YCP
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో ప్రభావం చూపుతాయి.. రాజకీయ సమీకరణలు మారతాయి అని ప్రత్యర్ధులు ఎంతో ఆశతో వ్యూహరచన చేస్తున్న వేళ ఏపీలో ఒకే ఒక్కడు సీఎం జగన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.. రానున్న ఎన్నికల కోసం ఒక వ్యూహంతో ముందుకెళుతున్నారు. మేనిఫెస్టో అమలు చేసుకుంటూ అడుగులేస్తున్నారు. ప్రత్యర్ధులకు ఎన్నికల అస్త్రాలన్నవి లేకుండా సమస్యలన్నింటినీ క్లియర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉద్దానం ప్రాంతం చూపించి ఏదో మైలేజీ పొందాలనుకున్న పవన్ కల్యాణ్ కు ఏమీ మిగల్చకుండా ఊడ్చేస్తున్నారు. పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ను, వైఎస్సార్ సుజల ధార పంప్ హౌస్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన వివరణాత్మక ప్రసంగం చేశారు. 99శాతం వాగ్దానాలను అమలు చేశానని గర్వంగా చెప్పుకున్నారు. జగన్ గొప్పలు చెప్పుకున్నారని కాదు గానీ.. నిజంగా ఆయన ప్రభుత్వాన్ని అభినందించి తీరాల్సిందే.. ఇన్నాళ్లలో, ఇన్నేళ్లలో ఏ ముఖ్యమంత్రీ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినది లేదు.
అసలు ఉత్తరాంధ్ర అంటేనే అందరికీ చిన్నచూపు.. YCP
వెనుకబడిన ప్రాంతమని నిర్లక్ష్యం.. అలాంటి ప్రాంతానికి జనసేనాని పవన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ సమస్య బాగా పాపులర్ అయ్యింది.వెలుగులోకి వచ్చింది. పవన్ కల్యాణ్ సెలబ్రిటీ కాబట్టి ఈ ఇష్యూకి గుర్తింపు వచ్చింది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇచ్చిన హమీలను అమలు చేశారు. నెంబర్ వన్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చారు.
ఉద్దానం లాంటి ఏరియాలో 200 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణం అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చాకే అక్కడ డయాలసిస్ సెంటర్లు పెరిగాయి. డయాలిసిస్ పేషెంట్లకు ఇచ్చే పెన్షన్ పదివేలు రూపాయలు చేశారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఐదువేలు ఆర్దిక సాయం అందిస్తున్నారు. అంతు చిక్కని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు. అక్కడున్న 13 వేలమంది కిడ్నీ రోగుల కోసం 12 కోట్ల రూపాయల పెన్షన్ సాయం అందిస్తున్నారు. YCP
ఉద్దానం ప్రాంతం యొక్క సమస్యలను తీర్చిందేవరు.. YCP
తాగు నీటితో సమస్యలు వస్తున్నాయన్న తలంపుతో అక్కడకు దగ్గరలోని హీరమండలం నుంచి పైప్ లైన్ల ద్వారా తాగు నీరు సరఫరాను అందించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే ఉద్దానం ప్రాంత సమస్య చాలా వరకూ తీరిపోయింది. 2018లో ఎన్నికల ప్రచార సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన జగన్ తానిచ్చిన హామీ మేరకు అన్నీ సౌకర్యాలూ అక్కడ కల్పించారు. అంతే కాదు ఇప్పుడు కిడ్నీ మార్పిడి సెంటర్ ను కూడా అక్కడ ప్రారంభించబోతున్నారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభంతో దేశంలోకే ఆదర్శవంతంగా ఉండబోతోందని ప్రకటించారు జగన్..
ప్రకాశం బాధితుల కోసం వెలిగొండ పూర్తి..
అంతేకాదు ప్రకాశం జిల్లా మార్కాపూరంలోనూ ఫ్లోరైడ్ కారణంగా కిడ్నీ సమస్యలు పెరుగుతుండటంతో ఆ ప్రాంత తాగునీటి సమస్య పరిష్కారం కోసం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశారు. మార్కాపురంలో నెఫ్రాలజీ, యూరాలజీ సెంటర్లతో కూడిన మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అభివృద్ధి అంటే తమ ప్రభుత్వమే అన్నట్లుగా జగన్ పరిపాలన చేస్తున్నారు.
క్రెడిట్ వైసీపీదే.. YCP
రాజకీయాలు కాసేపు పక్కన పెడితే ఉద్దానం సమస్య గానీ, ప్రకాశం జిల్లా సమస్యగానీ ఇన్నేళ్లలో ఏ సీఎం పట్టించుకోలేదు. పరిష్కరించలేదు.రాజకీయపార్టీలు వాటిని ఎన్నికల అస్త్రాలుగానే మార్చుకున్నాయి తప్ప ప్రజల కోసం ఏదైనా చేద్దాం అన్న ఉద్దేశంతో పనిచేయలేదు. కేవలం జగన్ వచ్చాకే ఉద్దానంపై ఇంత ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే జగన్ ను అభినందించి తీరాలి. YCP