smitha sabrwal tweet
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాలను ఎన్నికల ప్రచారం టైమ్ లోనే తప్పుబట్టిన రేవంత్ అన్నింటినీ తవ్వి తీస్తామని, తప్పులు చేస్తే జైలుకేనని బీఆర్ఎస్ అధినేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు సీఎం అయ్యాక ఆయన ధరణి మీద, కాళేశ్వరం మీద రివ్యూ మీటింగులు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం అవకతవకలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ఎన్నికల ప్రచారం టైమ్ లోనే రేవంత్ చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
రేవంత్ మీటింగులు పెడుతుంటే అటు హరీష్ రావు, కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లా ఆలోచించి ఉంటే తొలిసారి తమ ప్రభుత్వం వచ్చినప్పుడే సగం మంది కాంగ్రెస్ నేతలను జైలు పాలు చేసి ఉండేవారమని హరీష్ రావు అన్నారు.మరోవైపు అలవికాని హామీలిచ్చి ఇప్పుడు ప్రభుత్వం అప్పులు చేసిందంటూ బొంకుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోశారు. చూస్తుంటే రెండు పార్టీల మధ్యా వార్ ఓ రేంజ్ లో సాగేలా కనిపిస్తోంది. పార్టీలు సరే.. రాజకీయ నేతలు సరే.. కానీ ఆ ఎఫెక్ట్ అధికార్ల మీద పడితే..
స్మితా సబర్వాల్ ట్వీట్ లో అంతుందా? smitha sabrwal tweet
ఇరిగేషన్ శాఖలో పరిస్థితిని సమీక్షించడానికి రేవంత్ నిర్వహించిన సమావేశానికి ఆశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ డుమ్మా కొట్టారు. ఇప్పటి వరకూ జరిగిన రెండు మీటింగులకూ స్మితా సబర్వాల్ హాజరు కాలేదు. పైగా ఇవాళ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ అనేక సందేహాలకు తెర తీస్తోంది. ఐఏఎస్ అధికారిగా తన 23 ఏళ్ల ప్రస్థానాన్ని పరోక్షంగా ప్రస్తావించిన స్మిత ఆ టైమ్ లో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను చవిచూసినట్లు పేర్కొన్నారు. తాను చూడని ఎత్తు లేదని, దిగని లోతు లేదనీ రాసుకొచ్చారు. ఇప్పుడు సరికొత్త ఛాలెంజ్ కు సిద్ధపడుతున్నాననీ అన్నారు.
ఆకరి లైన్ పైనే అందరిచూపు
తన భావాలకు అనుగుణంగా అప్పటి తన ఫోటోను కూడా జత చేశారు. స్మితా సబర్వాల్ ట్వీట్ లో ఈ ఆఖరి లైన్ పైనే అందరి చూపు పడింది. అంటే కాళేశ్వరం పై సిటింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తే సంబంధిత శాఖ అధికారిగా ఆమె ఈ విచారణను ఎదుర్కొనాల్సి వస్తుంది. లక్ష కోట్లు పోసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా ఉందని డ్యామ్ సేఫ్టీ నిపుణులు తేల్చడంతో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద అవినీతి బండ పడినట్లయ్యింది. smitha sabrwal tweet
ఈ తేనెతుట్టను ఇప్పుడు రేవంత్ కదిపితే కచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేది స్మితా సబర్వాల్ మాత్రమే.. పైగా కొత్త సీఎం రివ్యూ మీటింగులకు హాజరు కాకుండా ఒకరకంగా ఆమె కొంత అలక్ష్యాన్ని ప్రదర్శించినట్లే. వీటికితోడు కల్వకుంట్ల ఫ్యామిలీకి సన్నిహితులు అన్న ముద్ర ఉండనే ఉంది. కాబట్టి ఆమెకు స్థాన చలనం తప్పదని అర్ధమవుతోంది. ఆమె స్థానంలోనే కేంద్ర సర్వీసులనుంచి ఆమ్రపాలి వస్తున్నారన్నది అనధికారిక వార్త. కేసీఆర్ హయాంలోనే స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు తాజా పరిణామాలతో ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లీన్ చిట్ దొరకడం అనుమానమే.. ఈ పరిస్థితులన్నీ గ్రహించుకునే ఆమె ఆ ట్వీట్ చేశారని, ఆ ట్వీట్ లో చాలా లోతైన అర్ధం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సిన్సియర్ అధికారిగా పేరు smitha sabrwal tweet
సోషల్మీడియాలో యాక్టివ్ గా ఉండే స్మితా సబర్వాల్ సిన్సియర్ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మెదక్ కలెక్టర్ గా ఉన్న ఆమె పనితీరుకు ముగ్ధుడైన కేసీఆర్ ఆమెను తన పేషీలో నియమించుకున్నారు. అప్పటినుంచి స్మిత బీఆర్ ఎస్ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటూ వచ్చారు. ఆమె భర్త అకున్ సబర్వాల్ కూడా ప్రభుత్వంలో సీనియర్ అధికారే. టాలీవుడ్ డ్రగ్స్ కేసును విచారించినది ఆయనే. మొదట్లో విచారణ దూకుడు పెంచినా ఆ తర్వాత సినీ ప్రముఖులందరికీ క్లీన్ చిట్ ఇచ్చి ఆ కేసును మూసివేశారు. smitha sabrwal tweet