APP
పైకి చేసేది ఆన్ లైన్ బెట్టింగ్ బిజినెస్.. కానీ అత్యంత రహస్యంగా గుట్టు చప్పుడు కాకుండా లోపల లోపల చేసేది మాత్రం మనీలాండరింగ్ వ్యాపారం..మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్న ఈ వ్యాపారం ఈడీ రంగ ప్రవేశంతో బయట పడింది. ఇదే నెట్ వర్క్ తో లింకులున్న కోల్ కతా, భోపాల్, ముంబై తదితర మెట్రోపాలిటన్ నగరాల్లో జరిపిన సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్ షోర్ ఖాతాలకు తరలించేందుకు హవాలా రూట్ ను ఎంచుకుంటున్నారని ఈడీ గుర్తించింది. చివరకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చాటుమాటుగా ఈ బెట్టింగ్ కార్యకలాపాల్లో ఉండటం పెద్దమొత్తంలో నగదును విదేశాలకు తరలించడం ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ దృష్టికి వచ్చింది.
ఈ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ ను దుబాయ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈడీ కోరిక మేరకు ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ ఆధారంగా దుబాయ్ లో పోలీసులు రవి ఉప్పల్ ను పట్టుకున్నారు. వాస్తవానికి రవి ఉప్పల్ ను గత వారమే అరెస్టు చేసినా బయటకు సమాచారం లీక్ అవడం ఆలస్యం అయిందని తెలుస్తోంది. త్వరలోనే రవి ఉప్పల్ ను భారత్ తీసుకు రానున్నారు. ఇక మరో యజమాని సౌరభ్ చంద్రశేఖర్ కోసం గాలిస్తున్నారు. APP
మహదేవ్ బెట్టింగ్ యాప్ కు రాజకీయ లింకులు కూడా ఉన్నాయి.. చత్తిస్ గఢ్ ఎన్నికల్లో పెద్దఎత్తున అప్పటి ముఖ్యమంత్రి భూపేష్ భాగల్ కు ఈ యాప్ నిర్వాహకులు రూ.500కోట్లు చెల్లించినట్లు, అసలీ బెట్టింగ్ ద్వారా వీరు రోజుకు రూ.200 కోట్లు సంపాదిస్తున్నారని ఈడీ ఆరోపణలు చేసింది.
బెట్టింగ్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు… APP
అయితే ఈ కేసులో బాలివుడ్కు చెందిన కొంతమంది పేర్లు బయటపడటం కలకలం రేపుతోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల్లో ఒకరి వివాహానికి వీరు హాజరు కావడంతో బాలీవుడ్ కు ఈ బెట్టింగ్ నిర్వా హకులకు ఉన్న లింకులు బయటపడ్డాయి. బాలీవుడ్ నటులకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దుబాయ్ కేంద్రంగా దేశంలోని సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ అనే ఇద్దరు వ్యక్తులు మహదేవ్ బెట్టింగ్ యాప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
కొత్త కొత్త యూజర్లకు ఎర
బెట్టింగ్ యాప్ నిర్వాహకులైన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ చత్తిస్ గఢ్ లోని భిలాల్ ప్రాంతానికి చెందిన వారు. వీరిద్దరూ కలసి ఈ బెట్టింగ్ యాప్ వ్యాపారం మొదలు పెట్టారు. కొత్త కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ బెట్టింగ్ యాప్ పెద్ద అడ్వర్టైజ్ మెంట్ల కోసం ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైనటువంటి సౌరభ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్లో జరిగింది.
దాదాపు పెళ్లి కోసం 200 కోట్లు… APP
అయితే ఈ పెళ్లి కోసం దాదాపు 200 కోట్ల రూపాయలకు ఖర్చు చేసినట్టు తెలిసింది. బాలీవుడ్ సెలబ్రీటలను కూడా ఈ పెళ్లికి ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది. అయితే ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాప్, సన్నీ లియోన్ , నేహా కక్కర్, అతీఫ్ అస్లాం, రహత్ ఫతేహ్ అలీ ఖాన్ తదితరులు హాజరయ్యారు. వీరి కోసం ప్రత్యేకంగా ఓ ప్రైవేటు జెట్ను కూడా ఏర్పాటు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు తెలిపాయి. కార్యక్రమం కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి 112 కోట్ల రూపాయలు హవాలా మార్గంలోనే నిర్వాహకులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. అంతేకాదు ఒక్క హోటల్ గదుల కోసమే ఏకంగా 42 కోట్ల రూపాయలు చెల్లించినట్లు గుర్తించింది. అలాగే మరో నిర్వహకుడు రవి ఉప్పల్ నిర్వహించినటువంటి పార్టీలో కూడా బాలీవుడ్ సెలబ్రిటలు పాల్గొన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే హవాలా మార్గంలో వచ్చినటువంటి డబ్బుల ద్వారా బాలీవుడ్ సెలబ్రిటీలకు అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చెల్లింపులు జరిపినట్లు తెలిసింది. దీనివల్ల బాలీవుడ్ సెలబ్రిటీలకూ ఈడీ సమన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి.
70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా…
మహాదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ భారత్లో 4వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్కు సుమారు 200 మంది కస్టమర్లున్నారు. దీని ప్రకారం రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతోంది. 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. APP