 మైళ్ల పొడవైన సొరంగాలు ఉన్నాయి. పైగా వీటిని ఛేదించలేని తలుపులు కూడా ఉన్నాయి. (Gaja)
అమాయకులు బలవుతారంటున్న అమెరికా
అయితే ఇజ్రాయెల్ ఈ చర్యలను అమెరికా తప్పు బడుతోంది. సొరంగాల్లో ఉగ్రవాదులు బందీలను దాచి ఉంటే అమాయక పౌరులు చనిపోయే ప్రమాదముందని అందుకే ఈ చర్యలను తాము సమర్ధించలేకపోతున్నామని అధ్యక్షుడు బైడెన్ కామెంట్ చేశారు. ఏ ఒక్క పౌరుడు చనిపోయినా అది ఘోరమైన నేరం అవుతుంది. ఇజ్రాయెల్ ఒక మాట చెప్పి మరో చర్య చేపడుతోందని ఇది మంచి పద్ధతి కాదనీ బైడన్ వ్యాఖ్యానించారు.
2015లో ఈజిప్టులో కూడా ఇంతే! Gaja
సొరంగాల్లోకి సముద్రపు నీరు పంపడం అన్నది కొత్త కాన్సెప్ట్ కాదు.. 2015లో ఈజిప్టు ఇలాగే తమ దేశానికి దక్షిణాన గాజాలోకి ఉన్న టన్నెల్స్ ను ధ్వంసం చేసేందుకు సముద్రపు నీటిని పంపింది. ఆ సొరంగాల ద్వారా స్మగ్లింగ్,డ్రగ్స్ ఇతర కార్యకలాపాలకు ఉగ్రవాదులు పాల్పడుతుండటంతో ఈజిప్టు దేశం ఈ చర్యను అమలుచేసింది. అయితే ఈ ప్రక్రియ వల్ల స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టి, ఉగ్రవాదుల సొరంగాలు ధ్వంసం అయినా అంతకు మించి నష్టం కూడా జరిగిం. అక్కడి ఇళ్లు, పొలాలు నాశనమైపోయాయి. అలాగే భూ గర్భ జలవనరులు ధ్వంసమైపోయాయి. Gaja