sruthi shesh movie
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేషు. మేజర్ మూవీలో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. మేజర్ మూవీ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ ఆదారంగా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది ఈ మూవీ. అడవి శేషు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మేజర్ మూవీ. యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు అడవి శేషు.
విభిన్నమైన కథనాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. తన నటనకు గాను ఎంతో క్రేజ్ దక్కించుకున్నాడు. గూఢచారి, మేజర్, హిట్-2 సినిమాలు శేషుకి మంచి గుర్తింపును తెచ్చాయి. లెటేస్ట్ న్యూ మూవీ అప్డేట్ ఇచ్చాడు శేషు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రాబోతుందని సమాచారం.
శృతిహాసన్-అడవి శేషు కాంబినేషన్ న్యూ మువీ sruthi shesh movie
టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు అడవి శేషు. ఈ హీరో మరొక మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ శేషుకి జోడిగా నటించబోతుందట. పలు సినిమాలకు చాయాగ్రహకుడిగా పనిచేసిన షనిల్ డియో దీనికి దర్శకత్వం వహిస్తున్నాడట. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో సుప్రియ నిర్మిస్తుందట. అడివి శేష్ మరోసారి బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాను తెలుగు,హిందీ భాషల్లో చిత్రకరించబోతున్నారట. ప్రతి సీన్ లు, డైలాగులు రెండు భాషల్లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా అడవి శేషు, శృతిహాసన్ కాంబినేషన్ లో రాబోతుందని తెలిసిన ప్రేక్షకులు చాలా అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు మేకర్స్.
అడవి శేషు మూవీతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం కానున్న షనిల్
డైరెక్టర్ షనిల్ మొదటిసారి లైలా అనే ఒక షార్ట్ ఫిలిం కు దర్శకత్వం వహించాడు. ఈ షార్ట్ ఫిలిం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కు అధికారికంగా ఎంపిక చేయడం జరిగిందట. ఆ కిక్ ఇచ్చిన సంతోషంలో తన ఫస్ట్ మూవీని అడవి శేషుతో డైరెక్ట్ చేయబోతున్నాడు షనిల్. ఈ మూవీకి సంబంధించిన మరికొన్ని విషయాలను మూవీ యునిట్ త్వరలో తెలియజేయబోతున్నట్లు సమాచారం. టైటిల్ రివిల్ చేయని ఈ మ్యాసివ్ ప్రాజెక్ట్ అడివి శేష్ కి రెండో స్ట్రయిట్ హిందీ మూవీ కానుందట. sruthi shesh movie
గూఢాచారీ-2 సినిమాతో మన ముందుకు రానున్న అడివి శేషు sruthi shesh movie
గూఢాచారీ సీక్వెల్ గా రానున్న మూవీ గూఢాచారీ-2. ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో కొనసాగుతుందట. గూడాచారీ పార్ట్-1 భారతదేశంలో జరిగితే పార్ట్-3 ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు ప్రయాణించబోతుందట. ఈ మూవీకి ఎడిటర్ వినయ్ కువర్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్ధలు సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయంగా పెద్ద విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట.